ఎంపీగా తనకు కేటాయించిన తుగ్లక్ లేన్ బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్కు చెందిన రాహుల్ గాంధీని లోక్సభ హౌసింగ్ ప్యానెల్ కోరింది. పరువు నష్టం కేసులో గుజరాత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో పార్లమెంటుకు అనర్హత వేటు వేసిన రెండు రోజుల తర్వాత లోక్సభ హౌసింగ్ ప్యానెల్ నుంచి తొలగింపు నోటీసు వచ్చింది.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశం పార్లమెంట్ ఉభయసభనలు కుదిపేసింది. రాహుల్ గాంధీని పార్లమెంటుకు అనర్హులుగా ప్రకటించడంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్ సభ, రాజ్యసభ రెండూ వాయిదా పడ్డాయి.
క్షమాపణలు చెప్పడానికి నేను సావర్కర్ కాదు అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యుబిటి) నాయకుడు ఉద్ధవ్ థాకరే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అనర్హత వేటు తర్వాత ఖుష్బూ సుందర్ పాత ట్వీట్ వైరల్గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఖుష్బు.. తన పాత ట్వీట్ను తొలగించేదే లేదని తేల్చి చెప్పారు.