Manipur: మణిపూర్లో కిడ్నాప్కి గురైన నలుగురిని హత్య చేసిన మిలిటెంట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur:మణిపూర్లో ఇటీవల కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన నలుగురిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. తాజాగా వీరందరిని హత్య చేసినట్లు తెలిసింది. చనిపోయిన వారిలో తండ్రీ, అతని కొడుకు కూడా ఉన్నారు. చురచంద్ పూర్, బిష్ణుపూర్ జిల్లాల మధ్య కొండల్లో మిలిటెంట్లు నలుగురు గ్రామస్తులను కిడ్నా్ప్ చేశారు. శీతాకాలం కావడంతో మంట కోసం కట్టెలు తీసుకువచ్చేందుకు సమీప అడవుల్లోకి వెళ్లిన సమయంలో వారిని అపహరించారు. వీరందర్ని మిలిటెంట్లు చంపినట్లుగా ఈ రోజు పోలీసులు వెల్లడించారు.
Read Also: Venkatesh: మహేష్, నాని లతో మల్టీస్టారర్.. చేద్దాం.. అన్నీ చేసేద్దాం
Also Read
- PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
- India vs UK Healthcare: ‘భారత్లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
రాష్ట్ర రాజధాని ఇంఫాల్కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిష్ణుపూర్లోని అకాసోయ్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు శీతాకాలంలో కట్టెలు సేకరించడానికి సమీపంలోని అడవికి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. చంపడానికి ముందు వీరిని మిలిటెంట్లు హింసించినట్లు తెలుస్తోంది. బిష్ణుపూర్లోని కుంబిలోని పోలీసులు అడవిలో ప్రయాణించి మృతదేహాలను ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. చురచంద్పూర్ జిల్లాలో కుకీల ప్రాబల్యం ఉండగా.. బిష్ణుపూర్ జిల్లా మైయిటీల ఆధిపత్యంలో ఉంది. ఈ రెండు జిల్లాలను విభజించే ‘బఫర్ జోన్’లోకి నలుగురు వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.
మే 2023 నుంచి మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మైయిటీలు, కుకీల మధ్య హింస చెలరేగింది. దాదాపుగా గత 8 నెలలుగా అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనడం లేదు. ఎస్టీ హోదా కోసం మైయిటీలు డిమాండ్ చేయడాన్ని కుకీలు తప్పుబడుతున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. 100కు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
-
Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
-
PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
-
India vs UK Healthcare: ‘భారత్లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
-
Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!