Nimmakayala Chinarajappa: అదుపుతప్పిన చినరాజప్ప కారు.. ర్యాలీలో అపశ్రుతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nimmakayala Chinarajappa: పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చేపట్టిన ర్యాలీ ప్రాణాల మీదకు వచ్చింది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ఎక్కింది. కారుకు ఎదురుగా ఓ వ్యక్తి రావడంతో తప్పించబోయిన డ్రైవర్.. డివైడర్ మీదకు ఎక్కించాడు. ఆ సమయంలో చినరాజప్ప కారులోనే ఉన్నారు. పార్టీ నేతలు వెంటనే అప్రమత్తమవ్వడంతో ప్రమాదం తప్పింది. టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో చినరాజప్ప పేరు రావడంతో… నియోజకవర్గంలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలోనే ఘటన జరిగింది.
Read Also: Nani 32: సుజిత్ తో నాని నెక్స్ట్ సినిమా.. రిలీజ్ అప్పుడేనట
Also Read
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
అయితే, మొత్తం 99 సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ-జనసేన. కానీ.. తొమ్మిది నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు రాజుకున్నాయి.. ఎనిమిది సెగ్మెంట్లల్లో టీడీపీ.. ఒక నియోజకవర్గంలో జనసేనలో అసంతృప్తుల ఆందోళనకు దిగారు.. గజపతినగరం, కళ్యాణదుర్గం, పెనుకొండ, అనకాపల్లి, పి.గన్నవరం, రాయచోటి, తెనాలి సెగ్మెంట్లల్లో టీడీపీ నేతల ఆందోళన చేస్తుండగా.. పెడనలో బూరగడ్డ వేదవ్యాస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ఇక, గజపతినగరంలో కేఏ నాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తల ఆందోళనకు చేస్తుండగా.. కళ్యాణదుర్గంలో చంద్రబాబు ఫ్లెక్సీలు తగుల బెట్టారు ఉన్నం హనుమంతరాయ చౌదరి అనుచరులు. తీవ్ర నిరాశలోకి వెళ్లారు పెడన సీటును ఆశించిన బూరగడ్డ వేదవ్యాస్. పెనుకొండ భగ్గుమంది.. పెనుకొండ టికెట్ ఆశించిన బీకే పార్ధసారథిని హిందూపురం ఎంపీగా పంపే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు.. అనకాపల్లిలో పీలా గోవింద్ వర్గీయులు ఆందోళన చేశారు.. సాయంత్రానికి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న పీలా గోవింద్ ప్రకటించారు. పి.గన్నవరం తమ పదవులకు.. పార్టీకి రాజీనామా చేశారు తోలేటి సత్తిబాబు.. రాయచోటిలో రమేష్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.. ఆలపాటి రాజా అలకమాన్పు ఎక్కారు.. రేపు కార్యకర్తల సమావేశం పెట్టేందుకు ఆలపాటి రాజా సిద్ధం అయ్యారు.. ఇక, జగ్గంపేటలో జనసేన నేతలు ఆందోళనకు దిగారు. మరోవైపు.. గుంభనంగా ఉన్నారు కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, జలీల్ ఖాన్, బుద్దా వెంకన్న.. గంటా శ్రీనివాసరావు, మండలి బుద్దాప్రసాద్, యరపతినేని, చింతమనేని, బండారు సత్యనారాయణ మూర్తి.. దీంతో.. ఆయా నియోజకవర్గాల్లో కూడా వారి అభిమానులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
-
Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
-
Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..