ఎంత బలం ఉన్నా.. ఎంతటి బలగం ఉన్నా.. ఉపాయాలు, వ్యూహాలు ఎన్ని ఉన్నా.. ఓ వ్యక్తి నాయకుడిగా ఎదగాలంటే.. ఎన్నో డక్కాముక్కీలు తినాల్సి ఉంటుంది. రాటుదేలాల్సి ఉంటుంది. అవసరమైతే ప్రజా పోరాటాల్లో అరెస్టూ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరిస్థితి ఇలాగే ఉన్నట్టు కనిపిస్తోంది. విషయం ఏదైనా సరే.. ఆయన జనాల్లోకి వెళ్తున్న తీరు చూసి.. పార్టీ అభిమానులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో.. పోలవరం నిర్వాసితులను…
40 ఇయర్స్ ఇండస్ట్రీ.. అపార చాణిక్యుడినంటూ చెప్పుకునే చంద్రబాబు చేసిన తప్పే మళ్లీ చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోందని రాజకీయవర్గాల్లో హాట్ హాట్ చర్చ సాగుతోంది. గతంలో ఆయన నమ్ముకున్న రెండుకళ్ల సిద్ధాంతం బెడిసి కొట్టి చివరికి రాష్ట్ర విభజనకు దారితీసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. దాని నుంచి ఆయన ఏం గుణపాఠం నేర్చుకున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన మళ్లీ మళ్లీ అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ అందరినీ కన్ఫ్యూజన్ చేస్తున్నారని అంటున్నారు.…
తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. మతాలపై నమ్మకం ఉండే వారి మనోభావాలను గౌరవించి పాలకులు నడుచుకోవాలని తెలిపారు. ఏ మతానికి సంబంధించిన పండుగులకైనా ఆంక్షలు విధించటం సరైంది కాదు. కోర్టుల ద్వారా అనుమతి తెచ్చుకుని పండుగులు నిర్వహించుకోవటం బాధాకరం. కోర్టు తీర్పును గౌరవించి నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. హైదరాబాద్ పండుగలకు కేంద్రం. గణేష్ చతుర్థి హైదరాబాద్ లో బాగా నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా వినాయక చవితి ఎన్టీఆర్…
నాయకులు ఎవరైనా ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తారు… కానీ చంద్రబాబు, టీడీపీ మద్యపాన ఉద్యమం చేస్తాం అంటున్నారు అని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. చంద్రబాబుకు మద్యపాన నియంత్రణ ఇష్టం లేనట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్ పెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన వ్యక్తి చంద్రబాబు. మేము మద్యం షాపుల సంఖ్యను సగానికి తగ్గించాం. ఈర్ష్య, ద్వేషం, పగ…ఈ మూడు చంద్రబాబు లక్షణాలు. కాబట్టి ప్రజా కోర్టులో చంద్రబాబుకు ఉరిశిక్ష వేశారు అని పేర్కొన్నారు. తాగుబోతులు, మద్య…
పుత్సవాత్సల్యం ఎంత పనినైనా చేయిస్తుంది. ఆ ప్రేమలో ఉన్నవారు ఆఖరికి చావడానికైనా.. చంపడానికి సిద్ధమవుతుంటారు. ఇప్పుడు ఏపీ టీడీపీలోనూ అదే సీన్ కన్పిస్తుందనే టాక్ విన్పిస్తోంది. ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తన పుత్రుడు లోకేష్ ను ఎలాగైనా రాజకీయంగా యాక్టివ్ చేయాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఏర్పడింది. ఆయనకు వయోభారం మీద పడుతుండడంతో ఇప్పుడు లోకేష్ ఎదగడం చంద్రబాబు నాయుడుకు అత్యవసరం. ఈ కారణంగానే ప్రస్తుతం టీడీపీని…
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయం మొత్తం రోడ్ల చుట్టే తిరుగుతోంది. రోడ్ల సమస్యను ఎత్తిచూపే క్రమంలో టీడీపీ.. జనసేన పార్టీలు జగన్ సర్కారును టార్గెట్ చేస్తున్నాయి. దీంతో వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్ దిగుతున్నారు. ఏపీలోని అధ్వాన్న రహదారులపై నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ఈక్రమంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా రోడ్ల నిర్మాణలపై సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. రోడ్లను కేరాఫ్ చేసుకొని ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తుండటంతో…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, నవ్యాంధ్రలుగా ఏర్పడ్డాక రాజకీయంలో స్పష్టమైన మార్పు వచ్చేసింది. తెలంగాణ మిగులు బడ్జెట్ తో ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించగా.. ఏపీ మాత్రం లోటుబడ్జెట్ రాష్ట్రంగా మిగిలిపోయింది. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం చెప్పినా.. అది నీటిమీద రాతలుగా మిగిలిపోయింది. హైదరాబాద్ ను తానే నిర్మించానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో కనీసం ఏపీకి రాజధానిని కూడా నిర్మించకపోవడం శోచనీయంగా మారింది. తన పాలనలో సంక్షేమాన్ని పెద్దగా…
సామాజిక న్యాయానికి ప్రతిరూపం సీఎం వైఎస్ జగన్ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేవారు జూపూడి ప్రభాకర్… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళకు నామినేటెడ్ పదవుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారన్న ఆయన.. తన కేబిన్లో కూడా బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత కల్పించారని ప్రశంసించారు.. చంద్రబాబు హయాంలో ఎందుకు సామాజిక న్యాయం పాటించలేక పోయారు? అని ప్రశ్నించిన జూపూడి.. ఒక ఎస్టీని డీజీపీగా సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారని.. ఎస్టీ అధికారి…
టీడీపీలో భావి సీఎంగా ప్రచారం అవుతున్న లోకేష్ బాబును వచ్చే ఎన్నికలకు పక్కన పెడుతున్నారా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2024 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా నారా లోకేష్ ను ప్రకటించాలని చంద్రబాబు భావించారు. ఈక్రమంలోనే కొద్దిరోజలుగా టీడీపీలో లోకేష్ నాయకత్వాన్ని ప్రొజెక్టు చేసేలా కార్యక్రమాలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే టీడీపీ సీనియర్లు మాత్రం లోకేష్ నాయకత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీలో…
ఎక్కడి తమ్ముళ్లు అక్కడే. ప్రాంతాల వారీగా ఫైట్. సమస్యలపై ఎక్కడికక్కడే పోరాటం. ఏపీ టీడీపీలో ప్రస్తుతం ఇదే చర్చ.. ఇదే వ్యూహం. పార్టీలో కేంద్రీకృతంగా సాగే ఉద్యమాలు.. ఇప్పుడు డీసెంట్రలైజ్డ్ అయ్యాయి. ఎందుకీ ఎత్తుగడ? టీడీపీకి వర్కవుట్ అవుతుందా? టీడీపీ కొత్తగా ‘లోకల్’ వ్యూహం..! ఏపీ టీడీపీ కొత్త లైన్ తీసుకుంది. ప్రభుత్వంపై పోరాటం విషయంలో వ్యూహం మార్చింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చుని సీఎం జగన్ను తిట్టిపోస్తే లాభం లేదని గ్రహించినట్టు ఉంది. ప్రజా సమస్యలతోపాటు..…