రాజమండ్రిలోని గైట్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై వాస్తవాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానితో ఎపుడు కలిసినా పాడిందేపాటగా ఒకే అంశం ప్రత్యేక హోదా అంటారు. గతంలో అడిగినవే అడిగారు. ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో ఏమేమి అంశాలుపెట్టారో బయటకు రానివ్వరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తున్నారు.…
రాష్ట్రంలో పేదలకు కడుతున్న ఇళ్ళపై సీపీఐ రామకృష్ణ విమర్శలకు మంత్రి బొత్స కౌంటరిచ్చారు. విశాఖలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. పిచ్చుక గుళ్ళు లాంటి ఇళ్లు కడుతున్నారని విమర్శిస్తున్నారు. పేదలకు ఇళ్ళు ఇస్తే మీకెందుకు ఇబ్బంది అని ప్రశ్నించారు. హౌసింగ్ బోర్డు ప్రారంభమైన తర్వాత ఎప్పుడైనా ఇంతకంటే పెద్ద ఇళ్లు కట్టారా? సిద్దాంతాల గురించి మాట్లాడే బీజేపీ, కమ్యూనిస్టులు ఒకే వేదికపైకి వస్తారు. వీళ్ళ మధ్యలో టీడీపీ.దాని వెనుక తోకపార్టీ జనసేన నడుస్తున్నాయన్నారు.ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు వ్యాఖ్యలకు…
పేదల ఇళ్ల స్థలాలు.. ఇళ్ల నిర్మాణంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో భారీ అవినీతి జరిగిందని తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ. 10 వేల కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేస్తే.. రూ. 4 వేల కోట్ల అవినీతి చోటు చేసుకుందన్నారు.ఇళ్ల స్థలాల కొనుగోళ్ల విషయంలో ఓ ఎంపీని…
వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో ఇంటికి ఒకటే మీటర్ ఉండాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు నోటీసులివ్వడం దుర్మార్గమని ఆయన అన్నారు. దశాబ్దాల కాలం నుంచి ఒక ఇంటిలోని పోర్షన్ల ఆధారంగా విద్యుత్ సంస్థలు మీటర్లు ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు ఒకే ఇంట్లో ఎన్ని పోర్షన్లు ఉన్నప్పటికీ ఓకే మీటర్ ఉంచి, మిగతావి రద్దు చేసుకోవాలని ఎలక్ట్రిసిటీ అధికారులు నోటీసులు ఇస్తున్నారని ఆయన అన్నారు. ఫలితంగా మీటర్…
ఏపీలో 3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహాపాదయాత్రను ప్రారంభించారు. గత నెల 1న ప్రారంభమైన ఈ పాదయాత్రం ఈ నెల 15న ముగియనుంది. 45 రోజుల పాటు సాగనున్న రైతుల పాదయాత్ర తిరుమలలో ముగిసే విధంగా ప్రణాళికను సిద్దం చేశారు. అయితే రాజధాని రైతుల పాదయాత్రకు ఊరురా ప్రజలు, రైతులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే తాజాగా రైతుల పాదయాత్ర…
ఏపీలో రాజకీయ పరిస్థితులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో గాడి తప్పిందని ఆయన అన్నారు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం దివాళా దిశగా సాగుతోందని, అప్పులు తీసుకువస్తే తప్పా రాష్ట్రానికి మనుగడలేని దుర్భర పరిస్థితిలు నెలకొన్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఇసుక, ఇటుక, ఉక్కు ధరలు పెరిగి సామాన్యుడికి అందని ద్రాక్షలా మారాయన్నారు. జగన్ ప్రభుత్వం తిరోగమన చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. ఎన్నికల్లో హామీలు గుప్పించిన జగన్…
వివేకా హత్య కేసులో కీలక సమాచారం అందించినవారికి సీబీఐ రూ.5 లక్షలు నజరానా ప్రకటించడంపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకేసులో ఆధారాలిస్తే పారితోషికం ఇస్తామనడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. వివేకాను చంపింది ఎవరో పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీలను అడిగితే చెబుతారని రామకృష్ణ పేర్కొన్నారు. ఏళ్లతరబడి విచారణ చేస్తున్న కేసు పూర్తికాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా అంశాలపై…
గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద బీటెక్ విద్యార్థిని రమ్యను అతి కిరాతకంగా హత్య చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలి అని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బీటెక్ విద్యార్థిని రమ్య ను ఓ దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. అయితే స్వాతంత్ర దినోత్సవం రోజున ఇటువంటి దారుణం జరగటం బాధాకరం అని తెలిపారు. గతేడాది ఆగస్టు 17న కర్నూలు జిల్లా ఎర్రబాడు గ్రామంలో హజీరా అనే యువతిని హత్య చేసిన దుర్మార్గుడిని ఇంతవరకు పట్టుకోలేకపోయారు అని పేర్కొన్నారు.…
విశాఖ స్టిల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రజాసంఘాలు, ట్రేడ్ యూనియన్స్ పాల్గొన్నాయి. స్టిల్ ప్లాంట్ ను కాపాడుకొనేందుకు జులై నెలాఖరున భారీగా ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు చెప్పట్టాలని తీర్మానం చేసారు. ఇక ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ… 150 రోజులుగా స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమాలు చేస్తున్న కేంద్రం స్పందించటం లేదు. సోము వీర్రాజు ప్రైవేట్ పరం చెయ్యటం లేదంటూ ఇంకా ప్రజలని మభ్యపెడుతున్నారు. పోర్ట్…
బోర్డర్లో అంబులెన్స్ లను నిలిపివేయడం వల్ల జరుగుతున్న మరణాలకు తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. చెక్ పోస్టుల వద్ద పడిగాపులు కాచి ఈరోజు అంబులెన్స్ లో ఇద్దరు రోగులు చనిపోవడం బాధాకరం అని అన్నారు. తెలంగాణ హై కోర్ట్ చెప్పినప్పటికీ ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోకుండా కనీసం మానవత్వం చూపించడం లేదు అని విమర్శించారు. అయితే తెలంగాణలో లాక్డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. బోర్డర్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది…