Karnataka BJP: కర్ణాటక భారతీయ జనతా పార్టీలో కోల్డ్ వార్ నడుస్తోంది. కాషాయ పార్టీలో అంతర్గత విభేదాలతో బహిరంగంగానే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి ఇది కారణం అయి ఉండొచ్చని సమాచారం.
పార్టీ అధికారంలో ఉండగా ఆమెకు నెంబర్వన్ ఎమ్మెల్యేగా పేరు. జిల్లా పార్టీలో కీలకంగా ఉండేవారు. అప్పట్లో పొగిడి పనులు చేయించుకున్న నాయకులే ఇప్పుడు రివర్స్ అవుతున్నారట. గట్టిగానే పొగ పెడుతున్నట్టు టాక్. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? సొంత పార్టీలో ఎందుకు ఇబ్బందిగా మారింది? గుండ శిబిరాన్ని కలవరపెడుతున్న పరిణామాలు శ్రీకాకుళం టీడీపీలో మొదటినుంచీ రెండువర్గాలు. ఒకటి కింజరాపు కుటుంబం.. రెండోది మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ వర్గం. అయినప్పటికీ తనదైనశైలిలో రాజకీయాలు నెరుపుతూ సుదీర్ఘకాలం…
ఉక్రెయిన్- రష్యా యుద్ధం సరికొత్త ప్రపంచ మార్పులకు దారితీస్తోంది. అమెరికా, రష్యా మధ్య పాత పగలు ఈ సంక్షోభంతో మరోసారి బయటపడ్డాయి. ప్రస్తుత పరిస్థితి ప్రచ్ఛన్న యుద్ధ రోజులను తలపిస్తోంది. ఈ క్రమంలో అమెరికా, రష్యా అతి పెద్ద దేశాలైన చైనా, భారత్ను పూర్తిగా తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్పై రష్యా దాడికి వ్యతిరేకంగా మార్చి 2న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రవేశ పెట్టిన తీర్మానానికి 141 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి.…
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన కామెంట్లు చేశారు. చిల్లర వ్యక్తుల గురించి పట్టించుకోవద్దు..ఓపిక పడితే రాజులు అవుతారు అన్నారు తుమ్మల. రాజకీయాల్లో కావలసింది ఓపిక… ఓపిక పడితే కార్యకర్తలే రాజులు అవుతారన్నారు. అందువల్ల కార్యకర్తలు ఓపిక తో వ్యవహరించాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పాలేరు నియోజకవర్గంలో కార్యకర్తల తో ఆయన మాట్లాడుతూ పరోక్షంగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నుద్దేశించి వ్యాఖ్యానించారు. మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, అయితే మనం…
వారిద్దరూ అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు. కలిసి మెలిసి కనిపించేవారు. సడెన్గా ఇద్దరూ ఎడముఖం పెడముఖం. ఓ రేంజ్లో కోల్డ్వార్ ఉన్నట్టు టాక్. ఇద్దరి మధ్య ఏ విషయంలో చెడింది? ఎవరా నాయకులు? ఏమా కథ? నల్లగొండలో ఎవరికి వారే..!భూపాల్రెడ్డి. నల్లగొండ ఎమ్మెల్యే. గుత్తా సుఖేందర్రెడ్డి.. ఎమ్మెల్సీ. ఇద్దరూ అధికార టీఆర్ఎస్ నాయకులే. నల్లగొండలో ఒకరిపై ఒకరు పైచెయ్యి సాధించేందుకు వేయని ఎత్తుగడలు లేవు. దీంతో అధికారపార్టీలో కోల్డ్వార్ సెగలు రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం నుంచి…
తెలంగాణ బీజేపీలో కలకలం మొదలైందా? రహస్య భేటీలు.. సారథి బండి సంజయ్పై తిరుగుబాటు సంచలనంగా మారుతున్నాయా? పరిస్థితి షోకాజ్ నోటీసుల వరకు వెళ్లిందా? బండిపై సీనియర్లు ఎందుకు రుసరుసలాడుతున్నారు? ముఖ్యంగా పార్టీ చీఫ్ సొంత జిల్లాలోనే ఇంటిపోరు ఎక్కువైందా? సంజయ్ పేరు ఎత్తితేనే అసంతృప్త సీనియర్లు గుర్రురహస్య భేటీలు.. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో రచ్చ రంబోలా అవుతోంది. సీనియర్ నేతల సీక్రెట్ మీటింగ్స్ సెగలు.. ఢిల్లీ వరకు తాకాయి. రాష్ట్రంలో కమలం పార్టీని బలోపేతం చేయాలని అనుకుంటున్న…
చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య హైఓల్టేజ్ వార్ నడుస్తూనే ఉంది.. ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలు సందర్భాల్లో గ్రూప్ వారు రోడ్డెక్కి రచ్చగా మారిన సందర్భాలు లేకపోలేదు.. తాజాగా మరోసారి అదే జరిగింది.. ఇప్పుడు పార్టీ సుప్రీం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు నేపథ్యంలో.. మరోసారి గ్రూప్ వార్ బయటపడింది.. ఎమ్మెల్యే ఆర్కే రోజా వర్సెస్ ఆమె వ్యతిరేక వర్గంగా మారింది పరిస్థితి… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన…