MLA Gudem Mahipal Reddy : కాంగ్రెస్లో చేరి తప్పు చేశా.!
- పటాన్చెరు MLA గూడెం మహిపాల్రెడ్డి హాట్కామెంట్స్
- మున్సిపల్ ఎన్నికల్లో BRS అభ్యర్థులను గెలిపించాలి
- అప్పటి పరిస్థితుల వల్ల తప్పటడుగు వేసి కాంగ్రెస్లో చేరా
- మూడుసార్లు BRS నుంచి ఎమ్మెల్యేగా గెలిచా. -మహిపాల్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జిల్లా పటాంచెరు రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన పటాంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన నిర్ణయంపై బహిరంగంగానే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం తాను చేసిన ఒక “తప్పటడుగు” అని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలోకి మారడం వల్ల తన నియోజకవర్గానికి లేదా నియోజకవర్గ ప్రజలకు కనీసం “వెంట్రుక వాసి” కూడా ప్రయోజనం కలగలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందడం లేదనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల ఒత్తిడికి లోనై కాంగ్రెస్లో చేరానే తప్ప, దాని వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.
తాను మూడు సార్లు బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని మహిపాల్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన తన అనుచరులకు, కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఉన్న 104 మంది కౌన్సిలర్లు, వివిధ కుల సంఘాలు, వ్యాపార వర్గాలతో సత్సంబంధాలు కలిగి ఉండి పార్టీని బలోపేతం చేయాలని ఆయన కోరారు. కుల సంఘాల వారీగా, వర్గాల వారీగా విభాగాలు ఏర్పాటు చేసుకుని మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు, ఆయన త్వరలోనే మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరుతారనే సంకేతాలను ఇస్తున్నాయి. ఈ పరిణామం పటాంచెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావించవచ్చు.
Also Read
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!