Karnataka: జర్మన్ ఛాన్సలర్ కంటే రాహుల్ గాంధీ ఎక్కువైపోయారా? కాంగ్రెస్పై బీజేపీ ధ్వజం
- కర్ణాటకలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా రగడ
- జర్మన్ ఛాన్సలర్ కంటే రాహుల్ గాంధీ ఎక్కువైపోయారా?
- కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రగడ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కాషాయ పార్టీ తీవ్రంగా ఖండించింది. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా మంగళవారం కర్ణాటకకు వచ్చారు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మెర్జ్ ల్యాండ్ అయ్యారు. ఆయనకు కర్ణాటక పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్.. సీనియర్ అధికారులు స్వాగతం పలికారు.
ఇది కూడా చదవండి: Trump: నిరసనకారుల్ని ఉరి తీస్తే కఠిన చర్యలుంటాయి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
Also Read
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
- Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
- Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
మరోవైపు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటన కోసం మైసూర్లో ల్యాండ్ అయ్యారు. రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్తో పాటు మంత్రులు వెళ్లారు. ఈ వ్యవహారమే ప్రస్తుతం కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇది కూడా చదవండి: Anil Ravipudi: నిర్మాతకు కారు.. నాకు విల్లా: అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్!
జర్మన్ ఛాన్సలర్ కంటే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ ఎక్కువైపోయారా? అంటూ బీజేపీ ప్రశ్నించింది. . రాష్ట్ర అభివృద్ధి కంటే.. కాంగ్రెస్ హైకమాండ్ను సంతృప్తి పరిచేందుకే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించింది. రాహుల్ గాంధీని మైసూరు విమానాశ్రయంలో ప్రభుత్వ పెద్దలు స్వాగతించడం.. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ను బెంగళూరు విమానాశ్రయంలో స్వాగతం పలకడానికి ఒక మంత్రిని నియమించడంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర అభివృద్ధి కంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సంతృప్తికే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించింది. ఈ మేరకు ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక ఎక్స్లో తప్పుపట్టారు.
‘‘ఈరోజు జర్మన్ ఫెడరల్ ఛాన్సలర్ కర్ణాటకను సందర్శించారు. ఇది మన రాష్ట్రానికి అపారమైన దౌత్య, ఆర్థిక, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన క్షణం. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి ఎవరైనా సరే తగినంత గౌరవం ఇచ్చేవారు. కర్ణాటకకు పెట్టుబడి, పరిశ్రమ, ఉపాధి, దీర్ఘకాలిక వృద్ధికి మంచి అవకాశం.’’ అని అశోక రాశారు. ‘‘కానీ ఈరోజు పరిస్థితి చూడండి… జర్మన్ ఛాన్సలర్ బెంగళూరులో అడుగుపెట్టినప్పుడు.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ఊటీకి ప్రయాణిస్తున్న రాహుల్గాంధీని స్వీకరించడానికి మైసూరును ఎంచుకున్నారు.’’ అని అశోక ఎద్దేవా చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన దేశాధినేతను స్వాగతించకపోవడం కర్ణాటక ప్రయోజనాల పట్ల కాంగ్రెస్ చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యాన్ని నిదర్శనం అని ధ్వజమెత్తారు.
జర్మన్ ఛాన్సలర్ బెంగళూరు పర్యటన సందర్భంగా అడుగోడిలోని బాష్ క్యాంపస్ను.. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లోని సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ను సందర్శించారు.
Misplaced priorities
Missed opportunitiesToday, the German Federal Chancellor visited Karnataka – a moment of immense diplomatic, economic and strategic significance for our state.
Any other responsible Chief Minsiter would have personally ensured that such a visit was… https://t.co/pDjq5Oj6q2 pic.twitter.com/t8k981Q60K
— R. Ashoka (@RAshokaBJP) January 13, 2026
తాజావార్తలు
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
-
Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
-
Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
-
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!