Manipur: రెండు దేశాల టెర్రరిస్టులతో మణిపూర్ వ్యక్తి కుట్ర.. అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: గత నాలుగు నెలలుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. మెయిటీ, కుకీల మధ్య జాతి ఘర్షణల కారణంగా 175 మంది మరణించారు. చాలా మంది సొంత ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. పరిస్థితి శాంతియుతంగా మారుతుందనుకునే సమయంలోనే మళ్లీ అల్లర్లు మొదలువుతున్నాయి. ఇటీవల ఇద్దరు మెయిటీ విద్యార్థులను మిలిటెంట్లు చంపడం మరోసారి ఆ రాష్ట్రంలో విధ్వంసానికి కారణమైంది. ఏకంగా సీఎం బీరెన్ సింగ్ ఇంటిపైనే ఆందోళనకారులు దాడికి తెగబడ్డారు.
ఇదిలా ఉంటే మణిపూర్ రాష్ట్రంలో కొందరు కుట్రకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మణిపూర్ కి చెందిన ఓ అనుమానితుడిని ఎణ్ఐఏ అరెస్ట్ చేసింది. ఇతను బంగ్లాదేశ్, మయన్మార్ లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పరుచుకుని కుట్రకు పాల్పడుతున్నడని తెలుస్తోంది. ఇలా అంతర్జాతీయ కుట్రకు పాల్పడున్న వ్యక్తిని చురచంద్పూర్ లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిందితుడితో పాటు అతని నెట్వర్క్ మణిపూర్ సంక్షోభాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించిందని ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
Read Also: Aditya-L1: కీలక మైలురాయిని దాటిన ఆదిత్య ఎల్1.. భూమి ప్రభావాన్ని తప్పించుకుని ఎల్1 దిశగా ప్రయాణం..
సీమిన్లున్ గాంగ్టే అనే వ్యక్తి భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి మయన్మార్, బంగ్లాదేశ్ ఆధారిత ఉగ్రవాద సంస్థల నాయకత్వంలో కుట్ర పన్నడంలో కీలకపాత్ర పోషించాడని, మణిపూర్ లో అశాంతికి పెంచడానికి ప్రయత్నించాడని ఎన్ఐఏ తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. జూన్ 22న మణిపూర్ లోని క్వాక్తాలో ఒక వ్యక్తిని చంపిన కారుబాంబు పేలుడు కేసులో గాంగ్టే ప్రధాన నిందితుడు. ఓ స్కార్పియోలో బాంబులు అమర్చి చిన్న బ్రిడ్జ్ వద్ద పేల్చాడు. ఈ దాడి ఉగ్రవాదుల చేసినట్లుగా కనిపించింది. అయితే గాంగ్టేకు ఏ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందో ఇంకా ఎన్ఐఏ తెలియజేయలేదు.
దాదాపుగా 25 కుకీ మిలిటెంట్ గ్రూపులు చురచంద్పూర్ లో ఉన్నాయి. ఇవన్నీ గతంలో కేంద్రం, రాష్ట్రం, మిలిటరీతో త్రైపాక్షిక సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్(SoO) ఒప్పందంపై సంతకం చేశాయి. అయితే ఈ ఒప్పందంపై సంతకం చేసిన కొన్ని గ్రూపులు ఇప్పుడు మణిపూర్ సంక్షోభానికి కారణమవుతున్నారు. మయన్మార్, బంగ్లాదేశ్ మిలిటెంట్ గ్రూపులు భారత్ లోని జాతుల మధ్య చీలిక తీసుకువచ్చి, హింసాత్మక సంఘటనల్లో పాల్గొనే విధంగా భారత్ లోని మిలిటెంట్ నాయకులతో కుట్ర పన్నుతున్నారని దర్యాప్తులో తేలింది.
మణిపూర్ రాష్ట్రంలో మే 3న ప్రారంభమైన తెగల మధ్య గొడవ ఇప్పటికీ సద్దుమణగడం లేదు. మెయిటీలు తమకు ఎస్టీ హోదా కల్పించాలని కోరడాన్ని కుకీ తెగ వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో 10 శాతం భూభాగంలో 50 శాతానికి పైగా మొయిటీలు ఉంటే, మిగిలిన 90 శాతం భూభాగంలో మైనారిటీలు అయిన కుకీలు ఉన్నారు. ఈ వివాదంతోనే మెయిటీలు తమకు ఎస్టీ హోదా కల్పించాలని కోరుతుండటం వివాదస్పదం అయింది. దీనికి తోడు భారత బాహ్యశక్తులు కూడా మణిపూర్ సంక్షోభానికి కారణం అవుతున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!