మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ధైర్యం ఉంటే 20 రోజులు సభ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో అతి తక్కువ పని దినాలు జరిగేది తెలంగాణలోనే అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. తమకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రతిపక్ష నాయకుల ఆరోపణలకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎపుడు బయట పడాలి అని చాలా మంది నాయకులు అనుకుంటున్నారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. అందుకే కాంగ్రెస్లో భారీగా చేరికలు జరుగుతున్నాయని, షర్మిల చేరిక అంశం నా దృష్టిలో లేదు ఢిల్లీ పర్యటనలో అధిష్టానం పెద్దలను కలుస్తున్నట్లు, రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో నీళ్ళు, నిధులు, నియామకాలు ఏదీ నెరవేరలేదని, నా పాదయాత్రలో ప్రజల సమస్యలు ఎన్నో కళ్ళారా చూశానన్నారు భట్టి విక్రమార్క. breaking…
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ఢిల్లీలో నేడు బీఆర్ఎస్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పాలమూరు జిల్లాకు చెందిన ఇతర నేతలు కాంగ్రెస్లో చేరనున్నారు. పాలమూరు జిల్లా కొల్లాపూర్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రసంగించే భారీ బహిరంగ సభలో జూపల్లి తదితరులు గ్రాండ్ ఓల్డ్ పార్టీలో చేరాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, వరదల కారణంగా సభ వాయిదా పడింది. breaking news, latest news, telugu news, jupalli krishan…
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో పలువురు నేతలు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. రేపు ఉదయం 9 గంటలకు వీరు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. అనంతరం వీరు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు.
వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేసినట్లు నిరూపించగలరా అని ఆయన సవాల్ విసిరారు. రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజలను రెచ్చగొడుతున్నారని.. బీఆర్ఎస్ నేతలపై విపక్షాలకు ఎందుకు అంత అక్కసు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
రైతులపై కాంగ్రెస్ ది కపట ప్రేమ అని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. మూడు గంటల కరెంట్ ఇస్తే ఎవరికి రైతులు ఉరెస్తారో చూడు అని ఎద్దేవా చేశారు. వరద ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి.. రాష్ట్రంలో దిక్కు లేదని కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో మాట్లాడుతున్నారు..
తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు.. ఇలా అసత్య ప్రచారం చేయడం పద్దతి కాదని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. కాంగ్రెస్ వాళ్ళకు అవగాహనా ఉందా.. కేసీఆర్ ను రైతు హంతకుడు అని అనడానికి నోరు ఎలా వచ్చింది.
తెలంగాణలో కురిసిన వర్షాలు, వరద ప్రభావంపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు బురద రాజకీయాలు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు వరదలపై గవర్నర్ ను కలవడాన్ని ఆయన తప్పుబట్టారు.