Encounter: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Encounter: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో సోమవారం ఉదయం పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మహిళతో సహా ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు అధికారి ఒకరు తెలిపారు. ఎన్కౌంటర్ స్థలం నుంచి పేలుడు పదార్ధాలను, ఆటోమేటిక్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరు మావోయిస్టులు తమ తలపై రూ.11 లక్షల నజరానాను కలిగి ఉన్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర రాజధాని రాయ్పూర్కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్పురం గ్రామ సమీపంలోని అడవిలో ఉదయం 5.30 గంటలకు జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో ఉండగా, సుక్మాలో కాల్పులు జరిగాయని ఎస్పీ సునీల్ శర్మ తెలిపారు.
Read Also: Aircraft Crash: కుప్పకూలిన మిగ్-21 విమానం.. ఇద్దరు మృతి
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
గొలపల్లి లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్ (ఎల్ఓఎస్) మావోయిస్టు కమాండర్ మడ్కం ఎర్రతో పాటు 30-35 మంది టీమ్ సభ్యులు ఉన్నట్లు పోలీసులకు నిర్దిష్ట సమాచారం అందింది. దీంతో డీఆర్జీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), దాని ఎలైట్ యూనిట్ కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) ప్రత్యేక బృందాలు ఆదివారం రాత్రి ఆపరేషన్ను ప్రారంభించాయని ఆయన చెప్పారు. డీఆర్జీ పెట్రోలింగ్ టీమ్లలో ఒకటి దంతేష్పురం అడవులను చుట్టుముట్టినప్పుడు, సాయుధ మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఇది కాల్పులకు దారితీసిందని ఎస్పీ తెలిపారు. కాల్పుల అనంతరం ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను సంఘటన స్థలం నుండి స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. వారిని ఎల్ఓఎస్ కమాండర్ ఎర్రా, అదే స్క్వాడ్ డిప్యూటీ కమాండర్ పొడియం భీమే అనే మహిళా కేడర్గా గుర్తించామని ఎస్పీ సునీల్ శర్మ తెలిపారు. ఎర్రా, భీమే వారి తలపై వరుసగా రూ. 8 లక్షలు, రూ. 3 లక్షల రివార్డులను కలిగి ఉన్నారని అధికారి తెలిపారు. “మావోయిస్ట్ల ఏరియా కమిటీ సభ్యుడు కూడా అయిన ఎర్రా, రెండు డజన్లకు పైగా మావోయిస్టుల హింసాత్మక సంఘటనలలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి” అని ఆయన చెప్పారు. పరిసర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!