సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైరయ్యారు. రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తామన్నోళ్లు పారిపోతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు.
త్వరలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. దీంతో ఇండియా కూటమిలోని మిత్రపక్షాల మధ్య విభేదాలు తలెత్తినట్లుగా కనిపిస్తోంది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ హింసను ప్రేరేపిస్తోందని బీజేపీ ఆరోపించింది. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని ‘హత్య’, ‘హింస’ అనే పదాలను ఉపయోగించరాని పేర్కొంది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, ఇటీవల డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నాన్ని ప్రస్తావిస్తూ.. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు హింసను ప్రేరేపిస్తుందని మాజీ ఐపీఎస్ అధికారి రాసిన లేఖను బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది హైలెట్ చేశారు.
Karanataka : ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ బిల్లుపై కర్ణాటక ప్రభుత్వం 48 గంటల్లో యూ టర్న్ తీసుకుంది. ప్రైవేట్ రంగంలో సి, డి కేటగిరీ ఉద్యోగాల్లో స్థానికులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయాన్ని కాంగ్రెస్ సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేసింది.
Digvijaya Singh: కరుడుగట్టిన కాంగ్రెస్ నేత, ఆర్ఎస్ఎస్ బద్ధవ్యతిరేకించే దిగ్విజయ్ సింగ్, ఆ సంస్థను పొగిడారు. సమర్థవంతమైన కమ్యూనికేషన్, సంస్థాగత విస్తరణపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ని చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్ యూత్ కార్యకర్తలకు సూచించారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నారు. రైతు రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను స్వచ్ఛమైన తెలుగులో జారీ చేయడటం పట్ల వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ.. ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు.
ప్రోటోకాల్ గురించి కేటీఆర్.. హరీష్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలన ముందు కేటీఆర్.. హరీష్ ల అనుభవం చాలా చిన్నది.. వాళ్ల వయస్సు చిన్నదని, ఎంపీ గా రేవంత్ ఉన్నప్పుడు ఆయన నియోజక వర్గంలో ప్రోటోకాల్ పాటించారా కేటీఆర్.. హరీష్ ఎప్పుడైనా..? అని ఆయన ప్రశ్నించారు. మీరు ప్రోటోకాల్ పాటించకుండా.. ఇప్పుడు సిఎం రేవంత్ నీ ప్రోటోకాల్ గురించి అడగడంలో అర్థం లేదని, సంగారెడ్డి లో…
Amit Shah: ప్రతిపక్ష కాంగ్రెస్ టార్గెట్గా కేంద్ర హోం మంత్రి విమర్శలు గుప్పించారు. హర్యానాలోని మహేంద్రగఢ్లో మంగళవారం పర్యటించిన ఆయన, కాంగ్రెస్ని లక్ష్యంగా చేసుకున్నారు.
ఇండియా కూటమిలో మిత్రపక్షాల మధ్య విభేదాలు తలెత్తినట్లుగా కనిపిస్తోంది. ఇందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాగిణి నాయక్ ఎక్స్ ట్విట్టర్లో ఆప్ ఎంపీకి సంబంధించిన ఫొటోను పోస్టు చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరింపులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆరోపించారు. కాంగ్రెస్లోకి ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో మెజారిటీ వారికి వ్యతిరేకంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించి కాంగ్రెస్లో చేరవలసి వచ్చింది. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విద్యాసంస్థలు, రియల్ ఎస్టేట్ లేదా ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, వారిని భయపెట్టేందుకు సంబంధిత శాఖలను ఉపయోగించి బెదిరించారని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రాణహాని ఉందని, కాంగ్రెస్లో…