వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి ఎందుకు వెళ్లకూడదు… పీసీసీ నిద్రపోతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి అనేక మంది మాజీ మంత్రులు, నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో నిరూపించిన వ్యక్తి వైఎస్ఆర్ అని, విజయమ్మ ఆహ్వానం మేరకు తప్పకుండా వస్తానని చెప్పానని, చెప్పినట్టుగానే వచ్చానని అన్నారు. ఉదయం 7గంటలకు తాను బయలుదేరి వచ్చినట్టు తెలిపారు. ఆత్మీయ సమావేశానికి ఎందుకు వెళ్లకూడదని కాంగ్రెస్ ఆదేశాలు ఇచ్చిందో తెలియదని అన్నారు. పార్టీని అధికారంలోకి తెచ్చిన వ్యక్తి వైఎస్ఆర్ అని, మండుటెండలో పాదయాత్ర చేసిన వ్యక్తి అని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వేరే పార్టీ నేత వద్దకు వెళ్లి కాళ్లు మోక్కారని, తాను వచ్చింది కాంగ్రెస్ ముఖ్యమంత్రి సభకు అని అన్నారు. మా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సభకు పోవద్దని ఆదేశాలు ఇవ్వడం అనేది పిచ్చి చర్యగా ఆయన వర్ణించారు. ఆదేశాలను విత్డ్రా చేసుకోవాలని అన్నారు. నియోజక వర్గ పరిధిలో ఇతర పార్టీల నేతలు చనిపోతే సంతాప సభలకు వెళ్తాం అని, అలాంటిది మా సీఎం సభకు పోవద్దనడం కరెక్ట్ కాదని అన్నారు. మూడు రోజుల నుంచి విజయమ్మ అందరినీ ఆహ్వానిస్తున్నారని, పీసీసీ నిద్రయిందా అని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read: భాగ్యనగరంలో భారీ వర్షం…
Also Read
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?
-
TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
-
Spirit Release Date: సల్మాన్ ఖాన్ వర్సెస్ ప్రభాస్.. ‘స్పిరిట్’ డేట్ ఫిక్స్.. రూమర్స్ అన్నీ తుడిచిపెట్టేసిన మేకర్స్!
-
Sheraz Mehdi: టాలీవుడ్లో ఓ రకమైన మాఫియా.. హీరో సంచలన వ్యాఖ్యలు!
-
Peddi : పెద్ది ఎడిటింగ్’లో బిజీగా బుచ్చి.. అస్సలు వదిలేదే లే!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!