KTR : కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మరోసారి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామలను అమలు చేయాలంటే.. జూబ్లీహిల్స్ లో ఓడించాలన్నారు. అలా ఓడిస్తేనే ఆ పార్టీకి భయం పట్టుకుని హామీలను అమలు చేస్తుందన్నారు కేటీఆర్. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ రాకుండా ఓడించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. అందుకే…
Telangana BJP : కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఇవ్వనందుకు ఆయనకు ఏకంగా మంత్రి పదవే ఇస్తున్నారు. రేపు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేయబోతున్నాడు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ ఫైర్ అయింది. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేడు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయబోతోంది. ఉదయం 11 గంటలకు ఎలక్షన్ కమిషన్ ను…
Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముంగిట్లో కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ అధినాయకత్వం. పార్టీ నాయకుడు, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్కు మంత్రి పదవి ప్రకటించింది. ఎల్లుండి సీఎం రేవ్ంత్ రెడ్డి టీమ్లో చేరబోతున్నారు అజార్. తెలంగాణ మంత్రివర్గంలో ఇంకా మూడు ఖాళీలు ఉండగా… అందులో ఒకదాన్ని అజార్కు క్లియర్ చేశారు. మిగతా రెండిటిని డిసెంబర్లో భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం రాజ్భవన్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అజార్.…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుకున్నవే ఉంటాయా? లేక అద్భుతాలు జరుగుతాయా? అత్యంత కీలకమైన ముస్లిం ఓటర్ల మొగ్గు ఎటువైపు? ఎంఐఎం కాంగ్రెస్కు మద్దతు ప్రకటించినా… ఆ ఓట్లు సాలిడ్ అవుతాయా లేదా అన్న అనుమానాలు ఎందుకు పెరుగుతున్నాయి? నియోజకవర్గంలో అసలు మైనార్టీ ఓట్బ్యాంక్ టార్గెట్గా జరుగుతున్న రాజకీయం ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది అధికార కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల నాటికి, ఇప్పటికీ పట్టులో ఏ మాత్రం తేడా…
Amit Shah: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు వ్యాఖ్యల పదును పెరిగింది. ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నిస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏన్డీయే సీఎం అభ్యర్థి నితీష్ కుమార్ అని స్పష్టం చేశారు.
Minister Seethakka : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. ఆమెకు అప్పగించిన బోరబండ డివిజన్లో మంగళవారం పర్యటిస్తూ ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ (BRS) అబద్ధపు ప్రచారానికి తెరదించాల్సిన సమయం వచ్చిందని సీతక్క వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో ఉన్న రౌడీ షీటర్లు ఇప్పుడు మంచివాళ్లుగా మారిపోయారా? అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై పదే పదే…
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, మహా కూటమి శుక్రవారం తన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. దీనికి “బీహార్ కా తేజస్వి ప్రణబ్” అని పేరు పెట్టారు. తేజస్వి యాదవ్ నాయకత్వంలో విడుదల చేసిన ఈ మానిఫెస్టోలో, ఉపాధి, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తామని మహా కూటమి హామీ ఇచ్చింది. ఈ మేనిఫెస్టో కేవలం ఎన్నికల వాగ్దానాలు మాత్రమే కాదని, బీహార్ పునర్నిర్మాణానికి ఒక బ్లూప్రింట్ అని మహా కూటమి పేర్కొంది.…
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన వైద్యురాలి ఆత్మహత్య కేసులో రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషించారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బీహార్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు ఇక వారం రోజులే మిగిలుంది. ఇంకోవైపు రాష్ట్రంలో ఛత్ పండుగ సందడి సాగుతోంది. రాష్ట్రమంతా కోలాహలంగా ఉంది. ఈరోజుతో ఛత్ పండుగ ముగియనుంది. ఇక ఓట్ల పండుగ ప్రారంభం కానుంది.
Off The Record: మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తాజాగా తెరపైకి తెచ్చిన డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి కోసం యేడాదికి 25 కోట్లు ఇవ్వాలని ఆయన స్వరం పెంచడం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో పాలమూరు ఎమ్మెల్యేది స్వపక్షమా? లేక విపక్షమా? అన్న డౌట్స్ సైతం వస్తున్నాయట కొందరికి. గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ఎమ్మెల్యేల చేతిలో చిల్లి గవ్వ లేకపోవడం ఇబ్బందిగా మారిందని, పెళ్ళిళ్ళకో, పరామర్శలకో…