అమరావతి : ఏపీ రిటైల్ పార్క్స్ పాలసీని జగన్ సర్కార్ విడుదల చేసింది.. 2021-26 కాలానికి రిటైల్ పార్క్స్ పాలసీని రూపొందించిన ఏపీ ప్రభుత్వం… ఏపీలో రిటైల్ రంగానికి ఊతమిచ్చేలా పాలసీ రూపకల్పన చేసింది. రిటైల్ రంగంలో పెట్టుబడులు.. ఉపాధి కల్పనే లక్ష్యంగా పాలసీని రూపొందించిన జగన్ సర్కార్… వచ్చే ఐదేళ్ల కాలంలో రిటైల్ రంగంలో రూ. 5 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టే విధంగా రిటైల్ పార్క్స్ పాలసీ రూపకల్పన చేయనుంది.
read also : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్
రిటైల్ పార్క్స్ పాలసీ ద్వారా ఐదేళ్లల్లో 50 వేల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రిటైల్ పార్క్స్ డెవలపర్స్, రిటైల్ వ్యాపారస్తుల కోసం ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా నోడల్ అధికారుల నియామకం చేసిన ప్రభుత్వం… ఆన్లైన్ క్లియరెన్స్ల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ ఏర్పాటు చేసింది.