Rasamayi Balakishan : ఎన్నికల ముందు 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లా మానకొండుర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్ళు నిధులు నియామకాలు అనే గొప్ప ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి కేసీఅర్ అని ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం గత కేసీఅర్ ప్రభుత్వం అని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు రైతుబందు వేస్తానంటే ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారని, రైతుబంధు కోసం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఅర్ 7వేల కోట్లు ఉంచారన్నారు. ఎన్నికల ముందు 6 గ్యారెంటీ ల పేరుతో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చారని, గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేయడం చాలా బాధాకరం నిష్పక్షపాతంగా జిల్లా అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 1500 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ అందించామని ఆయన వెల్లడించారు. దళిత బంధు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వ్యక్తి కేసీఅర్ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
అంతేకాకుండా.. దళిత బంధు కు ఎంపికైన 1100 మంది లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారి అకౌంట్ లలో ఇప్పటికే గ్రాంట్ ను వేయడం జరిగిందని, కాళేశ్వరం జలాలతో నియోజకవర్గంలోని అరు మండలాలు సస్యశ్యామలంగా మారాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి నీళ్ళు ఇవ్వలేక చేతకాని తనంగా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారయణ చేయాల్సిన పనులు వదిలిపెట్టి 31st ధావత్ లలో ఎం చేస్తున్నాడో ప్రజలకు తెలుసునన్నారు బాలకిషన్. ప్రజా క్షేత్రంలో ఒక ప్రజాప్రతినిధి అంటే ఎలా ఉండాలో ముందుగా కవ్వంపల్లి నేర్చుకోవాలని, ఓ అడబిడ్డను అలా చేయడం ఎంటి వేరే మహిళ అయితే చెప్పుతో కొట్టేదన్నారు. అధికారంలో లేనప్పుడు లోపల చేసిన పనులు ఇప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బహిరంగంగా చేస్తున్నాడని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!