Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Jangaon Kadiyam Srihari Angry Brs And Bjp Parties

Kadiyam Srihari: రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చని దద్దమ్మ ప్రభుత్వం బీజేపీ, నరేంద్ర మోడీ..

Published Date :April 15, 2024 , 5:44 pm
By Chandra Shekhar Pamena
Kadiyam Srihari: రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చని దద్దమ్మ ప్రభుత్వం బీజేపీ, నరేంద్ర మోడీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, మాజీ ఎంపీ పసునూరి దయాకర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. పాలకుర్తి ప్రజల దెబ్బకు దయాకర్ మైండ్ బ్లాక్ అయ్యిందన్నారు. యశస్విని రెడ్డి దెబ్బకు చిన్న మెదడు చితికిపోయింది అని పేర్కొన్నారు. దయాకర్ రావు బిత్తిరి బిత్తిరిగా మాట్లాడుతున్నాడు.. ఓటమితో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకు వచ్చింది అని కడియం శ్రీహరి అన్నారు.

Read Also: Char Dham Yatra 2024: చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పూర్తి వివరాలు..

భారత జనతా పార్టీ తెలంగాణకు చేసింది ఏం లేదు.. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చని దద్దమ్మ ప్రభుత్వం బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మణిపూర్ లో దళితులు, ముస్లింలు, క్రైస్తవులపై దాడులు చేసిన పట్టించుకోలేదు.. మణిపూర్ భారతదేశంలో భాగం కాదా మోడీ అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ పేరిట బుల్డోజర్ సర్కార్ నడిపిస్తున్నారు అని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని అంటున్నారు.. రిజర్వేషన్లు ఎత్తివేస్తారట.. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అవసరమా.. సీఎం రేవంత్ రెడ్డితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అన్ని హామీలు నెరవేరుస్తారు.. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కడియం శ్రీహరి తెలిపారు.

Read Also: Uttam Kumar Reddy: ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది.. రాహుల్ గాంధే ప్రధాని..!

ఇక, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. మన ఎంపీ అభ్యర్థి కావ్య అక్కను అధిక మెజార్టీతో గెలిపించాలి అని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్న గాని ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వెనకడుగు వేయలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లె ప్రయత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు.. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. బీజేపీ ప్రభుత్వం మత కల్లోలాలను సృష్టిస్తుంది అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పదవులను ఆశించలేదు.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎండిపోయిన పంటలకు 10, 000 నష్ట పరిహారం ఇస్తారని చెప్పారు.. కానీ ఇయ్యలేదని ఆమె చెప్పారు. టిఆర్ఎస్ పార్టీ వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఇప్పుడు బయటకెళ్ళి ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని ఆరోపించింది. పాలకుర్తి- చెన్నూరు రిజర్వాయర్.. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది.. ఐదు సంవత్సరాలు పూర్తి అవ్వకముందే దాన్ని పూర్తి చేసే బాధ్యత నాది అని ఎమ్మె్ల్యే యశస్విని రెడ్డి హామీ ఇచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BRS
  • congress
  • kadiyam srihari
  • Lok Sabha elections-2024

తాజావార్తలు

  • Kunki Choudhury: సీఎం హిమంత బిస్వ శర్మను సవాలు చేస్తున్న 27 ఏళ్ల ‘జెన్‌ జీ’ అభ్యర్థి.. కుంకీ చౌదరి ఎవరు?

  • Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద ఫ్యాన్స్ ఆందోళన.. సిబ్బందిపై ఆగ్రహం..

  • Rini Sampath: వాషింగ్టన్ గడ్డపై చరిత్ర సృష్టించనున్న ఇండియన్ లేడీ.. ఎవరీ రిని సంపత్?

  • SRH Vs LSG: సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాటర్..

  • Train Coach: పెళ్లి కోసం ఏకంగా రైలు కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకున్న కుటుంబం.. ఇలా బుక్ చేసుకునే వీలుందా?

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions