తెలంగాణలో రాజకీయ వేడి పెరగుతోంది. వరసగా జాతీయ నాయకులు వచ్చి బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువు ఉండగానే… రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇటీవల రాహుల్ గాంధీ వరంగల్ లో బహిరంగ సభ నిర్వహిస్తే… తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తుక్కుగూడ లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది.…
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర ఉండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడేక్కింది. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై బీజేపీ నిలదీస్తోంది. తాజాగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ మూర్ఖుడు, ఆదివాసీ, గిరిజన వ్యతిరేఖి అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గిరిజనులకు 9.8 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా కులాన్ని,…
ఢిల్లీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో విస్తరించేందుకు ఆమ్ అద్మీ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పంజాబ్లో గత ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో విజయం సాధించిన ఆప్ ఎలాగైనా పంజాబ్ అసెంబ్లీని సొంతం చేసుకోవాలని ప్రణాళికలు వేస్తున్నది. ప్రజలు కోరుకున్న అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టింది. కాగా, ఇప్పుడు గోవా పై దృష్టి సారించింది ఆ పార్టీ. ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు. న్యాయవాది, సామాజిక కార్యకర్త అమిత్ పాలేకర్ను సీఎం అభ్యర్థిగా…
పంజాబ్లో ఎలాగైనా పాగా వేయాలని ఆప్ నిర్ణయం తీసుకుంది. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు, రైతు సమస్యలు, బీజేపీకి ఎదురుగాలి, కాంగ్రెస్ నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్ బయటకు వచ్చి కొత్త పార్టీని స్థాపించడంతో రాజకీయంగా కొంత అనిశ్చితి నెలకొన్నది. ఈ అనిశ్చితిని సొంతం చేసుకోవాలని ఆప్ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ పై ప్రత్యేక దృష్టిని సారించిన కేజ్రీవాల్ ఇప్పటికే అనేక వరాలు ప్రకటించారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ ఎన్నికల్లో ఎవర్ని…
కరోనా పేషేంట్లలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కరోనా రెస్పిరేటరీ సిస్టమ్పై దాడి చేస్తుంది కాబట్టి మెరుగైన శ్వాసను తీసుకోవడానికి అనుగుణంగా యోగా క్లాసులను నిర్వహించనున్నారు. వ్యాధినిరోదక శక్తిని పెంచే యోగాసనాలు, ప్రాణాయామం వంటి వాటికి సంబంధించిన క్లాసులను నిర్వహించనున్నారు. ఢిల్లీకి యోగశాల పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. కరోనా…
మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. సుమారు రెండు వేల కోట్ల రూపాయలతో ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 108 అడుగుల విగ్రహం ఏర్పాటుతో పాటు అంతర్జాతీయ స్థాయి మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శివరాం సింగ్ చౌహన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది శంకరాచార్య ఎక్తా న్యాస్ ట్రస్ట్ తో జరిగిన మీటింగ్ లో దీనిపై చర్చించారు. ఈ విగ్రహం, మ్యూజియం ఏర్పాటు ద్వారా ఆదిగురువైన ఆదిశంకరాచార్య గురించి ప్రపంచానికి…
కర్ణాటక రాష్ట్రం ఏర్పడి 65 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్రం ఏర్పాటైన తరువాత సరిహద్దు వివాదాలు నెలకొన్నాయని, అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయని, సరిహద్దుల్లోని ప్రాంతాలకు పాత పేర్లు ఉండటం వలనే ఇలాంటి వివాదాలు వస్తున్నాయని తెలిపారు. Read: ఆ కేసులో మాజీ మంత్రి అరెస్ట్… ఇప్పటికే హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాన్ని కల్యాణ…
పంజాబ్ రాష్ట్రంలో ఎట్టకేలకు ముఖ్యమంత్రిని మార్చేశారు. గత కొంతకాలంగా ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు తలెత్తాయి. సిద్ధూ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక కాకముందు నుంచే కెప్టెన్కు, సిద్ధూకు మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే, సిద్ధూ చాలా కాలం క్రితం నుంచి తనను తాను సీపీపీ అధ్యక్షుడిగా చెప్పుకుంటూ వచ్చారు. భవిష్యత్తులో తన నేతృత్వంలోనే పంజాబ్ కాంగ్రెస్ నడుస్తుందని పేర్కొన్నాడు. దానికి తగినట్టుగానే కాంగ్రెస్ అధిష్టానం వద్ధ పావులు కదిపారు. పైగా రాహుల్గాంధీకి, ప్రియాంక గాంధీకి సిద్ధూకి…
పంజాబ్ రాజకీయాలు రంగులు మారుతున్నాయి. అమరీందర్ సింగ్ రాజీనామా తరువాత ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అప్పగించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాలని ఆ పార్టీ సీనియర్ నేత అంబికా సోనీకి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. అయితే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫర్ను అంబికాసోనీ తిరస్కరించారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా సిక్కు వర్గానికి చెందిన వ్యక్తిని నియమిస్తేనే బాగుంటుందని, వచ్చే ఎన్నికల్లో సిక్కు వర్గంనుంచి వ్యతిరేకత రాకుండా ఉండాలి అంటే…
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈరోజు రాజీనామా చేశారు. అనారోగ్య సమస్యలతో పాటుగా, కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే తలంపుతో తాను రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. ఐదేళ్లపాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి అనగా పదవి నుంచి తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆయన తప్పుకోవడానికి పటేల్ వర్గం వ్యతిరేఖతే కారణమని తెలుస్తోంది. గుజరాత్లో పటేల్ వర్గీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి ఓటు బ్యాంకింగ్ ఏ పార్టీకైనా సరే చాలా అవసరం. 2017లో…