Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు హాట్ హాట్ గా మారాయి. ఇన్ని రోజులు ఇలాగే ఉంటే.. నిన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (కొత్త ప్రభాకర్ రెడ్డి ఎటాక్)పై కత్తి దాడి మరో స్థాయికి చేరుకుంది.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొని హామీలు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, cm kcr, brs, telangana elections 2023
ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సభలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బోల్లం మల్లయ్య యాదవ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను ఆంధ్రలో కలిపిన వాళ్ళే కాంగ్రెస్ వాళ్లు అని, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మణంలో అన్యాయం జరిగింది.. ఆ పాపం కాంగ్రెస్ పార్టీదేనన్నారు. 9 ఏళ్లలో సాగర్ నుంచి కావాల్సిన సాగునీటిని విడుదల breaking…
దుబ్బాక ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తికి సరైన భద్రత ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అస్సలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు.
CM KCR: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మంగళవారం హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో పర్యటించి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ప్రసంగించనున్నారు.
MLC Kavitha: భారత దేశానికి తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్చూచి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, తెలంగాణ సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సాధించిందని వివరించారు
కత్తిపోట్లకు గురైన మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యులను అడిగి ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. హామీలు ఇవ్వడం, మభ్యపెట్టడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య.. నితీ, నిజాయితీ బీఆర్ఎస్ ఎజెండాలో లేదు.. యువత నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పటం ఖాయం.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదన్నారు. ఎన్నికల్లో ప్రజా తీర్పును ఎదుర్కోలేక భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటు అంటూ ఆయన మండిపడ్డారు.