మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి ఆదివారం చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ నడ్డా…కాంగ్రెస్ రాహుల్ గాంధీ మిడతల దండులా తెలంగాణ మీద పడ్డరంటూ విమర్శలు చేశారు. పచ్చబడుతున్న తెలంగాణను ఆగం చేయాలనుకుంటున్నారా.. అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడి సంక్షేమ పథకాలు ఎందుకు లేవు..? అని ఆయన ప్రశ్నించారు. కరెంట్ ఇస్తలేరని బీహార్లో రైతులు ట్రాన్స్ఫార్మర్ తగులబెట్టారు అని, దేశ చరిత్రలోనే…
మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులను చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ని స్కామ్ గ్రెస్ పార్టీ గా ప్రజలు చూస్తున్నారని, అమరవీరుల స్థూపం గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. గన్ పార్క్ ముందు నుండి వెళ్లిన రాహుల్ గాంధీ అమరవీరులకు ఎందుకు నివాళులు అర్పించలేదని, అమరవీరుల స్మృతి వనం నిర్మాణం…
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ సభ కోసం కాంగ్రెస్ పార్టీ 87కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టారని, ఎప్పుడైనా 70సంవత్సారలలో రైతులకు గిట్టబాటు ధర ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, రాహుల్ గాంధీ వాగ్ధానాలు అన్ని వింటే నవ్విస్తుందన్నారు. ఇది కేవలం తెలంగాణ ప్రజలని మోసం చేయడం కోసమేనని, ఎందుకు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో అమలు…
తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్ తరువాత మొదటి సారిగా గాంధీభవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ టూర్తో క్యాడర్లో జోష్ వచ్చిందన్నారు. అంతేకాకుండా డిక్లరేషన్ పై…కేటీఆర్ ఎన్నో మాట్లాడారని, కేటీఆర్.. ఓ సారి ఛత్తీస్ ఘడ్ వెళ్ళు .. అక్కడ రైతుల రుణమాఫీ… ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతుందో తెలుసుకో అని ఆయన వ్యాఖ్యానించారు. అడ్డగోలుగా మాట్లాడిన.. బీజేపీ.. టీఆర్ఎస్.. ఎంఐఎం చీకటి కోణం…
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పీవీని, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళను ప్రధానినీ చేసిన చరిత్ర కాంగ్రెస్ది అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో దళితుడు భట్టిని సీఎల్పీ నేతగా చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా దళితున్ని ఓర్వలేక ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన నీచ చరిత్ర మీదంటూ టీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. రాహుల్ మీద నువ్వు ఏ…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఇటీవల రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల నేతలు రాహుల్ పర్యటనపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా నేడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గాంధీభవన్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. సింగిల్ విండో చైర్మన్గా ఓడిపోయినా… కేసీఆర్కి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ అని, కేసీఆర్.. మొదట ఎమ్మెల్యేగా ఓడిపోలేదా..? అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా కేసీఆర్ రాజకీయ…
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఆస్క్ కేటీఆర్ (Ask KTR) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ట్విటర్ వేదికగా కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తెలంగాణలో మరోపార్టీకి అవకాశం లేదని, మూడోసారి కూడా టీఆర్ఎస్సే గెలుస్తుందన్నారు కేటీఆర్. అభివృద్ధి కొనసాగిస్తాం. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిని బీజేపీ అమ్ముకుంటోంది. బీజేపీ అసలు స్వరూపం ఇదే. బీజేపీ అంటే బేచో జనతాకి ప్రాపర్టీ. గ్యాస్ ధరల్లో…
రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణ పర్యటన కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నింపింది. వరంగల్ సభ సక్సెస్ పట్ల ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ తన పర్యటన రెండవ రోజు హైదరాబాద్లో పలు సమావేశాలు నిర్వహించారు. ముందుగా చెంచల్గూడ జైలుకు వెళ్లి ఎన్ఎస్యూఐ విద్యార్థులను పరామర్శించారు. తరువాత గాంధీ భవన్ లో వివిధ విభాగాలకు చెందిన పార్టీ నేతలను కలిశారు. తాజ్ కృష్ణా హోటల్లో తెలంగాణ ఉద్యమకారులతో కూడా సమావేశమయ్యారు. వారితో పాటు…
తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పర్యటన ముగిసింది. ఈ నేపథ్యంలో.. మాజీ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎన్టీవీ ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రెండు రోజుల రాహుల్ టూర్ తెలంగాణ కాంగ్రెస్లో కొత్త జోష్ నింపిందని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబం మీద మాట్లాడే అంతా గొప్పొడా కేటీఆర్ అంటూ మండిపడ్డారు ఉత్తమ్.. పని చేసే వారికే ఈ సారి అదిష్టానం టికెట్లను…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ థీమ్ ఒక్కటే.. దేశ సంపదను దోచుకోవడం అంటూ ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండగా 12 లక్షల కోట్లను లూటీ చేశారని, రాహుల్ గాంధీ పొలిటికల్ టూరిస్ట్ అంటూ మండిపడ్డారు. దేశ సంపదను దోచిన పార్టీ ఇంకా ఖతమవ్వలేదు.. ఆ పార్టీ ఇంకా కొనసాగుతోందని, రైతుల కష్టాలపై ఎలాంటి చింత…