CM Revanth Reddy: రైతు భరోసాపై సీఎం సంచలన ప్రకటన..
- ముగిసిన కేబినెట్ సమావేశం
- వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం
- ఏడాదికి ఎకరానికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించాం
- భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి ఏటా రూ.12 వేలు-సీఎం రేవంత్ రెడ్డి.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగా.. కేబినెట్ పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రైతు భరోసాపై సంచలన ప్రకటన చేశారు. రైతాంగానికి నూతన సంవత్సరం మంచి జరగాలని తమ ప్రభుత్వం వారిని అండగా ఉంటుందని తెలిపారు. వ్యవసాయం పండగ చేయాలని తమ ఆలోచన అన్నారు.
Read Also: Pawan Kalyan: జనసేనకి ఇంధనంగా దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Also Read
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసా వ్యవసాయ యోగ్య భూములకు రైతు భరోసా ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం రైతు బంధు ఏడాదికి పది వేలు ఇచ్చింది.. తాము 12 వేలు ఇస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా.. భూమి లేని వ్యవసాయ రైతు కూలీలకు కూడా ప్రతీ ఏటా 12 వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో భూమి లేని రైతుకి ఇస్తామని చెప్పారు.
Ram Charan: ఇండియన్ పాలిటిక్స్ కి ఏకైక గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్!
మరోవైపు.. రేషన్ కార్డు లేని వారికి నూతన రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జనవరి 26 నుండి పథకాలు అమలు చేస్తామన్నారు. వ్యవసాయ యోగ్యం కానీ భూములు.. మైనింగ్, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఉండదని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న భూములకు రైతు భరోసా ఇవ్వమన్నారు. గ్రామాల వారీగా సభలు పెట్టి ప్రజలకు వివరిస్తాం.. అలాంటి వారు మీరే నేరుగా తప్పుకోండని తెలిపారు. ఆర్థిక పరిస్థితి వెసులు బాటు పట్టి రైతు భరోసాను రూ. 10 వేల నుండి రూ. 12 వేలకు పెంచామన్నారు. భూమి లేని వాళ్లకు కూడా ఇస్తున్నాం.. 12 వేలు కాబట్టి ఆర్థిక వెసులు బాటు పట్టి ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సాగు చేయకపోయినా.. సాగుకు అనుకూలంగా ఉండే భూమికి రైతు భరోసా అని పేర్కొన్నారు. కోతలు లేవు.. అందరికీ రైతు భరోసా ఇస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!