Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా దక్షిణ అబుజ్మద్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో 7 మంది నక్సలైట్లు హతమయ్యారు. భద్రతా బలగాలు ఈ ఎన్కౌంటర్ లో నక్సలైట్లకు సంబంధించిన రెడ్ మిలిటెంట్ల సెంట్రల్ కమిటీలో భాగమైన టాప్ నక్సలైట్ లిడార్ స్థాయిలో ఉన్న మృతదేహంతో సహా వారందరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్ పై భద్రతా బలగాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్కౌంటర్ ఉదయం 3 గంటల నుంచి ప్రారంభమైందని, నక్సలైట్లతో…
ఛత్తీస్గఢ్.. ఎన్కౌంటర్ పోరాటంలో 14 మంది మావోలు మృతి చెందారని.. కాల్పుల్లో గాయపడ్డ మిగతా 17 మందిని భద్రతా బలగాలు పట్టుకుని కాల్చి చంపాయని మావోయిస్ట్ పార్టీ ఆరోపించింది.
ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మొత్తం 31 మంది చనిపోయారు. అపోస్మత్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో చాలా కీలకమైన నేతలు కూడా మృతి చెందారు. ఇప్పటివరకు మృతి చెందిన వారిలో, కామలేశ్, రామకృష్ణ,నీతి నందు ఉన్నట్లుగా గుర్తించారు.
Big Breaking: ఛత్తీస్గఢ్ మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. రాష్ట్రంలోని నారాయణపూర్-దంతెవాడ సరిహద్దుల్లోని మాడ్ ఏరియాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దాదాపుగా 36 మంది మావోయిస్టులు హతమయ్యారు.
Chhattisgarh encounter: ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి తుపాకీ శబ్ధాలతో దద్దరిల్లాయి. యాంటీ నక్సల్ ఆపరేషన్ సందర్భంగా శుక్రవారం మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. నారాయణపూర్-దంతేవాడ సరిహద్దు ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఎన్కైంటర్ ప్రారంభమైంది. ఇరు వర్గాల మధ్య భీకరంగా కాల్పులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు దంతెవాడ ఎస్పీ తెలిపారు.
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి కాల్పులతో దద్దరిల్లాయి. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా, నారాయణపూర్ జిల్లా సరిహద్ద ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు నక్సలైట్లు మరణించారు.
Amit Shah: నరేంద్ర మోడీ ప్రభుత్వం త్వరలోనే మావోయిస్టులను దేశం నుంచి నిర్మూలిస్తుందని కేంద్రం హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 29 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఛత్తీస్ఘడ్ రాష్ట్రం కంకేర్లో పోలీసులు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్కౌంటర్ జరుగుతుంది. కంకేర్లోని ఛోటేబైథియా పోలీస్ స్టేషన్లోని కల్పర్ అడవుల్లో ఎన్కౌంటర్ జరుగుతుంది. ఈ ఎన్కౌంటర్లో 18 మంది నక్సలైట్లు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే47తో పాటు ఇన్సాస్ రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో శనివారం భద్రతా సిబ్బంది, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఆ స్థలంలో మృతదేహాలు ఏవీ కనుగొనబడనప్పటికీ దాదాపు నాలుగు నుంచి ఆరుగురు నక్సలైట్లు మరణించారని సమాచారం.
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో సోమవారం ఉదయం పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మహిళతో సహా ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు అధికారి ఒకరు తెలిపారు. ఎన్కౌంటర్ స్థలం నుంచి పేలుడు పదార్ధాలను, ఆటోమేటిక్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరు మావోయిస్టులు తమ తలపై రూ.11 లక్షల నజరానాను కలిగి ఉన్నారని ఆయన చెప్పారు.