Rahul Gandhi Disqualification: రాహుల్ గాంధీ పదేళ్ల క్రితం ఆ ఆర్డినెన్స్ను చించకుండా ఉండుంటే..
Rahul Gandhi Disqualification: క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలడం, ఆయనపై వెంటనే అనర్హత వేటు పడడం.. 2013లో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేస్తోంది. 2013లో సెప్టెంబర్లో రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో ఓ ఆర్డినెన్స్ కాపీని చించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ ఆర్డినెన్స్ కాపీలో ఏముంది?. ఒకవేళ ఆ ఆర్డినెన్స్ కాపీని రాహుల్ చించకుండా ఉండుంటే ఇప్పుడు అనర్హత వేటు నుంచి తప్పించుకునే వాడా? అనే చర్చ జరుగుతోంది. వయనాడ్ ఎంపీ రాహుల్గాంధీపై అనర్హత వేటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సంబంధిత నిబంధనలు సహా 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్సభ సెక్రటేరియట్ స్పష్టం చేసింది. రాహుల్పై వేటు నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కారణంగా మరో చర్చ ప్రారంభమైంది. 2013లో రాహుల్ గాంధీ ఆ ఆర్డినెన్స్ విషయంలో అలా చేయకుండా ఉండుంటే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: Supreme Court: కొవిడ్ సమయంలో విడుదలైన ఖైదీలందరూ 15 రోజుల్లో లొంగిపోవాలి
Also Read
2013లో ఆ ఆర్డినెన్స్ ఏంటి?
ప్రజా ప్రతినిధుల పనితీరుకు సంబంధించి ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లో అమల్లోకి వచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు శిక్ష పడితే ఏం చేయాలన్నదానిపై ఆ చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడే కేసుల్లో దోషిగా తేలితే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం పదవికి అనర్హులవుతారు. శిక్షా కాలం పూర్తయ్యాక మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయరాదు. అయితే.. ఒకప్పుడు ఈ చట్టంలోని నిబంధనలు మాజీ ప్రజాప్రతినిధులకు, సిట్టింగ్ సభ్యులకు వేర్వేరుగా ఉండేవి. మాజీ ప్రజాప్రతినిధులు దోషిగా తేలిన వెంటనే అనర్హులవుతారు. కానీ.. సిట్టింగ్ సభ్యులకు మాత్రం దోషిగా తేలిన తర్వాత 3 నెలల పాటు సమయం ఉంటుంది. ఈలోగా పైకోర్టుకు అప్పీలుకు వెళ్లి, తీర్పు మారేలా చేసుకుంటే.. అనర్హత వేటు తప్పుతుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలను సవరిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తిరగరాసేలా 2013లో అప్పటి మన్మోహన్ సర్కారు ఈ ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. సిట్టింగ్ ప్రజాప్రతినిధులు ఎవరైనా దోషిగా తేలితే 3 నెలల వరకు అనర్హత వేటు వేయరాదన్నది ఈ ఆర్డినెన్స్లోని ముఖ్యమైన అంశం. ఆ ఆర్డినెన్స్ కాపీనే రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో చింపేశారు. దీని వల్ల కొన్ని రోజుల తర్వాత మన్మోహన్ ప్రభుత్వం ఆ ఆర్డినెన్స్ను ఉపసంహరించుకుంది. ప్రజాప్రతినిధులు దోషిగా తేలిన వెంటనే అనర్హుల్ని చేసే నిబంధన అమలైంది. దాని వల్లే ఇప్పుడు రాహుల్ గాంధీపై వేటు పడింది.
9 yrs ago, had Rahul Gandhi not torn the ordinance passed by the UPA govt, which repealed the historic decision of the Supreme Court, saving the convicted MPs from disqualification, today he wouldn't have been disqualified. What an irony! pic.twitter.com/NcwxfyMVP9
— Priti Gandhi (@MrsGandhi) March 24, 2023
తాజావార్తలు
-
Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
-
Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
-
Ravibabu : డబ్బు, టైం ఉంటే ఏ వెధవైనా సినిమా అద్భుతంగా చేస్తాడు.. రవిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో