Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Heavy Rains In Chennai Three Dead Due To Floods

Chennai Rains: చెన్నైలో భారీ వర్షాలు.. వరదల కారణంగా ముగ్గురు మృతి

Published Date :December 4, 2023 , 8:47 pm
By Rajesh Veeramalla
Chennai Rains: చెన్నైలో భారీ వర్షాలు.. వరదల కారణంగా ముగ్గురు మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

డిసెంబర్ 2న బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను.. డిసెంబర్ 5 అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాన్ని తాకనుంది. దీంతో.. ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిలలో తుపాను ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అంతేకాకుండా.. గాలులు గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. ఇప్పటికే.. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా వరదల పరిస్థితి నెలకొనగా.. ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం తెలుస్తోంది.

ప్రస్తుతం.. మిచౌంగ్ తుపాను నైరుతి బంగాళాఖాతంలో ఉందని ఐఎండీ తెలిపింది. ఇది వాయువ్య దిశగా కదులుతోందని.. మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంకి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉంటే.. తుపాన్ ప్రభావంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో నీరు నిలిచిపోవడంతో సర్వీసులు నిలిచిపోయాయి. మంగళవారం ఉదయం 9 గంటల వరకు రన్‌వేను మూసివేశారు. బయటి నుంచి వచ్చే విమానాలను బెంగళూరుకు మళ్లిస్తున్నారు. అటు.. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌లపై నుంచి నీరు చేరింది. ఇప్పటి వరకు 204 రైళ్లు, 70 విమానాలు రద్దు అయ్యాయి. అంతేకాకుండా.. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. నివాస ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో పదుల సంఖ్యలో కార్లు తేలుతూ కనిపించాయి. దీంతో.. రాష్ట్రంలో SDRF, NDRF బృందాలు మోహరించాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా రోడ్లపై 3 నుంచి 4 అడుగుల మేర నీరు నిలిచింది.

YS Raja Reddy: షర్మిలక్కకు కాబోయే కోడలు.. హీరోయిన్ లెక్క ఉందే..?

ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8:30 గంటల వరకు చెన్నైలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో 20 నుంచి 22 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాతావరణ శాఖ (IMD) ప్రకారం, 70-80 సంవత్సరాలలో చెన్నై నగరంలో ఇలాంటి వర్షం కురువడం ఇదే మొదటిసారి తెలిపింది. తమిళనాడులో నిత్యావసర సేవలు మినహా సోమ, మంగళవారాల్లో సెలవు ప్రకటించారు. మరోవైపు.. NDRF 9 బృందాలు, SDRF 14 బృందాలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. చెన్నై, ఇతర జిల్లాలలో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి అధికారులు కోస్తా జిల్లాల్లో దాదాపు 5,000 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం రాత్రి భద్రతా చర్యలను సమీక్షించారు. పరిస్థితిని సీఎం దగ్గరుండి చూసుకుంటున్నారు. మిచౌంగ్ తుపాను ప్రభావంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సీఎం ఎంకే స్టాలిన్‌తో మాట్లాడారు. తుపాను వల్ల జరిగిన నష్టాన్ని ఆదుకుంటామని సీఎం స్టాలిన్‌కు హోంమంత్రి హామీ ఇచ్చారు.

మిచౌంగ్ తుపాను మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు-మచిలీపట్నం తీరాల మధ్య తీరాన్ని తాకనుంది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 90-100 కి.మీ నుండి గంటకు 110 కి.మీ వరకు ఉంటుంది. రెస్క్యూ ఆపరేషన్ కోసం 12 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను ఇక్కడ మోహరించారు. ముందుజాగ్రత్త చర్యగా డిసెంబర్ 5వ తేదీన పాఠశాలలు, కళాశాలలు ప్రకటించారు. అంతేకాకుండా.. తుపాను కారణంగా ఒడిశాలోని 5 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఒడిశాలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. డిసెంబర్ 6 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మల్కన్‌గిరి, కోరాపుట్, రాయగడ, గజపతి, గంజాం జిల్లాల్లో డిసెంబర్ 4, 5 తేదీల్లో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అటు.. తుపాను దృష్ట్యా పుదుచ్చేరి ప్రభుత్వం కూడా అలర్ట్ ప్రకటించింది. పుదుచ్చేరిలోని సముద్ర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. డిసెంబర్ 3వ తేదీ రాత్రి 7 గంటల నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తీర ప్రాంతాలకు వెళ్లవద్దని IMD ప్రజలను ఆదేశించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chennai
  • Floods
  • Heavy rains
  • IMD
  • telugu news

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions