ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లోక్ సభ ఎన్నికలకు ముందు ఐటీ విభాగం కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేయటం లాంటి అంశాలపై తాజాగా ఐక్యరాజ్యసమితి రియాక్ట్ అయింది.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ 'తీవ్రమైన సంక్షోభంలో' ఉంది అని తెలిపాడు.
కర్ణాటక రాష్ట్రంలో రైతు సంఘాలన్నీ ఒక్కటవుతున్నాయి. రైతుల బాధలు పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు లోక్ సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని వారు భావిస్తున్నారు.
Priyank Kharge: కాంగ్రెస్ మంత్రి, కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గేకి బెదిరింపులు వస్తున్నాయి. తనను కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులు లేఖలు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆ మాజీ ఎమ్మెల్యే రెండు ప్రధాన పార్టీలతో దోబూచులాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే... కండిషన్స్తో టెన్షన్ పెడుతున్నారు. ఉన్న పార్టీ మీద అలిగారు.... రమ్మన్న పార్టీకి కండిషన్స్ అప్లై అంటున్నారు. ఆ ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ ఎలా పడుతుందా అని రెండు పార్టీల కేడర్ ఆసక్తిగా చూస్తోంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయనకే ఎందుకంత డిమాండ్?
Savitri Jindal: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ నవీన్ జిందాల్ ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. హర్యానా కురుక్షేత్ర నుంచి బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజులకే ఆయన తల్లి, హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కూడా బీజేపీలో చేరారు.
PM Modi: రాజకీయ ఒత్తిడిని ఉపయోగించి న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా వందలాది మంది న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్కి లేఖ రాశారు.