PM Modi: ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు.. మోడీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి 17,000 మంది లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రాజస్థాన్ బన్స్వారా ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపదని ‘‘చొరబాటుదారులకు’’, ‘‘ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి’’ పంచుతోందని, ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు గానూ ప్రధాని నరేంద్రమోడీపై కఠిన చర్యలు తీసుకోవాలని 17,000 మంది పౌరులు భారత ఎన్నికల కమిషన్ లేఖలు రాశారు.
Read Also: Ranjith Reddy: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రంజిత్ రెడ్డి..
Also Read
- Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
- CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
వతన్ కే రహామే మరియు సంవిధాన్ బచావో నాగరిక్ అభియాన్ అనే రెండు పౌర హక్కుల సంఘాల నేతృత్వంలోని 17,000 మంది పౌరులు లేఖపై సంతకం చేశారు. మోడీ ప్రసంగం ‘మత భావాలను’ ఆకర్షించడమే కాకుండా ముస్లింలపై హిందువులలో ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉందని ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని, కాంగ్రెస్ మేనిఫెస్టోలోని సంపద పున:పంపిణీ హామీపై ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన తల్లులు, సోదరీమణుల బంగారం, చివరకు మంగళసూత్రాలను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన.. ‘‘ఈ దేశంలోని సంపదపై తొలిహక్కు ముస్లింలకే ఉంది’’ అనే వ్యాఖ్యలను మోడీ ప్రస్తావించారు.
‘‘మీరు కష్టపడి సంపాదించిన డబ్బు అక్రమ వలసదారులకు, చొరబాటుదారులకు ఇవ్వాలా..? అది మీకు ఆమోదయోగ్యమేనా..?’’ అని ప్రజలను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ నిన్న బన్స్వారాలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వారు మా ఆడవాళ్ల బంగారాన్ని లెక్కపెట్టి లాక్కుంటారు. ఈ అర్బన్ నక్సల్స్ భావజాతం మీ మంగళసూత్రాలను కూడా తీసేస్తుంది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ రోజు కూడా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తాను మాట్లాడిన 90 సెకన్ల ప్రసంగం కాంగ్రెస్ను భయపెడుతోందని, నిజం చెప్పడంతో కాంగ్రెస్ భయాందోళనలో ఉందని అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్గా..
-
Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్తో నెలల తరబడి తాజాగా..!
-
Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
-
AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
-
Venkatesh Iyer: రజత్ పాటిదార్ ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు.. ఆర్సీబీ కెప్టెన్పై వెంకటేష్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!