Manipur: మణిపూర్లో కిడ్నాప్కి గురైన నలుగురిని హత్య చేసిన మిలిటెంట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur:మణిపూర్లో ఇటీవల కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన నలుగురిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. తాజాగా వీరందరిని హత్య చేసినట్లు తెలిసింది. చనిపోయిన వారిలో తండ్రీ, అతని కొడుకు కూడా ఉన్నారు. చురచంద్ పూర్, బిష్ణుపూర్ జిల్లాల మధ్య కొండల్లో మిలిటెంట్లు నలుగురు గ్రామస్తులను కిడ్నా్ప్ చేశారు. శీతాకాలం కావడంతో మంట కోసం కట్టెలు తీసుకువచ్చేందుకు సమీప అడవుల్లోకి వెళ్లిన సమయంలో వారిని అపహరించారు. వీరందర్ని మిలిటెంట్లు చంపినట్లుగా ఈ రోజు పోలీసులు వెల్లడించారు.
Read Also: Venkatesh: మహేష్, నాని లతో మల్టీస్టారర్.. చేద్దాం.. అన్నీ చేసేద్దాం
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
రాష్ట్ర రాజధాని ఇంఫాల్కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిష్ణుపూర్లోని అకాసోయ్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు శీతాకాలంలో కట్టెలు సేకరించడానికి సమీపంలోని అడవికి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. చంపడానికి ముందు వీరిని మిలిటెంట్లు హింసించినట్లు తెలుస్తోంది. బిష్ణుపూర్లోని కుంబిలోని పోలీసులు అడవిలో ప్రయాణించి మృతదేహాలను ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. చురచంద్పూర్ జిల్లాలో కుకీల ప్రాబల్యం ఉండగా.. బిష్ణుపూర్ జిల్లా మైయిటీల ఆధిపత్యంలో ఉంది. ఈ రెండు జిల్లాలను విభజించే ‘బఫర్ జోన్’లోకి నలుగురు వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.
మే 2023 నుంచి మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మైయిటీలు, కుకీల మధ్య హింస చెలరేగింది. దాదాపుగా గత 8 నెలలుగా అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనడం లేదు. ఎస్టీ హోదా కోసం మైయిటీలు డిమాండ్ చేయడాన్ని కుకీలు తప్పుబడుతున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. 100కు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?