Rasamayi Balakishan : ఎన్నికల ముందు 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లా మానకొండుర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్ళు నిధులు నియామకాలు అనే గొప్ప ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి కేసీఅర్ అని ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం గత కేసీఅర్ ప్రభుత్వం అని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు రైతుబందు వేస్తానంటే ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారని, రైతుబంధు కోసం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఅర్ 7వేల కోట్లు ఉంచారన్నారు. ఎన్నికల ముందు 6 గ్యారెంటీ ల పేరుతో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చారని, గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేయడం చాలా బాధాకరం నిష్పక్షపాతంగా జిల్లా అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 1500 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ అందించామని ఆయన వెల్లడించారు. దళిత బంధు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వ్యక్తి కేసీఅర్ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
అంతేకాకుండా.. దళిత బంధు కు ఎంపికైన 1100 మంది లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారి అకౌంట్ లలో ఇప్పటికే గ్రాంట్ ను వేయడం జరిగిందని, కాళేశ్వరం జలాలతో నియోజకవర్గంలోని అరు మండలాలు సస్యశ్యామలంగా మారాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి నీళ్ళు ఇవ్వలేక చేతకాని తనంగా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారయణ చేయాల్సిన పనులు వదిలిపెట్టి 31st ధావత్ లలో ఎం చేస్తున్నాడో ప్రజలకు తెలుసునన్నారు బాలకిషన్. ప్రజా క్షేత్రంలో ఒక ప్రజాప్రతినిధి అంటే ఎలా ఉండాలో ముందుగా కవ్వంపల్లి నేర్చుకోవాలని, ఓ అడబిడ్డను అలా చేయడం ఎంటి వేరే మహిళ అయితే చెప్పుతో కొట్టేదన్నారు. అధికారంలో లేనప్పుడు లోపల చేసిన పనులు ఇప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బహిరంగంగా చేస్తున్నాడని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..