Encounter: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఆరుగురు నక్సల్స్ హతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో శనివారం భద్రతా సిబ్బంది, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఆ స్థలంలో మృతదేహాలు ఏవీ కనుగొనబడనప్పటికీ దాదాపు నాలుగు నుంచి ఆరుగురు నక్సలైట్లు మరణించారని సమాచారం. నక్సలైట్లు గాయపడిన లేదా మరణించిన వారిని వెంటనే అడవుల్లోకి లాగగలిగారని అధికారులు వెల్లడించారు. ఈ ఉదయం చింతగుఫా, కిస్టారం పోలీస్ స్టేషన్ సరిహద్దుల్లోని మావోయిస్టుల కోటలో ఉన్న ఛోటేకెడ్వాల్ గ్రామ అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్లో ఉన్నప్పుడు ఎన్కౌంటర్ జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. రాష్ట్ర పోలీసు జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క ఎలైట్ కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (CoBRA) కు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారని ఆయన చెప్పారు.
Also Read: ALERT: కరోనా ఇంకాపోలేదు.. ఇండోనేషియాలో బయటపడిన వేరియంట్..!
Also Read
డివిజన్ కమిటీ సభ్యుడు, మావోయిస్టుల కిస్టారం ఏరియా కమిటీ ఇన్ఛార్జ్ రాజు, కీలక మావోయిస్టులు ఛోటేకెడ్వాల్, బడేకెడ్వాల్, సింఘన్మడ్గు గ్రామాలలో 30-35 మంది కార్యకర్తలతో కలిసి ఉన్నారనే సమాచారం ఆధారంగా ఆపరేషన్ ప్రారంభించబడిందని ఆ పోలీసు అధికారి వెల్లడించారు. నక్సలైట్లు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఓ గంట పాటు జరిగిన కాల్పుల్లో దాదాపు ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా జరుగుతోందని అధికారి తెలిపారు.
నక్సలైట్లు తమ సహోద్యోగుల మరణాలకు గుర్తుగా జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు ‘అమరవీరుల వారోత్సవాలు’ పాటిస్తారు. అమరవీరుల వారోత్సవం నేపథ్యంలో అనేక నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాలు, ముఖ్యంగా బస్తర్ డివిజన్లోని ఏడు జిల్లాలు, అంటే దంతెవాడ, బీజాపూర్, బస్తర్, నారాయణపూర్, కొండగావ్, సుక్మా, కంకేర్లలో పోలీసులు భద్రతను పెంచుతారు. ఎందుకంటే ప్రజా ఆస్తులను దెబ్బతీసేందుకు నక్సల్స్ అనేక విధ్వంసక చర్యలను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
-
OTR: రాఖీతో పొలిటికల్ బంధం బలపడుతుందా..
-
TGIIC : రాయదుర్గం భూములకు జాక్పాట్.. రూ.2,833 కోట్ల రాబడి
-
Ram Mohan Naidu: ‘పీ4’ విధానంలో శ్రీకాకుళం జిల్లాకు ‘ఎ’ గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!