కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎంపిక వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైపే పార్టీ హైకమాండ్ మొగ్గుచూపిందని.. ఆయన ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ, అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు.. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై పార్టీలో తీవ్ర సందిగ్ధత కొనసాగుతోంది.
తెలంగాణలో అసెంబ్లీ రద్దు చేస్తున్నట్లు రాజ్ భవన్ వర్గాలు గెజిట్ విడుదల చేస్తుంది. అయితే, కొత్త అసెంబ్లీ శాసనసభను ఏర్పాటు చేస్తూ కూడా జీవోను జారీ చేసింది.
కాసేపట్లో తెలంగాణ సీఎంను ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఢిల్లీ నుంచి సీఎల్పీ నేత ఎంపిక సమాచారం కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెయిటింగ్ చేస్తున్నారు. ఆ సమాచారం వచ్చిన తర్వాత సీఎల్పీ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ రాజ్భవన్కు తెలుపుతుంది.
నిన్న వెలువడిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించగా, కేవలం ఒక్కచోట మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం పంచుకోని కారణంగా కాంగ్రెస్ ఓడిపోయిందని అన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ ఓటమి మాత్రమేనని.. ప్రజలది కాదు అని తెలిపారు.
రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయాల్లో మార్పు వచ్చింది.. తెలంగాణలో భాష మారబోతోంది.. ఇక, నీచమైన రాజకీయాలకు స్వస్తి పలకాలి అని ఆయన కోరారు.
ఒక సిట్టింగ్ సీఎంను.. కాబోయే సీఎం అంటున్న ఇద్దరినీ ఓడించిన ఘనత బీజేపీ దే అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డినీ ఓడించిన వెంకట రమణ రెడ్డి విజయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలిపారు అని ఆయన పేర్కొన్నారు.
Revanth reddy: తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ ఓ సెన్సేషన్. రేవంత్ మాటలు.. ప్రత్యర్థులపై విమర్శల దాడి చేస్తారు. ఆయన మైక్ పట్టుకుంటే చాలు తన స్పీచ్తో అగ్రెసివ్గా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు.
Lowest Victory Margin in Chhattisgarh Assembly Elections 2023: ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలుబడిన విషయం తెలిసిందే. ఛత్తీస్గఢ్లో 90 సీట్లు ఉండగా.. బీజేపీ ఏకంగా 54 స్థానాల్లో విజయం సాధించింది. మునుపెన్నడూ లేనంతగా బీజేపీ మెజార్టీని సొంతం చేసుకోగా.. గత నాలుగు ఎన్నికల్లో ఎన్నడూలేనంత తక్కువకు కాంగ్రెస్ సీట్లు పడిపోవడం గమనార్హం. ఛత్తీస్గఢ్లో కొన్నిచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారు. కేవలం 16 ఓట్ల తేడాతో కాంకేర్ కాంగ్రెస్ అభ్యర్థి…
Election Results 2023 : భారత ఎన్నికల సంఘం మార్చిన షెడ్యూల్ ప్రకారం మిజోరంలో ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. ఇక్కడ అధికార పార్టీలు మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (ZPM), కాంగ్రెస్ ఉన్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుపై 30 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మంథని నియోజకవర్గంలో 2,36,442 మంది ఓటర్లు ఉండగా.. 1,95,632 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబుకు 1,01,796 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకు 71,732 ఓట్లు వచ్చాయి.…