సోనియాతో కెప్టెన్ భేటీ.. సంక్షోభం ముగిసినట్టేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో సంక్షభానికి తెరదించేందుకు రంగంలోకి దిగారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ… ఢిల్లీ వెళ్లిన పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఆమెతో చర్చలు జరిపారు.. అంతర్గత విభేదాలతో, సంక్షోభంలో పంజాబ్లో అధికార కాంగ్రెస్ సతమతమవుతోంది.. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ తో ఢీ అంటున్నారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఈ రోజు ఉదయం కూడా “బూటకపు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల” వల్ల పంజాబ్ ప్రజల పై వేల కోట్ల రూపాయల అధిక భారం మోపారని విమర్శించారు.. అంతకుముందే, సోనియా గాంధీతో భేటీ అయ్యారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. గత వారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో విడివిడిగా ప్రత్యేకంగా సమావేశమై తన డిమాండ్లను వారి ముందుంచారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఇక, సంక్షోభ పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో సోనియా గాంధీ వేసిన కమిటీని 10 రోజుల క్రితం కలిశారు కెప్టెన్.
అయితే, పంజాబ్ లో ప్రధాన రాజకీయ అంశంగా మారిపోయింది “విద్యుత్ సరఫరా”.. బాదల్ హయాంలో జరిగిన ఒప్పందాల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సిద్ధూ.. ప్రజలపై అదనపు భారం మోపుతూ గత అకాలీదళ్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలకు వ్యతిరేకంగా కొత్త చట్టం తీసుకురావాలని కోరారు.. దీనిపై త్వరలోనే న్యాయపరమైన వ్యూహాన్ని రూపొందిస్తామని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అంటుండగా.. కొన్ని రోజులుగా ఈ అంశంపై బీజేపీ, ఆప్ పార్టీలు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.. అయితే, ఇవాళ సోనియాగాంధీతో జరిగిన సమావేశం సంతృప్తికరంగా ముగిసిందా..? ఇక సంక్షోభానికి తెరపడిందా? అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే, కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తానని సోనియాతో సమావేశం ముగిసిన తర్వాత తెలిపారు అమరీందర్ సింగ్… సిద్ధూ కోసం ఒక కీలక పోస్టుపై ఏదైనా ప్రకటన చేయబడుతుందా? అనే ప్రశ్నికు స్పందిస్తూ.. ఏ నిర్ణయమైన, ఏమైనా కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటంది.. మేం దానిని అనుసరిస్తాం అన్నారు.. ఇటీవల, పంజాబ్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకుంటుండగా.. సిద్ధూ మాత్రం ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం మరియు పంజాబ్ కాంగ్రెస్లో తనకు కీలక పదవులు కట్టబెట్టాలని ఆయన డిమాండ్ చేసినట్టుగా ప్రచారం సాగుతోంది.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!