PM Modi: ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు.. మోడీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి 17,000 మంది లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రాజస్థాన్ బన్స్వారా ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపదని ‘‘చొరబాటుదారులకు’’, ‘‘ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి’’ పంచుతోందని, ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు గానూ ప్రధాని నరేంద్రమోడీపై కఠిన చర్యలు తీసుకోవాలని 17,000 మంది పౌరులు భారత ఎన్నికల కమిషన్ లేఖలు రాశారు.
Read Also: Ranjith Reddy: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రంజిత్ రెడ్డి..
Also Read
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
వతన్ కే రహామే మరియు సంవిధాన్ బచావో నాగరిక్ అభియాన్ అనే రెండు పౌర హక్కుల సంఘాల నేతృత్వంలోని 17,000 మంది పౌరులు లేఖపై సంతకం చేశారు. మోడీ ప్రసంగం ‘మత భావాలను’ ఆకర్షించడమే కాకుండా ముస్లింలపై హిందువులలో ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉందని ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని, కాంగ్రెస్ మేనిఫెస్టోలోని సంపద పున:పంపిణీ హామీపై ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన తల్లులు, సోదరీమణుల బంగారం, చివరకు మంగళసూత్రాలను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన.. ‘‘ఈ దేశంలోని సంపదపై తొలిహక్కు ముస్లింలకే ఉంది’’ అనే వ్యాఖ్యలను మోడీ ప్రస్తావించారు.
‘‘మీరు కష్టపడి సంపాదించిన డబ్బు అక్రమ వలసదారులకు, చొరబాటుదారులకు ఇవ్వాలా..? అది మీకు ఆమోదయోగ్యమేనా..?’’ అని ప్రజలను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ నిన్న బన్స్వారాలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వారు మా ఆడవాళ్ల బంగారాన్ని లెక్కపెట్టి లాక్కుంటారు. ఈ అర్బన్ నక్సల్స్ భావజాతం మీ మంగళసూత్రాలను కూడా తీసేస్తుంది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ రోజు కూడా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తాను మాట్లాడిన 90 సెకన్ల ప్రసంగం కాంగ్రెస్ను భయపెడుతోందని, నిజం చెప్పడంతో కాంగ్రెస్ భయాందోళనలో ఉందని అన్నారు.
తాజావార్తలు
-
Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
Tollywood: పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాల జాబితా..
-
Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ ‘తవా పనీర్ టిక్కా’.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
-
CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..