కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై కాంగ్రెస్లో మళ్లీ చర్చ!
ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్లారిటీకి వచ్చినట్టే వస్తారు.. ఇంతలోనే కొత్త స్టేట్మెంట్ ఇస్తారు. ఎదుటివారికే కన్ఫ్యూజన్. ఇప్పుడు మరింత స్పష్టత కోసం ఫోకస్ పెట్టారట. కలిసి నడుస్తారో లేక.. కాదూ కూడదనే అంటారో కానీ.. ఢిల్లీ భేటీలతో పార్టీలో చర్చగా మారారు.
ఢిల్లీ డెవలప్మెంట్తో చర్చల్లోకి వచ్చిన రాజగోపాల్రెడ్డి!
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- Off The Record : గులాబీ బాస్ పోస్ట్ మార్టం.. అసెంబ్లీ ఎన్నికల తప్పులపై BRS సీరియస్ ఫోకస్!
రాజకీయ వ్యూహాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎత్తుగడ ఎవరికీ అంతు చిక్కదు. వాళ్ల వరకు క్లారిటీతో ఉంటారో లేదో.. కేడర్ మాత్రం కన్ఫ్యూజ్లో ఉంటుంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఇటీవల మునుగోడులో జరిగిన రభసతో కొంత స్పష్టత ఇచ్చారు. ఇన్నాళ్లూ బీజేపీని ఆకాశానికి ఎత్తుతూ.. కాంగ్రెస్పై విమర్శలు చేసిన ఆయన.. మంత్రి జగదీష్రెడ్డితో జరిగిన వివాదంలో కాంగ్రెస్ క్యాడర్ను మళ్లీ కదిలించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చేలా పనిచేస్తామని కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఆ చర్చ జరుగుతుండగానే.. మునుగోడు నియోజకవర్గంలో షర్మిల చేసిన దీక్షకు మద్దతు పలికి.. ఆయనంతే ఎవరికీ అర్థంకారనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇంతలో ఢిల్లీలో మరో డెవలప్మెంట్ జరగడంతో మళ్లీ చర్చలోకి వచ్చారు రాజగోపాల్రెడ్డి.
ఢిల్లీలో రేవంత్తో రాజగోపాల్రెడ్డి భేటీ?
తెలంగాణ కాంగ్రెస్కు కొత్త పీసీసీ వచ్చాక రాజగోపాల్రెడ్డి వైఖరి మార్చుకున్నట్టు అనుమానిస్తున్నాయి పార్టీ వర్గాలు. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన ఆయన.. అక్కడ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డితో భేటీ అయ్యారట. కాంగ్రెస్లో కలిసి పనిచేయడానికి చర్చించినట్టు చెబుతున్నారు. సుదీర్ఘంగా సాగిన సమావేశంలో.. రాష్ట్ర, జిల్లా రాజకీయాలు వారి మధ్య చర్చకు వచ్చాయట. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాజీ మంత్రి జానారెడ్డి ఒక్కరికే రేవంత్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాస్త దూరంగానే ఉంటున్నారు. మరో ఎంపీ.. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కూడా సైలెంట్ అయ్యారు. మిగిలింది రాజగోపాల్ రెడ్డే. అందుకే ఢిల్లీలో రేవంత్… రాజగోపాల్ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
బీజేపీ నాయకుడితోనూ రహస్య మంతనాలు?
సోదరులను వదులు కోకూడదన్న ఆలోచనలో పీసీసీ!
రేవంత్రెడ్డిలో భేటీ వరకు బాగానే ఉన్నా.. బీజేపీలో కీలకంగా పనిచేస్తున్న ఓ నాయకుడితోనూ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సమావేశం కావడం కలకలం రేపుతోంది. రేవంత్తో సమావేశం తర్వాత జరిగిన ఈ భేటీ కొత్త చర్చకు ఆస్కారం కల్పిస్తోంది. పాత పరిచయాలతో కలిశారా లేక.. ఇంకేదైనా రాజకీయ ఎత్తుగడ వేస్తున్నారా అన్నది తెలియడం లేదట. రాజగోపాల్ రెడ్డి టీం మాత్రం.. కాంగ్రెస్ తోనే కలిసి నడవడానికి సిద్ధమైనట్టు చెబుతోంది. ఇతర పార్టీల నాయకులతో జరిగిన భేటీలో రాజకీయ అజెండా లేదన్నది వారి వాదన. ఏదైనా రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ అడుగులు మిస్టరీగానే ఉండిపోయాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సోదరుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. కాకపోతే పీసీసీ కొత్త టీమ్ మాత్రం సోదరులను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తోందట. అన్న బెట్టు వీడకపోయినా.. తమ్ముడు దారికొస్తారనే నమ్మకంతో ఉందట రేవంత్ అండ్ కో. మరి ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
SRH: సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
-
Cognizant: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్.!
-
Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న ‘పెద్ది’ రిలీజ్..
-
Gutti Vankaya Recipe : కుక్కర్లో గుత్తి వంకాయ.. పదే పది నిమిషాల్లో అద్భుతమైన రుచి.!
-
Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!