హుజురాబాద్లో ‘దళిత బంధు’ స్కీమ్ పెడితే తప్పేముంది.. స్కీమ్ ద్వారా రాజకీయంగా లాభం కోరుకోవడంలో తప్పు ఏముంది ? టీఆర్ఎస్ రాజకీయ పార్టీయే కదా ? అని వ్యాఖ్యానించారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్… తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో.. కౌశిక్రెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ వలస కాలనీ అవుతాదా అనే ఆవేదన ఉండేది.. పిడికడు మందితో ఉద్యమం స్టార్ట్ చేశాం.. తెలంగాణ ఆకాంక్ష 2014…
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్రెడ్డి.. టీఆర్ఎస్లో పార్టీలో చేరారు… తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ కండువా కప్పి.. కౌశిక్రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఇక, కౌశిక్రెడ్డి వెంట వచ్చిన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కౌశిక్రెడ్డి.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక, ఈ మధ్య ఆయనకు సంబంధించిన…
ఓవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే.. మరోవైపు పంజాబ్లో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ముదిరిపోతున్నాయి… సీఎం అమరీందర్ సింగ్, పీసీసీ కొత్త చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూకి అసలు పొసగకుండా తయారవుతోంది పరిస్థితి.. కాంగ్రెస్ అధిష్టానం, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ జోక్యం చేసుకుని సిద్ధూకి పీసీసీ చీఫ్ పోస్టు ఇచ్చిన తర్వాత కూడా పరిస్థితి సద్దుమనిగినట్టు కనిపించడంలేదు.. ఇక, తనకు మద్దతుగా ఉన్న 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇవాళ సిద్ధూ సమావేశం అయ్యారు.. అమృత్సర్లోని…
దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. దేశంలోని ప్రముఖులకు చెందిన ఫోన్ నెంబర్లు ఇప్పటికే హ్యాకింగ్కు గురైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా ఇప్పుడు మరో విషయం బయటకు వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఆ పార్టీలకు చెందిన నేతల ఫోన్ నెంబర్లపై కూడా నిఘా ఉంచినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి ఇది కూడా ఒక కారణం అనే అనుమానాలు…
మణిపూర్ కాంగ్రెస్ కు మరోషాక్ తగిలింది. ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేస్తున్న బీజేపీ ధాటికి కాంగ్రెస్ పార్టీ కుదేలవుతున్నది. వచ్చే ఏడాది అనేక రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలా ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో మణిపూర్ కూడా ఒకటి. మణిపూర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షపదవికి గోవిందాస్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గోవిందాస్తో పాటుగా మరో 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారు. ఈశాన్యరాష్ట్రాల్లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ క్రమంగా మసకబారుతున్నది.…
సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో… అన్ని పార్టీలు వ్యూహరచనలో మునిగిపోయాయి.. అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని, ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారని.. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ.. పాత, కొత్త కేంద్ర మంత్రులకు సూచనలు చేయగా.. మరోవైపు ప్రతిపక్షాలు కూడా సమస్యలను లేవనెత్తేందుకు సిద్ధం అవుతున్నాయి.. అందులో భాగంగా.. రేపు సాయంత్రం 6 గంటలకు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై…
నిన్న మొన్నటి వరకు నియోజకవర్గానికే పరిమితమైన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు గేర్ మార్చారట. మొత్తం కోల్ బెల్ట్ను చుట్టేసి.. అక్కడ పాగా వేయాలని వ్యూహం రచించారట. అధికారపక్షం బలంగా ఉన్న చోట.. ఆ విపక్ష ఎమ్మెల్యే ఎత్తుగడలు వర్కవుట్ అవుతాయా? ఉత్తర తెలంగాణలో సీతక్క కీలక పాత్ర పోషిస్తారా? కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ములుగు నియోజకవర్గం తప్ప ఇతర ప్రాంతాల్లో పెద్దగా ఫోకస్ పెట్టింది లేదు. గిరిజన తండాల్లో చురుకుగా పర్యటించడానికి ప్రాధాన్యం ఇస్తారామె. కనీసం ఉమ్మడి…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ పొలిటిషన్, రాజ్యసభ సభ్యులు డి. శ్రీనివాస్ ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు.. ఆయన కుమారుడు ఒకరు బీజేపీ నుంచి ఎంపీగా ప్రతినిథ్యం వహిస్తుండగా.. మరొకరు కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం సాగుతోంది.. ఇక, సార్వత్రిక ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో.. టీఆర్ఎస్కు కూడా దూరమైన డీఎస్.. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం కూడా నడుస్తోంది.. ఈ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…
మరోసారి సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి… గందమల్ల రిజర్వాయర్ ఎత్తేస్తె ఆలేరు ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉందని… కానీ, ఎమ్మెల్యే గొంగిడి సునీత చోద్యం చూస్తున్నారని ఫైర్ అయిన ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల మోసం చేయడం మానుకోవాలని హితవుపలికారు.. కేసీఆర్ ఇన్నిసార్లు యాదాద్రికి వచ్చినా.. ఒక్కసారి యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీ పరిస్థితి పట్టించుకోవడం లేదన్న ఆయన.. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట మున్సిపాలిటీ…
దేశంలో రోజు రోజుకు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి అందనంత ఎత్తుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ఆందోళనలు చెందుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చలో రాజ్భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి శ్రేణులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నాచౌక్ నుంచి రాజ్భవన్…