Jagga Reddy : రాష్ట్రానికి దళితుడ్ని సీఎం చేస్తా అని చీటింగ్ చేసింది ఎవరు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
420 ఎవరు..? రాష్ట్రానికి దళితుడ్ని సీఎం చేస్తా అని.. చీటింగ్ చేసింది ఎవరు అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. మూడెకరాల ఇస్తా అని మోసం చేశావని ఆయన ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి..ఇస్తా అని చీటింగ్ చేశావని, ఆరోగ్య శ్రీ ఎత్తేశావు చీటింగ్ చేశారన్నారు. లక్ష రుణమాఫీ ఒకే సారి అన్నావు.. ఇది చీటింగ్ అని, డబుల్ బెడ్ రూమ్ ఇస్తా అన్నావు ..ఇదో చీటింగ్ అని ఆయన అన్నారు. పేపర్ లికేజ్ చేసిన.. మీ కుటుంబం మీద ఇదో చీటింగ్ కేసు అని, 12 శాతం ముస్లిం రిసేర్వేషన్ ఇస్తానని చీట్ చేశావన్నారు.
అంతేకాకుండా.. ‘రైతులకు సంకెళ్లు వేశావు..ఇది చీటింగ్. 57 ఏండ్ల కు పెన్షన్ అని చీట్ చేశావు. ఇన్ని చీటింగ్ చేసిన మీపై ఎన్ని కేసులు పెట్టాలి. బీఆర్ఎస్ చేసిన చీటింగ్ లపై కేసులు వేయాలి. కోర్టుకు వెళ్ళాలి. నిన్ననే తాళి కట్టినం. అప్పుడే కాపురం విశేషాలు అడిగితే ఎట్లా. బావ బామ్మర్ది కి అంటే తెలియదు. కేసీఆర్ కి తెలియదా. నెల రోజులు కాలేదు 420 అంటావా. ఎట్లా కనిపిస్తుంది కాంగ్రెస్. తెలంగాణని కేసీఆర్ మోసం చేసిన 420 అనే.. కాంగ్రెస్ ని గెలిపించారు. తెలంగాణ ప్రజలు అసలు 420 లు కేసీఆర్ కుటుంబం అని కాంగ్రెస్ కి ఓటేశారు. బీఆర్ఎస్ వాళ్ళ కోసం 840 చట్టం తేవాలి. 840 చట్టం చేయమని ప్రధాని ని అడుగుతాం.. ఆయన కూడా చట్టం తేకుంటే.. ఆయన్ని కూడా 840 కింద జమ చేయాలి. రేవంత్ సిన్సియర్ గా పని చేస్తున్నారు. కేంద్ర మంత్రులను కలిసి నిధులు సమకూర్చుకుంటున్నారు. రేవంత్..భట్టి.. వంద రోజుల్లో ఎలా సెటిల్ చేయాలనే పనిలోనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ రెండేళ్లు ఓపిక పట్టి.. ప్రశ్నించాలి అప్పుడు గౌరవం గా ఉంటుంది.
Also Read
- UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
- Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్పై కేసు!
- Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రూ.32లకే కిలో ఉల్లిపాయలు..
బీఆర్ఎస్.. బీజేపీ కలిసి ఒక్క అబద్దాన్ని వెయ్యి సార్లు చెప్తున్నారు. బీఆర్ఎస్.. బీజేపీ ఇద్దరు పాలోల్లే. పగలు కొట్లాడుతరు.. రాత్రి కల్లు దుకాణం దగ్గర కలుస్తరు. కేటీఆర్.. హరీష్.. కాంగ్రెస్ కి గంజాయి బ్యాచ్ లెక్క తయారైంది. మేము ఎంత మంచి పని చేసినా.. కేటీఆర్..హరీష్ బదనం చేసే పనిలోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి ని గెలికితే.. మీ బండారం బయట పెడతా. రేవంత్ పాలన బాగుంది. పరిపాలన ని పరుగులు పెట్టిస్తున్నారు. జగ్గారెడ్డి పేరే బ్రాండ్. పదవులతో బ్రాండ్ రాలేదు. పార్టీ మాకు చాలా అవకాశం ఇచ్చింది. నేను ఫ్రీ గా ఉన్నా. వారానికి రెండు రోజులు పార్టీ కి ఇస్తా. కేటీఆర్ కి జగ్గారెడ్డి కౌంటర్. తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు పార్లమెంటు లో మీ అయ్యా ఉన్నాడా. సోనియా గాంధీ.. రాహుల్ గాంధీ లే ఉండి బిల్లు పాస్ చేశారు. నాయనా నువ్వు ఎక్కడ ఉన్నావు ఆ రోజు అని అడుగు. తర్వాత మమ్మల్ని అడుగు.’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
-
Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!
-
Speaker Gaddam Prasad: స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైర్.. బీఆర్ఎస్ తీరుపై అసంతృప్తి
-
Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్పై కేసు!
-
Vaishnavi: మా ఎపిక్ బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!