PM Modi: జాతి ఘర్షణల తర్వాత, తొలిసారి మణిపూర్కు ప్రధాని మోడీ.!
- జాతి ఘర్షణల తర్వాత, తొలిసారి మణిపూర్కు ప్రధాని మోడీ..
- ఇంఫాల్ వ్యాప్తంగా సుందరీకరణ పనులు, విస్తృత భద్రతా ఏర్పాట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: 2023లో మణిపూర్లో కుకీలు, మైయితీలకు మధ్య జాతి ఘర్షణలు ప్రారంభయ్యాయి. అప్పటి నుంచి ఆ రాష్ట్రం రావణకాష్టంలా రగులుతూనే ఉంది. ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటోంది. ఘర్షణలు ప్రారంభమైన రెండేళ్ల తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్ పర్యటనకు వెళ్లుతున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ సెప్టెంబర్ 13న ఇంఫాల్కు చేరుకుని, చారిత్రాత్మక కాంగ్లా కోట లోపల జరిగే సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత చురచంద్పూర్కు వెళ్లనున్నారు.
Read Also: BCCI: ఒడియమ్మా! రూ.20 వేల కోట్లతో ప్రపంచంలోనే అగ్రగామి బోర్డుగా బీసీసీఐ
Also Read
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో, ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయం లోపల సుందరీకరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. డివైడర్లకు పెయింట్ వేస్తున్నారు. రోడ్డు పక్కల ఉన్న పొదల్ని కత్తిరిస్తున్నారు. భద్రత పెంచడం వల్ల ప్రయాణికులు ముందుగానే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని అధికారులు ప్రయాణ సలహా కూడా జారీ చేశారు. ఇంఫాల్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కాంగ్లా కోటకు చేరుకుని, 15000 మంది ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనునన్నారు.
ఇప్పటికే వేదిక వద్ద ఉన్న హెలిప్యాడ్ను పునరుద్ధరించే పనిలో అధికారులు వేగంగా పనిచేస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. 24 గంటలు నిఘా పెడుతున్నారు. అనధికారికంగా ఫోటోలు తీయడం నిషేధించబడింది. ఈ కార్యక్రమం తర్వాత, చూరచంద్పూర్లోని పీస్ గ్రౌండ్లో జరిగే సమావేశంలో ప్రధాని ప్రసంగించనున్నారు. మైదానంలో 9000 మంది హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధాని మణిపూర్ పర్యటన నుంచి అక్కడి ప్రజలు చాలా ప్రకటనలు ఆశిస్తున్నారు. చురాచంద్పూర్లోని ప్రజలు ప్రధానికి వ్యక్తిగతంలో మెమోరాండం ఇవ్వాలని యోచిస్తున్నారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!