వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలపై పగబట్టారు అని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. గుజరాత్ లో డ్రగ్స్ పట్టుబడితే ప్రభుత్వంపై టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వంలో ఉండే పెద్దలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే వైసీపీ చూస్తూ ఉరుకోదు. రాజకీయాలు చేయడానికి శవాలు ఎక్కడ దొరుకుతాయా…అని ఎదురు చూసే పరిస్థితికి ప్రతిపక్షం దిగజారింది. హెరిటేజ్ వాహనంలో…
టీడీపీ పార్టీ నేతలతో అధినేత చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసారు. ప్రభుత్వ విధానాలు.. చేపట్టాల్సిన ఆందోళనా కార్టక్రమాలపై చర్చ జరిపారు. రైతు, వ్యవసాయ సమస్యలపై నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటనలు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రైతు సమస్యలను ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందన్న టీడీపీ నేతలు… విశాఖలో ప్రభుత్వ ఆస్తుల తనఖాపై ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. ఆర్థికపరమైన అంశాల్లో ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతోందన్న చంద్రబాబు… ఏపీలోని డ్రగ్స్ మాఫియాపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని…
టీడీపీ అధికారానికి దూరమై దాదాపు రెండున్నేళ్లు కావస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీలో ఎంతమంది ఉన్నారనేది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. ఇదిలా ఉంటే.. ఆపార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది. ప్రతిపక్షంలో ఉంటూ ప్రజా సమస్యలపై గళం విప్పాల్సిన నేతలంతా మిన్నకుండిపోతున్నారు. దీనికితోడు సొంత పార్టీపైనే బహిరంగంగా విమర్శలు చేస్తూ అభాసు పాలవుతున్నారు. కొద్దిరోజులుగా టీడీపీలోని కొందరు సీనియర్లు అధినేతపై ధిక్కార స్వరాన్ని విన్పిస్తుండటం…
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది గతంలో ఎన్నడూ రీతిలో కేవలం 23సీట్లకే పరిమితమైంది. ఆ ఓటమి నుంచి కోలుకోవడానికి చంద్రబాబుకు చాలా సమయమే పట్టింది. ఇదే సమయంలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో చంద్రబాబు ఇంటికే పరిమితమయ్యారు. దాదాపు ఏడాదిన్నరగా చంద్రబాబు యాక్టివ్ గా పని చేసిన దాఖలాల్లేవు. ఏదో మొక్కుబడిగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకానీ టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపే కార్యక్రమాలు పెద్దగా చేయలేదు. అయితే ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో…
బెజవాడలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది.. ఇక, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోను.. నా కూతురు కూడా ఎన్నికల్లో పోటీ చేయదంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు.. టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని తెగేసే చెప్పినట్టు ప్రచారం సాగుతోంది.. దీంతో.. బెజవాడలో టీడీపీ పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది.. కార్పొనేషన్ ఎన్నికల సమయంలో.. టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు చెక్పెట్టేందుకు అప్పట్లో చంద్రబాబు రంగంలోకి దిగారు.. తర్వాత అంతా కేశినేని…
దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి.. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.. అయితే, మరోసారి విజయంపై కన్నేసిన వైసీపీ.. బద్వేల్ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధా పేరును ఖరారు చేసింది.. మాజీ ఎమ్మెల్యే డాక్టర్…
ఇవాళ జరిగిన భారత్ బంద్పై సెటైర్లు వేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు… రైతుల కోసం జరిగిన బంద్లో రైతులు ఎవరూ పాల్గొనలేదని విమర్శించిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా బంద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలవడం ఆశ్చర్యకరమైన విషయం అంటూ మండిపడ్డారు.. ఇక, వైసీపీ, టీడీపీ.. పార్లమెంట్లో కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన బిల్లులకు ఎందుకు మద్దతు తెలిపాయి? అని ప్రశ్నించారు సోము వీర్రాజు.. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు…
గులాబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని అలాగే… ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి నష్టాన్ని నివారించాలని పేర్కొన్నారు నారా చంద్రబాబునాయుడు. రాష్ట్రంలో గులాబ్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని… తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయని తెలిపారు. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారని…. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండంతో పంటలకు తీవ్ర నష్టం…
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలో ఎవరినీ నమ్మడం లేదా? అంటే అవుననే సంకేతాలే విన్పిస్తున్నాయి. టీడీపీ గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలవడం దగ్గరి నుంచి, పార్టీలోని సీనియర్లంతా వరుసబెట్టి బయటికి వెళుతుండటం చూస్తుంటే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఇక తాజాగా ఆపార్టీకి చెందిన ఎన్నికల వ్యూహకర్తకు సైతం చంద్రబాబు గుడ్ బై చెప్పినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లోనూ చంద్రబాబు వ్యూహాలే ఆపార్టీకి శరణ్యంగా మారనున్నాయనే టాక్ ఆపార్టీలో విన్పిస్తోంది. ఇప్పటికే ఈమేరకు…
టీడీపీకి ప్రతిపక్షంలో ఉండటం.. అధికారంలోకి రావడం కొత్తేమీ కాదు. గత కొన్ని దశాబ్ధాలుగా ఆపార్టీ ఇలానే కొనసాగుతూ వస్తోంది. అయితే గతంలో ఎన్నడూలేని విధంగా ఆపార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైన టీడీపీ ఏపీలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తోంది. అయితే గత ఓటమి నుంచి టీడీపీ ఇంకా తేరుకోలేదని ఆపార్టీ నేతల వైఖరి చూస్తుంటేనే అర్థమైపోతుంది. దీనికితోడు టీడీపీ సీనియర్లంతా వరుసబెట్టి గుడ్ బై చెబుతున్నారు.…