నేను ఏమైనా అడిగితే నన్ను సవాల్ చేస్తావా అంటాడు కానీ.. తాను చేసిన మంచిని మాత్రం చెప్పడం లేదన్నారు. ఆయన ఏం చేయలేదు కాబట్టి ఏమీ చెప్పలేడు.. మనం సిద్ధం అంటుంటే చంద్రబాబు భార్య మా ఆయన సిద్దంగా లేడు అంటుంది అని జగన్ అన్నారు.
రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణ వార్త విని షాక్ కు గురి చేసింది అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదిలోపే ఆమె మృతి చెందడం దురదృష్టకరం అని పేర్కొన్నారు.
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గొనెగండ్ల మండలంలోని బి.అగ్రహారంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా టీడీపీ నేత మాచాని సోమనాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే తెలుగు దేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడితోనే సాధ్యమని తెలిపారు.