పెట్రోల్, డీజిల్ ధరలపై సీఎం కేసీఆర్ ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడంలేదని నిలదీశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. పెట్రో ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో సంగారెడ్డి పాత బస్టాండ్ దగ్గర నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీజిల్, పెట్రోల్, నిత్యావసర ధరలు యూపీఏ హయాంలో అదుపులో ఉన్నాయి.. కానీ, ప్రధాని మోడీ ఈ ఏడేళ్ల పాలనలో ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని విమర్శించారు.. మోడీ పెట్రో ధరలను సెంచరీ దాటించారని…
పెట్రోల్,డిజిల్ ధరల పెంపును నిరసిస్తూ వరంగల్ నగరంలో కాంగ్రెస్ నేతల ధర్నా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెట్రోల్,డిజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో చేసిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ సందర్బంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ… ప్రభుత్వం 35 రూపాయలు పెట్రోల్ కి 65 రూపాయల టాక్స్ వసూలు చేస్తుంది అన్నారు. సాధారణ ప్రజల దగ్గర ఇంత దోచుకుంటూ పెద్ద పెద్ద ప్రైవేట్ వ్యాపారులు చెల్లించనీ లోన్లు…
జగిత్యాల జిల్లా కేంద్రంలో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఏఐసిసి పిలుపుమేరకు పెట్రోల్, డీజిల్ గ్యాస్ పెరుగుదలకు నిరసనగా ఎమ్మెల్సీ జీవం రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్ చౌరాస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ శ్రేణులు రోడ్డుపై నిరసన తెలిపుతున్న తరుణంలో వారిని అరెస్ట్ చేసే క్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కొద్ధిసేపు…
కాంగ్రెస్ అధిష్ఠానంపై వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి భారీ శస్త్ర చికిత్స అవసరమని, కేవలం వారసత్వం, గత చరిత్రపై ఆధారపడకూడదని ఆ పార్టీ సీనియర్ నేత అన్నారు. బాధ్యతలను అప్పగించేటప్పుడు విశ్వాసమున్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఉత్తర ప్రదేశ్లోని కీలక నేత జితిన్ ప్రసాద ఆ పార్టీని వీడి, భారతీయ జనతా పార్టీలో చేరడంపై ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. జితిన్ ప్రసాద మిగిలిన అన్నింటికన్నా తన వ్యక్తిగత ఆకాంక్షలకే ప్రాధాన్యం…
కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనే కాదు తన శవం కూడా భారతీయ జనతా పార్టీలో చేరదన్నారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన జితిన్ ప్రసాద తాజాగా బీజేపీలో చేరడంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. జితిన్ ప్రసాద నిర్ణయం వ్యక్తిగతం అంటూనే.. ఇన్నేళ్లు వ్యతిరేకించిన పార్టీలో ఎలా చేరతారంటూ ప్రశ్నించారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై లేఖ రాసిన నేతల్లో కపిల్ సిబల్ కూడా ఒకరు.. అలాంటి…
పార్టీ ఫెల్యూర్ పై చర్చ జరపాలని ఇంచార్జ్ మాన్నికమ్, సోనియా గాంధీకి లేఖ రాసారు వీ.హనుమంతరావు. అందులో అధినేత్రి ముందు ఇల్లు చక్కదిద్దుకోవలని చెప్పారు. కానీ తెలంగాణ పార్టీ మాత్రం పట్టించుకోవడంలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి వరుస ఎన్నికల్లో పార్టీ ఓడిపోతున్న రివ్యూలు లేవు. నాడు కుంతియా, నేడు ఠాగూర్ రివ్యూలు చేయడం మర్చిపోయారు. పార్టీకి బిసిలు దూరం అవుతున్నారు. తెరాస ఈటల పోతే మరో బీసీ ఎల్. రమనను తీసుకుంటున్నారు. తెరాస బిసిల…
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ.. ఓవైపు, ఎస్పీ, బీఎస్పీలు కూడా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.. ఇక, యూపీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ప్రియాంకాగాంధీ.. అయితే, యూపీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది.. పార్టీ సీనియర్ నేత.. గాంధీ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉన్న కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద్.. కాంగ్రెస్ పార్టీకి…
కాంగ్రెస్ ఎమ్యెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఠాగూర్ తన పైన చిన్న చూపు చూస్తున్నారని.. తెలంగాణలో బలమైన నాయకుడిగా ఠాగూర్ నన్ను గుర్తించకపోవడం నా దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. నేను పీసీసీ అడుగుతున్నా.. ఢిల్లీ చర్చలో తన పేరు లేకపోవడం దురదృష్టమన్నారు. ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలోనే బాంబే హైవే మీద కేసీఆర్ ను అడ్డగించిన చరిత్ర తనది అని.. ఇది ఠాగూర్ కు తెలువక…
రాష్ట్రంలో భయంకర పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఇండియా నుండి వచ్చే వారిని రానివ్వటం లేదు అని భట్టి విక్రమార్క సీఎల్పీ నేత అన్నారు. గతేడాది దీపాలు పెట్టండి చప్పట్లు కొట్టండి అంటూ ప్రధాని చెప్తారు. ఇంట్లో దీపం ఆర్పేసి భయట దీపాలు పెట్టండి అంటారు. వ్యాక్సిన్ కూడా లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి తీరు కూడా అలాగే ఉంది అని తెలిపారు. రాష్ట్రంలో ఇన్ని మరణాలకు కారణం సీఎం కేసీఆరే కారణం. కరోనా దెబ్బ తిన్న కుటుంబాలకు…
రాష్ట్రంలో కరోనాకు, బ్లాక్ ఫంగస్కు పూర్తిగా ఉచిత చికిత్సను అందించాలని డిమాండ్ చేస్తు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు హైదరాబాద్లోని గాంధి భవన్లో సత్యాగ్రహ దీక్షకు దిగుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సత్యాగ్రహ దీక్ష చేయబోతున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.