Manipur: మణిపూర్లో కిడ్నాప్కి గురైన నలుగురిని హత్య చేసిన మిలిటెంట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur:మణిపూర్లో ఇటీవల కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన నలుగురిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. తాజాగా వీరందరిని హత్య చేసినట్లు తెలిసింది. చనిపోయిన వారిలో తండ్రీ, అతని కొడుకు కూడా ఉన్నారు. చురచంద్ పూర్, బిష్ణుపూర్ జిల్లాల మధ్య కొండల్లో మిలిటెంట్లు నలుగురు గ్రామస్తులను కిడ్నా్ప్ చేశారు. శీతాకాలం కావడంతో మంట కోసం కట్టెలు తీసుకువచ్చేందుకు సమీప అడవుల్లోకి వెళ్లిన సమయంలో వారిని అపహరించారు. వీరందర్ని మిలిటెంట్లు చంపినట్లుగా ఈ రోజు పోలీసులు వెల్లడించారు.
Read Also: Venkatesh: మహేష్, నాని లతో మల్టీస్టారర్.. చేద్దాం.. అన్నీ చేసేద్దాం
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
రాష్ట్ర రాజధాని ఇంఫాల్కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిష్ణుపూర్లోని అకాసోయ్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు శీతాకాలంలో కట్టెలు సేకరించడానికి సమీపంలోని అడవికి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. చంపడానికి ముందు వీరిని మిలిటెంట్లు హింసించినట్లు తెలుస్తోంది. బిష్ణుపూర్లోని కుంబిలోని పోలీసులు అడవిలో ప్రయాణించి మృతదేహాలను ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. చురచంద్పూర్ జిల్లాలో కుకీల ప్రాబల్యం ఉండగా.. బిష్ణుపూర్ జిల్లా మైయిటీల ఆధిపత్యంలో ఉంది. ఈ రెండు జిల్లాలను విభజించే ‘బఫర్ జోన్’లోకి నలుగురు వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.
మే 2023 నుంచి మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మైయిటీలు, కుకీల మధ్య హింస చెలరేగింది. దాదాపుగా గత 8 నెలలుగా అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనడం లేదు. ఎస్టీ హోదా కోసం మైయిటీలు డిమాండ్ చేయడాన్ని కుకీలు తప్పుబడుతున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. 100కు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
NBK 111 : బాలయ్య సినిమా డిసెంబర్ లేదా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్
-
WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
-
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ కు ‘నో’ చెప్పిన కీర్తి సురేశ్.. ‘బుజ్జి’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
-
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
-
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!