త్వరలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం.. అతి త్వరలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిజాంసాగర్ ప్రాజెక్టుకు రావడం ఆనందంగా ఉందని, దేశ చరిత్రలోనే 100 ఏళ్ల చరిత్ర గల ప్రాజెక్ట్ నిజాంసాగర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 10 ఏళ్లలో 1.81 లక్షల…
హైదరాబాద్ లో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు పెట్టగా 105 సెక్షన్ నాన్బెయిలబుల్ కేసు కాగా 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల…
MLC Kavitha: తెలంగాణ తల్లి చేతులో బతుకమ్మ ఎందుకు? అనే ప్రశ్నకు ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గతంలో ఇందిరా గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ బతుకమ్మ ఎత్తుకొని బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారని కవిత గుర్తు చేశారు.
CM Revanth Reddy: ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండోరోజు పర్యటన కొనసాగుతుంది. రెండు రోజులుగా బిజీబిజీగా సీఎం వున్నారు. అయితే ఇవాళ కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్తో పాటు, పలువురు మంత్రులను కలిసే అవకాశం ఉంది.
సంక్రాంతి నుంచి రైతు భరోసా.. ఇప్పటికే ప్రకటించామన్న భట్టి రైతు భరోసాని సంక్రాంతి నుంచి అమలుచేస్తామని.. ఇప్పటికే ప్రకటించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతులకు ఇచ్చే బోనస్ రైతు భరోసా, రుణమాఫీ కన్నా ఎక్కువ లబ్ధి రైతులకు చేకూర్చుతుందని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో డిప్యూటీ సీఎం చిట్ చిట్ నిర్వహించారు. రాహుల్ గాంధీని కలవలేదని తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. హైడ్రాకి ధనికా పేద అన్న తేడా లేదని భట్టి…
Drugs : అమీర్పేట్ ఎక్సైజ్ పోలీసులు బెంగుళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి 6.65 గ్రాముల ఎండీ ఎమ్ఏ డ్రగ్స్, 2.27 గ్రాముల గంజాయి, 8.57 గ్రాముల హ్యష్ ఆయిల్ మరియు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వివరాల ప్రకారం, కేరళకు చెందిన సంజయ్, శ్రీజిత్, ఆదర్శ్ అనే యువకులు ఎస్ఆర్ నగర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో…
CM Revanth Reddy : యూపీఎస్సీ మెయిన్స్ 2024 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ ఏడాది తొలి సారిగా రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. సివిల్స్ సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ఈ ఏడాది తొలిసారిగా అమలు చేసింది. సింగరేణి సంస్థ అధ్వర్యంలో 135 మందికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు వివాదాస్పదంగా మారింది.. అయితే, ఆమె తెలంగాణ తల్లి కాదు.. కాంగ్రెస్ తల్లి అని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు.. తలరాత మార్చమని ప్రజలు అధికారం ఇచ్చారు.. కానీ, తల్లిని మార్చమని కాదు.. అంటూ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై సెటైర్లు వేశారు..
వందశాతం రుణమాఫీ అయ్యిందంటున్నారు.. ఏ గ్రామంలో వంద శాతం రుణమాఫీ జరిగిందని నిరూపించినా.. చివరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో రైతులకు వందశాతం రుణమాఫీ అయ్యిందేమో అడగండి.. వందశాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో కేటీఆర్ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయనుంది ఎన్టీవీ.. అసలు.. కాంగ్రెస్ ఏడాది పాలనకు కేటీఆర్ ఎన్ని మార్కులేస్తారు..? ఇంకా నాలుగేళ్ల సమయం ఉండగా.. అప్పుడే బీఆర్ఎస్కి తొందర ఎందుకు?.. అసలు పవర్ లేకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నారా?.. జమిలి ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమైపోతుందా?.. ఎర్రవల్లి ఫాంహౌస్లోనే లగచర్ల దాడి ప్లాన్ చేశారా?.. కేసీఆర్ అసెంబ్లీని ఎందుకు తప్పించుకుంటున్నారా?..