KCR behind PK: కేసీఆర్ భేటీ తర్వాత మారిన పీకే మనస్సు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతా అయిపోయింది.. ఇక, కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే తరువాయి.. వరుస ఓటములు చూస్తోన్న హస్తం పార్టీ.. గాడిలో పడుతోంది.. పూర్వ వైభవం వస్తుంది.. అంటూ అనేక విశ్లేషలు వచ్చాయి.. ఇలా ఈ మధ్య చర్చ మొత్తం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే గురించే జరిగింది.. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పుల కోసం కీలక సూచనలు చేసిన ఆయనను.. పార్టీలో చేర్చుకోవడంపై సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చింది. కొందరు నేతలు వ్యతిరేకించినా.. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ సోనియా గాంధీ.. పీకేను ఆహ్వానించడం.. ఆయన సున్నితంగా తిరస్కరించడం జరిగిపోయాయి.. అయితే, కాంగ్రెస్ ఆఫర్ను పీకే తిరస్కరించడం వెనుక గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహం ఏమైనా పనిచేసిందా? అనే కొత్త చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది.
Read Also: Prashant Kishor: అందుకే కాంగ్రెస్లో చేరడంలేదు.. క్లారిటీ ఇచ్చిన పీకే
Also Read
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
కాంగ్రెస్ అధిష్టానానికి టచ్లోకి వెళ్లకముందే.. తెలంగాణ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు పీకే.. రాష్ట్రంలో మరోసారి టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడానికి వ్యూహాలు అందించేందుకు సిద్ధం అయ్యారు.. అందులో భాగంగా.. సినీ నటుడు ప్రకాష్రాజ్తో కలిసి ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులను కూడా పరిశీలించారు. సర్వే కూడా నిర్వహించి కీలక సూచనలు చేశారు. తాము పీకేతో కలిసి పనిచేస్తున్నామంటూ సీఎం కేసీఆర్ కూడా బహిరంగంగా ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. కాంగ్రెస్ అధిష్టానంతో పీకే వరుస భేటీల తర్వాత పరిస్థితి మారిపోయినట్టు కనిపించింది.. పీకే కాంగ్రెస్లో చేరడం ఖాయమనే చర్చ సాగింది.. అయితే, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న ఏ పార్టీతో వ్యవహారాలు నడపవద్దని.. అన్ని తెంచుకోవాల్సిందేనంటూ హైకమాండ్ పీకేకు షరతులు విధించినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇక్కడే కీలక పరిణామం చోటు చేసుకుంది..
ఈ మధ్యే హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ కిషోర్.. ప్రగతి భవన్లో మకాం వేశారు.. వరుసగా రెండు రోజుల పాటు గులాబీ దళపతి కేసీఆర్తో సుదీర్ఘ మంతనాలు నెరిపారు.. ఈ భేటీయే పీకే మనస్సు మార్చిందా? అనే చర్చ సాగుతోంది.. పీకేతో కలిసి నడిచేందుకు పిక్స్ అయిన కేసీఆర్.. కాంగ్రెస్లో ఉండే పరిస్థితులు.. అందులో చేరితే ఉండే ఇబ్బందులు.. ఇలా అనేక విషయాలను కూడా పీకేతో చర్చించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఓవైపు టీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకోవడానికే పీకే హైదరాబాద్ వచ్చాడని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్న సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.. తెలంగాణ నుంచి వెళ్లిన రెండు మూడు రోజుల్లోనే తాను కాంగ్రెస్ ఆఫర్ను తిరస్కరించినట్టు పీకే ప్రకటించడం వెనుక.. కేసీఆర్ వ్యూహం ఉందనే చర్చ సాగుతోంది.
తాజావార్తలు
-
Star Kids: ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ స్టార్ వారసులకు హెచ్చరికేనా?
-
Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!