Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Manipur Suspect Arrested For Conspiring With Terrorists From 2 Nations

Manipur: రెండు దేశాల టెర్రరిస్టులతో మణిపూర్ వ్యక్తి కుట్ర.. అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

Published Date :September 30, 2023 , 8:28 pm
By Venu Goapl Reddy
Manipur: రెండు దేశాల టెర్రరిస్టులతో మణిపూర్ వ్యక్తి కుట్ర.. అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Manipur Violence: గత నాలుగు నెలలుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. మెయిటీ, కుకీల మధ్య జాతి ఘర్షణల కారణంగా 175 మంది మరణించారు. చాలా మంది సొంత ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. పరిస్థితి శాంతియుతంగా మారుతుందనుకునే సమయంలోనే మళ్లీ అల్లర్లు మొదలువుతున్నాయి. ఇటీవల ఇద్దరు మెయిటీ విద్యార్థులను మిలిటెంట్లు చంపడం మరోసారి ఆ రాష్ట్రంలో విధ్వంసానికి కారణమైంది. ఏకంగా సీఎం బీరెన్ సింగ్ ఇంటిపైనే ఆందోళనకారులు దాడికి తెగబడ్డారు.

ఇదిలా ఉంటే మణిపూర్ రాష్ట్రంలో కొందరు కుట్రకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మణిపూర్ కి చెందిన ఓ అనుమానితుడిని ఎణ్ఐఏ అరెస్ట్ చేసింది. ఇతను బంగ్లాదేశ్, మయన్మార్ లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పరుచుకుని కుట్రకు పాల్పడుతున్నడని తెలుస్తోంది. ఇలా అంతర్జాతీయ కుట్రకు పాల్పడున్న వ్యక్తిని చురచంద్‌పూర్ లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిందితుడితో పాటు అతని నెట్‌వర్క్ మణిపూర్ సంక్షోభాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించిందని ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read

  • FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్‌గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
  • PM Modi: మే 4 తర్వాత బెంగాల్‌లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
  • Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
  • AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..

Read Also: Aditya-L1: కీలక మైలురాయిని దాటిన ఆదిత్య ఎల్1.. భూమి ప్రభావాన్ని తప్పించుకుని ఎల్1 దిశగా ప్రయాణం..

సీమిన్లున్ గాంగ్టే అనే వ్యక్తి భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి మయన్మార్, బంగ్లాదేశ్ ఆధారిత ఉగ్రవాద సంస్థల నాయకత్వంలో కుట్ర పన్నడంలో కీలకపాత్ర పోషించాడని, మణిపూర్ లో అశాంతికి పెంచడానికి ప్రయత్నించాడని ఎన్ఐఏ తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. జూన్ 22న మణిపూర్ లోని క్వాక్తాలో ఒక వ్యక్తిని చంపిన కారుబాంబు పేలుడు కేసులో గాంగ్టే ప్రధాన నిందితుడు. ఓ స్కార్పియోలో బాంబులు అమర్చి చిన్న బ్రిడ్జ్ వద్ద పేల్చాడు. ఈ దాడి ఉగ్రవాదుల చేసినట్లుగా కనిపించింది. అయితే గాంగ్టేకు ఏ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందో ఇంకా ఎన్ఐఏ తెలియజేయలేదు.

దాదాపుగా 25 కుకీ మిలిటెంట్ గ్రూపులు చురచంద్‌పూర్ లో ఉన్నాయి. ఇవన్నీ గతంలో కేంద్రం, రాష్ట్రం, మిలిటరీతో త్రైపాక్షిక సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్(SoO) ఒప్పందంపై సంతకం చేశాయి. అయితే ఈ ఒప్పందంపై సంతకం చేసిన కొన్ని గ్రూపులు ఇప్పుడు మణిపూర్ సంక్షోభానికి కారణమవుతున్నారు. మయన్మార్, బంగ్లాదేశ్ మిలిటెంట్ గ్రూపులు భారత్ లోని జాతుల మధ్య చీలిక తీసుకువచ్చి, హింసాత్మక సంఘటనల్లో పాల్గొనే విధంగా భారత్ లోని మిలిటెంట్ నాయకులతో కుట్ర పన్నుతున్నారని దర్యాప్తులో తేలింది.

మణిపూర్ రాష్ట్రంలో మే 3న ప్రారంభమైన తెగల మధ్య గొడవ ఇప్పటికీ సద్దుమణగడం లేదు. మెయిటీలు తమకు ఎస్టీ హోదా కల్పించాలని కోరడాన్ని కుకీ తెగ వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో 10 శాతం భూభాగంలో 50 శాతానికి పైగా మొయిటీలు ఉంటే, మిగిలిన 90 శాతం భూభాగంలో మైనారిటీలు అయిన కుకీలు ఉన్నారు. ఈ వివాదంతోనే మెయిటీలు తమకు ఎస్టీ హోదా కల్పించాలని కోరుతుండటం వివాదస్పదం అయింది. దీనికి తోడు భారత బాహ్యశక్తులు కూడా మణిపూర్ సంక్షోభానికి కారణం అవుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bangladesh
  • Churachandpur
  • Manipur
  • Manipur Violence
  • Myanmar

తాజావార్తలు

  • Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0” ప్రారంభం.!

  • IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..

  • Realme C100x: రియల్‌మీ C100x భారత్‌లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్‌ప్రైజ్!

  • Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్‌డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!

  • Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions