Encounter: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఆరుగురు నక్సల్స్ హతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో శనివారం భద్రతా సిబ్బంది, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఆ స్థలంలో మృతదేహాలు ఏవీ కనుగొనబడనప్పటికీ దాదాపు నాలుగు నుంచి ఆరుగురు నక్సలైట్లు మరణించారని సమాచారం. నక్సలైట్లు గాయపడిన లేదా మరణించిన వారిని వెంటనే అడవుల్లోకి లాగగలిగారని అధికారులు వెల్లడించారు. ఈ ఉదయం చింతగుఫా, కిస్టారం పోలీస్ స్టేషన్ సరిహద్దుల్లోని మావోయిస్టుల కోటలో ఉన్న ఛోటేకెడ్వాల్ గ్రామ అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్లో ఉన్నప్పుడు ఎన్కౌంటర్ జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. రాష్ట్ర పోలీసు జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క ఎలైట్ కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (CoBRA) కు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారని ఆయన చెప్పారు.
Also Read: ALERT: కరోనా ఇంకాపోలేదు.. ఇండోనేషియాలో బయటపడిన వేరియంట్..!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
డివిజన్ కమిటీ సభ్యుడు, మావోయిస్టుల కిస్టారం ఏరియా కమిటీ ఇన్ఛార్జ్ రాజు, కీలక మావోయిస్టులు ఛోటేకెడ్వాల్, బడేకెడ్వాల్, సింఘన్మడ్గు గ్రామాలలో 30-35 మంది కార్యకర్తలతో కలిసి ఉన్నారనే సమాచారం ఆధారంగా ఆపరేషన్ ప్రారంభించబడిందని ఆ పోలీసు అధికారి వెల్లడించారు. నక్సలైట్లు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఓ గంట పాటు జరిగిన కాల్పుల్లో దాదాపు ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా జరుగుతోందని అధికారి తెలిపారు.
నక్సలైట్లు తమ సహోద్యోగుల మరణాలకు గుర్తుగా జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు ‘అమరవీరుల వారోత్సవాలు’ పాటిస్తారు. అమరవీరుల వారోత్సవం నేపథ్యంలో అనేక నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాలు, ముఖ్యంగా బస్తర్ డివిజన్లోని ఏడు జిల్లాలు, అంటే దంతెవాడ, బీజాపూర్, బస్తర్, నారాయణపూర్, కొండగావ్, సుక్మా, కంకేర్లలో పోలీసులు భద్రతను పెంచుతారు. ఎందుకంటే ప్రజా ఆస్తులను దెబ్బతీసేందుకు నక్సల్స్ అనేక విధ్వంసక చర్యలను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!