Dharpally Rajasekhar Reddy : హైదరాబాద్లో చాలా చెరువులు కబ్జాకు గురయ్యాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజాలు చెప్పడానికి ప్రతిపక్షం కావాలి అబద్దాలు దాచానికి అధికార పక్షం కావాలి అనే విధంగా దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత వారం రోజులుగా ప్రజలు పడే ఇబ్బందులు గుర్తించి జీహెచ్ఎంసీని కోరడం తప్పా దాసోజు శ్రవణ్ చెప్పాలన్నారు. హైదరాబాద్ లో కేవలం 6 శాతం మాత్రమే వర్షాలు కురిసాయని, వర్షాల కారణంగా వచ్చే ఇబ్బందుల నుండి ప్రజలను కాపాడమని కోరినందుకు రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలు చేస్తున్నారా అని ఆయన అన్నారు.
గత వారం రోజులుగా తెలంగాణ లోని వివిధ జిల్లాల్లో 65 శాతం వర్షాలు పడ్డాయి.. అదే వర్షం హైదరాబాద్ లో పడితే హైదరాబాద్ సముద్రం లా మారేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. హైదరాబాద్ చాలా వరకు చెరువులు కబ్జాకు గురయ్యాయని, 2014 కు ముందు చెరువుల పరిస్థితికి నేటికి జరిగిన మార్పులపై చర్చలకు రండి అని ఆయన సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చెరువులు కబ్జాకు గురైన విషయాన్నే రేవంత్ రెడ్డి తెలిపారు. కాదని చెప్పేందుకు మీరు మీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని ఆయన అన్నారు. మూసి నదిలో గడ్డి తొలగింపు పేరు మీద లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారని, దాసోజు శ్రవణ్ పార్టీలు మారినట్టు చెరువుల ఆక్రమణలకు సంబంధిచిన లెక్కలు మారవు గుర్తు పెట్టుకోవాలన్నారు రాజశేఖర్ రెడ్డి.
Also Read
- ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
- Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
- T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
- Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
భారీ వర్షాలకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ధనికులు వుండే స్లమ్స్ ఏరియగా మారి కార్లు నీటిపై తెలియాడాయని, వరదల అనంతరం గ్రామాల్లోకి పాములు, విష ప్రాణులు వచ్చి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా ఇబ్బందులు పడుతున్నారన్నారు. భారీ వర్షాలకు గ్రామాల్లో పశువులు, పెంపుడు జంతువులు ఎన్నో మూగ జీవులు వరదల్లో కొట్టుకపోయ్యాయని, కడెంలో గేట్లు తీయలేని పరిస్థితిలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. చెరువులు, వరదలపై దమ్ముంటే దాసోజు శ్రవణ్, బిఆర్ఎస్ నాయకులు చర్చకు బుధవారం రోజు రండి అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Varanasi: ఫ్యామిలీ వెకేషన్లో మహేష్ బాబు.. త్వరలోనే ‘వారణాసి’ షూటింగ్లోకి రీఎంట్రీ!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Earthquake: భూకంపాల దెబ్బకు ఉలిక్కిపడ్డ రెండు దేశాలు.. జపాన్, వెనిజులాలో కలకలం
-
Vastu Tips: ఇంట్లో ఎప్పుడూ భారంగా అనిపిస్తుందా? వాస్తు ప్రకారం ఈ చిన్న విషయాలు కారణమా?
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
ట్రెండింగ్
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!