Chennai Rains: చెన్నైలో భారీ వర్షాలు.. వరదల కారణంగా ముగ్గురు మృతి
డిసెంబర్ 2న బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను.. డిసెంబర్ 5 అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాన్ని తాకనుంది. దీంతో.. ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిలలో తుపాను ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అంతేకాకుండా.. గాలులు గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. ఇప్పటికే.. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా వరదల పరిస్థితి నెలకొనగా.. ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం తెలుస్తోంది.
ప్రస్తుతం.. మిచౌంగ్ తుపాను నైరుతి బంగాళాఖాతంలో ఉందని ఐఎండీ తెలిపింది. ఇది వాయువ్య దిశగా కదులుతోందని.. మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంకి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉంటే.. తుపాన్ ప్రభావంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో నీరు నిలిచిపోవడంతో సర్వీసులు నిలిచిపోయాయి. మంగళవారం ఉదయం 9 గంటల వరకు రన్వేను మూసివేశారు. బయటి నుంచి వచ్చే విమానాలను బెంగళూరుకు మళ్లిస్తున్నారు. అటు.. రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫారమ్లపై నుంచి నీరు చేరింది. ఇప్పటి వరకు 204 రైళ్లు, 70 విమానాలు రద్దు అయ్యాయి. అంతేకాకుండా.. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. నివాస ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో పదుల సంఖ్యలో కార్లు తేలుతూ కనిపించాయి. దీంతో.. రాష్ట్రంలో SDRF, NDRF బృందాలు మోహరించాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా రోడ్లపై 3 నుంచి 4 అడుగుల మేర నీరు నిలిచింది.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
YS Raja Reddy: షర్మిలక్కకు కాబోయే కోడలు.. హీరోయిన్ లెక్క ఉందే..?
ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8:30 గంటల వరకు చెన్నైలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో 20 నుంచి 22 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాతావరణ శాఖ (IMD) ప్రకారం, 70-80 సంవత్సరాలలో చెన్నై నగరంలో ఇలాంటి వర్షం కురువడం ఇదే మొదటిసారి తెలిపింది. తమిళనాడులో నిత్యావసర సేవలు మినహా సోమ, మంగళవారాల్లో సెలవు ప్రకటించారు. మరోవైపు.. NDRF 9 బృందాలు, SDRF 14 బృందాలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. చెన్నై, ఇతర జిల్లాలలో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి అధికారులు కోస్తా జిల్లాల్లో దాదాపు 5,000 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం రాత్రి భద్రతా చర్యలను సమీక్షించారు. పరిస్థితిని సీఎం దగ్గరుండి చూసుకుంటున్నారు. మిచౌంగ్ తుపాను ప్రభావంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సీఎం ఎంకే స్టాలిన్తో మాట్లాడారు. తుపాను వల్ల జరిగిన నష్టాన్ని ఆదుకుంటామని సీఎం స్టాలిన్కు హోంమంత్రి హామీ ఇచ్చారు.
మిచౌంగ్ తుపాను మంగళవారం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు-మచిలీపట్నం తీరాల మధ్య తీరాన్ని తాకనుంది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 90-100 కి.మీ నుండి గంటకు 110 కి.మీ వరకు ఉంటుంది. రెస్క్యూ ఆపరేషన్ కోసం 12 ఎన్డిఆర్ఎఫ్ బృందాలను ఇక్కడ మోహరించారు. ముందుజాగ్రత్త చర్యగా డిసెంబర్ 5వ తేదీన పాఠశాలలు, కళాశాలలు ప్రకటించారు. అంతేకాకుండా.. తుపాను కారణంగా ఒడిశాలోని 5 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఒడిశాలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. డిసెంబర్ 6 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మల్కన్గిరి, కోరాపుట్, రాయగడ, గజపతి, గంజాం జిల్లాల్లో డిసెంబర్ 4, 5 తేదీల్లో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అటు.. తుపాను దృష్ట్యా పుదుచ్చేరి ప్రభుత్వం కూడా అలర్ట్ ప్రకటించింది. పుదుచ్చేరిలోని సముద్ర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. డిసెంబర్ 3వ తేదీ రాత్రి 7 గంటల నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తీర ప్రాంతాలకు వెళ్లవద్దని IMD ప్రజలను ఆదేశించింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!