దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి.. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.. అయితే, మరోసారి విజయంపై కన్నేసిన వైసీపీ.. బద్వేల్ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధా పేరును ఖరారు చేసింది.. మాజీ ఎమ్మెల్యే డాక్టర్…
ఇవాళ జరిగిన భారత్ బంద్పై సెటైర్లు వేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు… రైతుల కోసం జరిగిన బంద్లో రైతులు ఎవరూ పాల్గొనలేదని విమర్శించిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా బంద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలవడం ఆశ్చర్యకరమైన విషయం అంటూ మండిపడ్డారు.. ఇక, వైసీపీ, టీడీపీ.. పార్లమెంట్లో కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన బిల్లులకు ఎందుకు మద్దతు తెలిపాయి? అని ప్రశ్నించారు సోము వీర్రాజు.. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు…
గులాబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని అలాగే… ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి నష్టాన్ని నివారించాలని పేర్కొన్నారు నారా చంద్రబాబునాయుడు. రాష్ట్రంలో గులాబ్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని… తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయని తెలిపారు. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారని…. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండంతో పంటలకు తీవ్ర నష్టం…
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలో ఎవరినీ నమ్మడం లేదా? అంటే అవుననే సంకేతాలే విన్పిస్తున్నాయి. టీడీపీ గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలవడం దగ్గరి నుంచి, పార్టీలోని సీనియర్లంతా వరుసబెట్టి బయటికి వెళుతుండటం చూస్తుంటే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఇక తాజాగా ఆపార్టీకి చెందిన ఎన్నికల వ్యూహకర్తకు సైతం చంద్రబాబు గుడ్ బై చెప్పినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లోనూ చంద్రబాబు వ్యూహాలే ఆపార్టీకి శరణ్యంగా మారనున్నాయనే టాక్ ఆపార్టీలో విన్పిస్తోంది. ఇప్పటికే ఈమేరకు…
టీడీపీకి ప్రతిపక్షంలో ఉండటం.. అధికారంలోకి రావడం కొత్తేమీ కాదు. గత కొన్ని దశాబ్ధాలుగా ఆపార్టీ ఇలానే కొనసాగుతూ వస్తోంది. అయితే గతంలో ఎన్నడూలేని విధంగా ఆపార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైన టీడీపీ ఏపీలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తోంది. అయితే గత ఓటమి నుంచి టీడీపీ ఇంకా తేరుకోలేదని ఆపార్టీ నేతల వైఖరి చూస్తుంటేనే అర్థమైపోతుంది. దీనికితోడు టీడీపీ సీనియర్లంతా వరుసబెట్టి గుడ్ బై చెబుతున్నారు.…
విజయవాడ టీడీపీలో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యనని… ఎంపీ నాని అధిష్ఠానానికి చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై నాని అధికారికంగా ఎక్కడా ప్రకటన చేయలేదు. టీడీపీ అధిష్టానం కూడా దీనిపై వ్యాఖ్యానించలేదు. అయితే పార్టీలోని అంతర్గత గొడవలతోనే నాని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనే…పార్టీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మేయర్ సీటు విషయంలో కేశినేని నానితో కొందరు నేతలు విభేదించారు. ఈ సందర్భంగా నాని చేసిన…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిషత్ ఎన్నికల ఫలితాలు కీలక పరిణామాలకు తెరలేపాయి.. ఇప్పటి వరకు దూరంగా ఉన్న టీడీపీ-జనసేన కలిసి ఆచంట ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకున్నది. మొత్తం 17 ఎంపీటీసీలు ఉన్న ఆచంటలో టీడీపీ 7 స్థానాలు, వైసీపీ 6 స్థానాలు, జనసేన 4 స్థానాల్లో విజయం సాధించగా.. టీడీపీ, వైసీపీలు ఇద్దరిలో ఎవరు ఎంపీపీ కావాలన్నా.. జనసేన మద్ధతు అవసరంగా మారింది. క్యాంపు రాజకీయాలు షురూ కావడంతో టీడీపీ, జనసేన పార్టీలు తమ ఎంపీటీసీలను…
పరిషత్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.. అయితే, మేం ఎన్నికలను బహిష్కరించడం వల్లే ఈ ఫలితాలు అంటోంది తెలుగుదేశం పార్టీ.. కానీ, వైసీపీ మాత్రం టీడీపీ, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది.. కుప్పంలో చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు.. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఆయనకు రాజకీయ సమాధి కట్టారని వ్యాఖ్యానించారు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప.. పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పులు తెలుసుకోవాలని సూచించారు.. కోర్టుల ద్వారా వైఎస్…
అవకాశం దొరికినప్పుడల్లా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, ఇతర నేతలపై ఒంటికాలితో లేచే మంత్రి కొడాలి నాని.. మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు, లోకేష్ను ఉద్దేశిస్తూ.. తుప్పు, పప్పు అంటూ ఫైర్ అయ్యారు.. పరిషత్ ఎన్నికలను బహిష్కరించామని చంద్రబాబు అంటున్నారు.. మరి.. టీడీపీ నుంచి గెలిచినవాళ్లంతా.. పార్టీ ఆదేశాలను ధిక్కరించినవాళ్లా? అని ప్రశ్నించారు.. సీఎం జగన్ను ప్రజలు దీవిస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్న కొడాలి నాని.. పరిషత్ ఎన్నికల్లో…
అయ్యన్న పాత్రుడుది టెర్రరిస్ట్ మనస్తత్వం అని ఏపీ డెప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. జగన్ వైఎస్ కుమారుడే కానీ వారసుడు కాదు.పేదల హృదయాలను గెలుచుకున్న వాడు సీఎం జగన్ అని చెప్పారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందారు. అయ్యన్న మాటలతో సమాజమే సిగ్గుతో తలదించుకుంది. బీసీ నాయకుడైన అయ్యన్న ఎస్సీ మహిళైన హోం మంత్రిని కించ పరిచారు. అయ్యన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద కేసు నమోదు చేయాలి అన్న ఆయన…