పేరుకే అది ఒంగోలు నగర పాలక సంస్థ. నగరంలో మూడు-నాలుగు రోజులకు ఒక సారే నీళ్లిస్తారు. అది కూడా అర్థరాత్రి దాటాకే. ఇక శివారు ప్రాంతాలకు అరకొర ట్యాంకర్లే గతి. దీంతో గుక్కెడు మంచినీళ్ల కోసం అవస్థలు పడాల్సివస్తోంది. మూడు లక్షలకు పైగా జనాభా ఉన్న ఒంగోలు నగరంలో ఈ దుస్థితి ఇంకెన్నాళ్ళు అంటున్నారు ప్రజలు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంచినీటి కోసం జనం జాగారాలు చేయాల్సి వస్తోంది. ఒంగోలు నగరంలో…
ఏపీ రాజధానికి మరో హంగు రాబోతోంది. అమరావతి త్వరలో కార్పొరేషన్గా మారబోతోంది. రాజధానిలోని 19 గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటుకానుంది. ఈమేరకు నోటిఫికేషన్ జారీ చేశారు గుంటూరు జిల్లా కలెక్టర్. దీనిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఏపీ రాజధాని అమరావతిని నగరపాలక సంస్థగా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ గా మార్చనుంది. రాజధానిలోని 19 గ్రామాలను ఈ కార్పొరేషన్ లో చేర్చనున్నారు. తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు, మంగళగిరి…