PM Modi: ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు.. మోడీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి 17,000 మంది లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రాజస్థాన్ బన్స్వారా ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపదని ‘‘చొరబాటుదారులకు’’, ‘‘ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి’’ పంచుతోందని, ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు గానూ ప్రధాని నరేంద్రమోడీపై కఠిన చర్యలు తీసుకోవాలని 17,000 మంది పౌరులు భారత ఎన్నికల కమిషన్ లేఖలు రాశారు.
Read Also: Ranjith Reddy: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రంజిత్ రెడ్డి..
Also Read
- Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
వతన్ కే రహామే మరియు సంవిధాన్ బచావో నాగరిక్ అభియాన్ అనే రెండు పౌర హక్కుల సంఘాల నేతృత్వంలోని 17,000 మంది పౌరులు లేఖపై సంతకం చేశారు. మోడీ ప్రసంగం ‘మత భావాలను’ ఆకర్షించడమే కాకుండా ముస్లింలపై హిందువులలో ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉందని ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని, కాంగ్రెస్ మేనిఫెస్టోలోని సంపద పున:పంపిణీ హామీపై ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన తల్లులు, సోదరీమణుల బంగారం, చివరకు మంగళసూత్రాలను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన.. ‘‘ఈ దేశంలోని సంపదపై తొలిహక్కు ముస్లింలకే ఉంది’’ అనే వ్యాఖ్యలను మోడీ ప్రస్తావించారు.
‘‘మీరు కష్టపడి సంపాదించిన డబ్బు అక్రమ వలసదారులకు, చొరబాటుదారులకు ఇవ్వాలా..? అది మీకు ఆమోదయోగ్యమేనా..?’’ అని ప్రజలను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ నిన్న బన్స్వారాలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వారు మా ఆడవాళ్ల బంగారాన్ని లెక్కపెట్టి లాక్కుంటారు. ఈ అర్బన్ నక్సల్స్ భావజాతం మీ మంగళసూత్రాలను కూడా తీసేస్తుంది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ రోజు కూడా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తాను మాట్లాడిన 90 సెకన్ల ప్రసంగం కాంగ్రెస్ను భయపెడుతోందని, నిజం చెప్పడంతో కాంగ్రెస్ భయాందోళనలో ఉందని అన్నారు.
తాజావార్తలు
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
-
Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
-
Trikala : ఏకంగా మూడు OTTలలో త్రికాల స్ట్రీమింగ్
-
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్లో అభిమానులు
-
Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..