అసాంఘిక కార్యకలాపాలకు ప్రొద్దుటూరు అడ్డాగా మారింది.. కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరు పట్టణం క్యాసినో, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది.. టీడీపీ ముఖ్య నాయకులే ఈ వ్యవహారాలను నడిపిస్తున్నారు.. వీరు మట్కా, జూదం, క్రికెట్ బెట్టింగ్తో పాటు గోవాలో క్యాసినోలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో…
ఉండవల్లి నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి సీఎం నారా చంద్రబాబు నాయుడు దీపావళి వేడుకలు చేసుకున్నారు. పండగ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇంట్లో పూజ చేసి దీపాలు వెలిగించారు. ఆపై సతీమణితో కలిసి కాకరవత్తులు వెలిగించారు. చెడుపై మంచి సాధించిన విజయం దీపావళి అని సీఎం అన్నారు. చంద్రబాబు దంపతులు రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం దీపావళి వేడుకలకు సంబంధించిన పిక్స్ వైరల్ అయ్యాయి.
AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి రోజు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగులు, పింఛనర్లకు దీపావళి కానుకను డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కూటమి సర్కార.. ఇక, గత ఏడాది అంటే 2024 జనవరి 1వ తేదీ నుంచి డీఏ అలవెన్స్ను 3.64 శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది. అంటే, డీఏ పెంపు 2024 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది…
TDP: ఏపీ సీఎం చంద్రబాబు అటు మంత్రులకు ఇటు నేతలకు వైసీపీ ని ధీటుగా ఎదుర్కోవాలని చెప్తున్నారు.. కేబినెట్ సమావేశాలు జరిగిన ప్రతిసారి మంత్రులకు రకరకాల సూచనలు ఇస్తున్నారు… వైసీపీకి సరైన కౌంటర్లు ఇవ్వడం లేదని అదే విధంగా వైసీపీపై ధీటుగా స్పందించట్లేదని… ఇలా చేయకపోవడం వల్ల తప్పుడు సంకేతాలు జనంలోకి వెళ్లే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు.. దీంతోపాటు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి కౌంటర్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు చెబుతూ ఉన్నారు.. Read…
అయోధ్యలో 26 లక్షల దీపాలు.. రెండు గిన్నీస్ రికార్డులు రామనగరిలో వెలుగుల వేడుక సంబరాలు అంబరాన్ని అంటాయి. అయోధ్య దీపోత్సవానికి ఏకంగా రెండు గిన్నీస్ రికార్డులు సొంతం అయ్యాయి. అయోధ్య నగరంలో 9వ దీపోత్సవంలో భాగంగా ఈ ఏడాది 26 లక్షలకుపైగా దీపాలను వెలిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సరయూ నదీ తీరం వెంబడి లక్షలాది దీపాలను వెలిగించారు. నదీ తీరంలోని ఘాట్లు పెద్దఎత్తున భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రామ్లీలా వంటి సాంస్కృతిక…
నేను పరామర్శించడానికి వస్తే పోలీసులు ఎందుకు ఉన్నారు..? నెల్లూరు జిల్లా రాళ్లపాడులో జరిగిన హత్యాయత్నం ఘటనలో గాయపడి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు యువకులను మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరులో జరిగింది ఒక మారణఖండగా చెప్పవచ్చు అన్నారు. పేద కుటుంబంలో పుట్టిన ముగ్గురు మీద ఉద్దేశపూర్వకంగా కారుతో హత్యాయత్నం చేశారు అని ఆరోపించారు. ప్రమాదం అని ఒక చిన్న కేసు నమోదు చేసినట్లు…
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాలుగు పెండింగ్ డీఏలకు గాను ఒక డీఏను ఇవ్వబోతున్నట్లు పేర్కొనింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఉద్యోగులకు ఒక డీఏ ఇస్తున్నాం.. దీని కోసం ప్రతి నెలా రూ.160 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇక, ఒక డీఏ ప్రకటించడంపై ఉద్యోగ సంఘాల నేతలు స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ నేత విద్యా సాగర్ మాట్లాడుతూ..…
భవిష్యత్తు అంతా యువతదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. యువత కోసమే పార్టీ కార్యాలయంలో అనేక నిర్మాణాలు చేపడుతున్నాం.. కొత్త తరం రాజకీయ నాయకులకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిరంతరం శిక్షణ ఇస్తాం.
AP Govt: ఉద్యోగ సంఘాలతో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం ముగిసింది. ఉద్యోగుల సంఘాల నేతల అభిప్రాయాలను మంత్రులు తెలుసుకున్నారు. ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయాలను క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించనున్నారు.
బంగారం తాకట్టు పేరుతో భారీ మోసం.. బాధితుల ఆత్మహత్యాయత్నం పార్వతీపురంలో మన్యం జిల్లాలో బంగారం తాకట్టు పేరుతో భారీ మోసం జరిగింది. గోల్డ్ షాప్ లో తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వక పోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి బాధితులు పాల్పడారు. పురుగుల మందు, పెట్రోల్ పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని బాధితులు బెదిరింపులకు దిగారు. తాము తాకట్టు పెట్టిన 15 తులాల బంగారం షాపు యజమాని ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. అయితే, ఆందోళన నేపథ్యంలో యజమాని బంగారం…