Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Manipur Suspect Arrested For Conspiring With Terrorists From 2 Nations

Manipur: రెండు దేశాల టెర్రరిస్టులతో మణిపూర్ వ్యక్తి కుట్ర.. అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

Published Date :September 30, 2023 , 8:28 pm
By Venu Goapl Reddy
Manipur: రెండు దేశాల టెర్రరిస్టులతో మణిపూర్ వ్యక్తి కుట్ర.. అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Manipur Violence: గత నాలుగు నెలలుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. మెయిటీ, కుకీల మధ్య జాతి ఘర్షణల కారణంగా 175 మంది మరణించారు. చాలా మంది సొంత ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. పరిస్థితి శాంతియుతంగా మారుతుందనుకునే సమయంలోనే మళ్లీ అల్లర్లు మొదలువుతున్నాయి. ఇటీవల ఇద్దరు మెయిటీ విద్యార్థులను మిలిటెంట్లు చంపడం మరోసారి ఆ రాష్ట్రంలో విధ్వంసానికి కారణమైంది. ఏకంగా సీఎం బీరెన్ సింగ్ ఇంటిపైనే ఆందోళనకారులు దాడికి తెగబడ్డారు.

ఇదిలా ఉంటే మణిపూర్ రాష్ట్రంలో కొందరు కుట్రకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మణిపూర్ కి చెందిన ఓ అనుమానితుడిని ఎణ్ఐఏ అరెస్ట్ చేసింది. ఇతను బంగ్లాదేశ్, మయన్మార్ లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పరుచుకుని కుట్రకు పాల్పడుతున్నడని తెలుస్తోంది. ఇలా అంతర్జాతీయ కుట్రకు పాల్పడున్న వ్యక్తిని చురచంద్‌పూర్ లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిందితుడితో పాటు అతని నెట్‌వర్క్ మణిపూర్ సంక్షోభాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించిందని ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
  • CM Vijay Simplicity: దటీజ్ దళపతి.. సీఎం హోదాలో ఉన్నా.. టేబుల్ మోసి సింప్లిసిటీ చాటుకున్న విజయ్!
Add as a preferred
source on google

Read Also: Aditya-L1: కీలక మైలురాయిని దాటిన ఆదిత్య ఎల్1.. భూమి ప్రభావాన్ని తప్పించుకుని ఎల్1 దిశగా ప్రయాణం..

సీమిన్లున్ గాంగ్టే అనే వ్యక్తి భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి మయన్మార్, బంగ్లాదేశ్ ఆధారిత ఉగ్రవాద సంస్థల నాయకత్వంలో కుట్ర పన్నడంలో కీలకపాత్ర పోషించాడని, మణిపూర్ లో అశాంతికి పెంచడానికి ప్రయత్నించాడని ఎన్ఐఏ తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. జూన్ 22న మణిపూర్ లోని క్వాక్తాలో ఒక వ్యక్తిని చంపిన కారుబాంబు పేలుడు కేసులో గాంగ్టే ప్రధాన నిందితుడు. ఓ స్కార్పియోలో బాంబులు అమర్చి చిన్న బ్రిడ్జ్ వద్ద పేల్చాడు. ఈ దాడి ఉగ్రవాదుల చేసినట్లుగా కనిపించింది. అయితే గాంగ్టేకు ఏ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందో ఇంకా ఎన్ఐఏ తెలియజేయలేదు.

దాదాపుగా 25 కుకీ మిలిటెంట్ గ్రూపులు చురచంద్‌పూర్ లో ఉన్నాయి. ఇవన్నీ గతంలో కేంద్రం, రాష్ట్రం, మిలిటరీతో త్రైపాక్షిక సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్(SoO) ఒప్పందంపై సంతకం చేశాయి. అయితే ఈ ఒప్పందంపై సంతకం చేసిన కొన్ని గ్రూపులు ఇప్పుడు మణిపూర్ సంక్షోభానికి కారణమవుతున్నారు. మయన్మార్, బంగ్లాదేశ్ మిలిటెంట్ గ్రూపులు భారత్ లోని జాతుల మధ్య చీలిక తీసుకువచ్చి, హింసాత్మక సంఘటనల్లో పాల్గొనే విధంగా భారత్ లోని మిలిటెంట్ నాయకులతో కుట్ర పన్నుతున్నారని దర్యాప్తులో తేలింది.

మణిపూర్ రాష్ట్రంలో మే 3న ప్రారంభమైన తెగల మధ్య గొడవ ఇప్పటికీ సద్దుమణగడం లేదు. మెయిటీలు తమకు ఎస్టీ హోదా కల్పించాలని కోరడాన్ని కుకీ తెగ వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో 10 శాతం భూభాగంలో 50 శాతానికి పైగా మొయిటీలు ఉంటే, మిగిలిన 90 శాతం భూభాగంలో మైనారిటీలు అయిన కుకీలు ఉన్నారు. ఈ వివాదంతోనే మెయిటీలు తమకు ఎస్టీ హోదా కల్పించాలని కోరుతుండటం వివాదస్పదం అయింది. దీనికి తోడు భారత బాహ్యశక్తులు కూడా మణిపూర్ సంక్షోభానికి కారణం అవుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bangladesh
  • Churachandpur
  • Manipur
  • Manipur Violence
  • Myanmar

తాజావార్తలు

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Dowry Harassment: పెళ్లై రెండు నెలలు తిరగకముందే.. వరకట్న వేధింపులకు నవ వధువు బలి!

  • Priyanka Chopra: విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన ప్రియాంక చోప్రా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్‌లో త్రిష..

ట్రెండింగ్‌

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions