మిచౌంగ్ తుపాన్ తో చెన్నై అతలాకుతలం అవుతుంది. భారీ వర్షాల ధాటికి నగరంలో వరదలు ముంచెత్తాయి. అంతేకాకుండా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో జనాలు ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో చెన్నై వాసులకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చేయూత అందిస్తున్నారు. తాజాగా.. క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా చెన్నై వాసులకు మద్దతుగా నిలబడ్డాడు.
మంగళవారం తమిళనాడులోని చెన్నైలో మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పడవలు, ట్రాక్టర్లను ఉపయోగించారు. మంగళవారం ఉదయం నుండి చెన్నైలోని చాలా ప్రాంతాల్లో వర్షం ప్రభావం తక్కువగానే ఉంది. దీంతో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను అధికారులు వేగవంతం చేశారు. ఇదిలా ఉంటే.. చెన్నై, ఇతర ప్రాంతాలలో వరదల ధాటికి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడగా.. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని…
Cyclone Michaung: మిచాంగ్ తుఫాను సోమవారం (డిసెంబర్ 4) తీవ్ర తుఫానుగా మారింది. ఇది నెల్లూరుకు ఆగ్నేయంగా 80 కి.మీ, చెన్నైకి ఉత్తర-ఈశాన్య దిశలో 120 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
డిసెంబర్ 2న బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను.. డిసెంబర్ 5 అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాన్ని తాకనుంది. దీంతో.. ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిలలో తుపాను ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అంతేకాకుండా.. గాలులు గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. ఇప్పటికే.. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా వరదల పరిస్థితి నెలకొనగా.. ఇప్పటి వరకు ముగ్గురు మృతి…
తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. చెన్నైలో వర్షాలు కురుస్తున్నాయని తెలుస్తుంది.. గత కొన్ని రోజుల క్రితం కురుసిన వర్షాలకు రాష్ట్ర ప్రజలు ఇంకా తేరుకోలేదు.. ఇప్పుడు మళ్ళీ వర్షాల గురించి చెప్పడంతో జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. చెన్నైతో పాటు పొరుగు జిల్లాల్లో రాత్రిపూట వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.. గురువారం నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో తమిళనాడు లోని చెన్నై లో గురువారం నుంచి మూడు…
20 years Sentence to Subhiksha Subramaniyan: ప్రముఖ వ్యాపారవేత్త, ఐఐటీ ఇంజనీర్ గోల్డ్ మెడలిస్ట్ ఆర్ సుబ్రమణియన్కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పథకాల పేరుతో వందలాంది మంది పెట్టుబడి దారులను మోసగించి వారి పెట్టుబడులను దారి మళ్లీంచిన కేసులో నేరారోపణలు రుజువైనందున్న చెన్నై స్పెషల్ కోర్టు నవంబర్ 20న అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అదే విధంగా సుబ్రమణియన్తో పాటు అతడి సహాచరులకు కోర్టు రూ. 190…
Chennai Fire: తమిళనాడు రాజధాని చెన్నైలోని మైలాపూర్ సాయిబాబా ఆలయ పైకప్పుపై దీపావళి సాయంత్రం మంటలు చెలరేగాయి. మూడు అగ్నిమాపక కేంద్రాలకు చెందిన 20కి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నారు.
Chennai: స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు చెన్నై సమీపం లోని ఓ ఫాంహౌస్ను అద్దెకు తీసుకున్నారు. అనంతరం అందరూ ఫాంహౌస్ కు వెళ్లి పార్టీని బాగా ఎంజాయ్ చేశారు. అయితే పార్టీలో పాల్గొన్న 8 మంది మహిళలను, 15 మంది పురుషులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన చెన్నై సమీపం ఈసీఆర్ రోడ్డులో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. కొందరు వ్యక్తులు చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డుపై పనైయూర్ వద్ద ఉన్న ఓ ఫాంహౌస్ను పార్టీ…