Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story 2024 Elections Decided The Andhra Pradesh Political Formula

ఏపీ ఫార్ములా : జగన్, చంద్రబాబుల ‘గెలుపే’ నిర్ణయిస్తుంది..!

Published Date :September 6, 2021 , 4:03 pm
By Manohar
ఏపీ ఫార్ములా : జగన్, చంద్రబాబుల ‘గెలుపే’ నిర్ణయిస్తుంది..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, నవ్యాంధ్రలుగా ఏర్పడ్డాక రాజకీయంలో స్పష్టమైన మార్పు వచ్చేసింది. తెలంగాణ మిగులు బడ్జెట్ తో ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించగా.. ఏపీ మాత్రం లోటుబడ్జెట్ రాష్ట్రంగా మిగిలిపోయింది. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం చెప్పినా.. అది నీటిమీద రాతలుగా మిగిలిపోయింది. హైదరాబాద్ ను తానే నిర్మించానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో కనీసం ఏపీకి రాజధానిని కూడా నిర్మించకపోవడం శోచనీయంగా మారింది.

తన పాలనలో సంక్షేమాన్ని పెద్దగా పట్టించుకునే బాబు అభివృద్ధి చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చారనే విమర్శ వైసీపీ నుంచి ఉంది. ఏపీని సింగపూర్, జపాన్ చేస్తానన్న బాబు చివరికీ ఏపీ ప్రజలకు మొండిచేయి చూపించారంటారు. అమరావతి, పోలవరం పనుల్లో ‘బాహుబలి’ని మించి గ్రాఫిక్స్ చూపించారని.. ఎన్నికల నాటికి అమరావతి కాస్తా భ్రమరావతిగా మారడంతో ప్రజలు ఆయనకు గుణపాఠం చెప్పారని విమర్శిస్తుంటారు. అందుకే టీడీపీకి గతంలో ఎన్నడూ లేనివిధంగా కేవలం 23సీట్లకే పరిమితమైంది.

Also Read

  • Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్‌నెస్ లేని బస్సులు!
  • AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
  • TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
  • MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
Add as a preferred
source on google

గత సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలి ప్రభంజనం సృష్టించింది. బాబు వైఫ్యలానికితోడుగా జగన్ చరిష్మా ఆ ఎన్నికల్లో పని చేసింది. దీంతో ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లకు గాను వైసీపీ 151సీట్లు గెలిచి సరికొత్త రికార్డును సృష్టించింది. జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి దాదాపు రెండేన్నరేళ్లు గడుస్తోంది. ఈ రెండున్నేరళ్లలోనూ వైసీపీ సర్కారు సంక్షేమానికే పెద్దపీట వేసింది. రాబోయే రోజుల్లోనూ ఆయన సంక్షేమానికే పెద్ద ఖర్చు చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిసారించే అవకాశం ఉంది.

కరోనా లాంటి విపత్కర పరిస్థితులు సామాన్యులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఏపీలో జగన్ సంక్షేమ పథకాలు వారికి లబ్ధి చేకూరాయి. ఈక్రమంలోనే ఆయన సంక్షేమంపై పెద్దఎత్తున ఖర్చుపెడుతున్నా.. ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రావడం లేదు సరికాదా? ప్రస్తుత సమయంలో ఆయన చేస్తుంది కరెక్ట్ అనే వాదనలు విన్పిస్తున్నాయి.

లోటుబడ్జెట్లో ఉన్న ఏపీని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా గట్టెక్కిస్తారా? ప్రశ్న తలెత్తుతోంది. అందినకాడల్లా అప్పులు చేస్తూ ప్రజలకు పంచిపెడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఇకపై అభివృద్ధిపై ఫోకస్ పెట్టాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి మరో మూడేళ్ల సమయం ఉండటంతో ఆయన ఏపీలో పెద్దఎత్తున అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు ఐదేళ్లలో అమరావతిని గాలికొలేయగా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను పట్టాలెక్కించారు.

కోర్టు కేసుల కారణంగా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మూడు రాజధానులు ద్వారా ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్ బలంగా నమ్ముతున్నారు. ఈక్రమంలోనే కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వేలకోట్ల రూపాయాలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ మూడేళ్లలో జగన్ మూడు రాజధానులను పట్టాలెక్కిస్తేనే రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు. లేదంటే బాబు మాదిరిగానే ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి సైతం చూడాల్సి వస్తుందనే టాక్ విన్పిస్తోంది.

టీడీపీ హయాంలో సంక్షేమాన్ని విడిచి అభివృద్ధిపై ఫోకస్ పెట్టగా.. జగన్మోహన్ మాత్రం సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి తర్వాత అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఈక్రమంలోనే రాబోయే ఎన్నికల్లో గెలుపు చంద్రబాబు, జగన్ ఇద్దరిలో ఎవరి ఫార్మూలా పనిచేస్తుంది? ఏపీ ప్రజలు ఎవరిని డిసైడ్ చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ఏపీ ప్రజలు సంక్షేమం, అభివృద్ధిలో తొలి ప్రాధాన్యం ఎవరికి ఇస్తారన్నది వేచిచూడాల్సిందే..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2024 Elections
  • Andhra Pradesh
  • chandrababu
  • cm jagan
  • political formula

తాజావార్తలు

  • Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..

  • Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..

  • Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల

  • Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్‌నెస్ లేని బస్సులు!

  • Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions