Manickam Tagore: మోడీ పాలనలో ఏపీకి అన్యాయం జరిగింది: మాణిక్కం ఠాగూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ పాలనలో ఏపీకి అన్యాయం జరిగిందని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రధాని తన మిత్రులకు అమ్మేస్తున్నారని విమర్శించారు. తొమ్మిదిన్నరేళ్లు ముగిసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. ప్రధానితో సీఎం వైఎస్ జగన్ పార్టీ తెరవెనుక ఒప్పందం పెట్టుకుందని మాణిక్కం ఠాగూర్ పేర్కొన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన మాణిక్కం ఠాగూర్.. బీజేపీ, టీడీపీ, జనసేనలపై మండిపడ్డారు.
‘విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రధాని మోడీ తన మిత్రులకు అమ్మేస్తున్నారు. తొమ్మిదిన్నరేళ్లు ముగిసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మోడీ పాలనలో ఏపీకి అన్యాయం జరిగింది. ప్రధానితో జగన్ పార్టీ తెరవెనుక ఒప్పందం పెట్టుకుంది. బీజేపీకి జనసేన మిత్రపక్షం. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ ఎదురు చూస్తోంది. ఏపీకి జరిగే అన్యాయాన్ని ఈ మూడు పార్టీలు ప్రశ్నించలేవు. బీజేపీ చేసే తప్పులను కాంగ్రెస్ మాత్రమే ప్రశ్నించగలదు. కొత్త ఏడాది సందర్భంగా అందరి ఆకాంక్షలు.. ఈ ఏడాది మీ కోరికలను నెరవేరుస్తుంది’ అని మాణిక్కం ఠాగూర్ అన్నారు.
Also Read
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
Also Read: Mudragada Padmanabham: ముద్రగడ త్వరలోనే ఏదో ఒక పార్టీలో చేరుతారు.. నేను కూడా పోటీ చేస్తా: గిరిబాబు
‘ఏపీలో ఓటర్ల జాబితా రూపకల్పనలో అవకతవకలు జరుగుతున్నాయి. వాలంటీర్లు, గ్రామ-వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా జగన్ సర్కార్ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం మౌనం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఓట్ల తొలగింపు విషయంలో మరింత పారదర్శకత అవసరం. ఓట్ల జాబితాలో అవకతవకలంటూ వస్తోన్న ఫిర్యాదులపై ఈసీ విచారణ చేపడుతుందా?. తన విశ్వసనీయతను కొత్తేడాదిలోనైనా సీఈసీ నిలబెట్టుకుంటుందా?’ అని మాణిక్కం ఠాగూర్ అంతకుముందు ప్రశ్నించారు.
- Tags
- ap
- congress
- Manickam Tagore
- PM Modi
- ycp
తాజావార్తలు
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!