చంద్రబాబు కుటుంబం డ్రగ్స్ బిజినెస్..! వైసీపీ అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ వ్యవహారంలో ఏపీలోని అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది.. అయితే, ఈ వ్యవహారంలోకి చంద్రబాబు ఫ్యామిలీని లాగుతోంది వైసీపీ.. చంద్రబాబు కుటుంబం డ్రగ్స్ బిజినెస్సులోకి దిగిందేమోననే అనుమానం వస్తోంది అంటూ హాట్ కామెంట్లు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… పెద్ద ఎత్తున హెరాయిన్ పట్టుబడిన ఈ సందర్భంలో లోకేష్ ఎక్కడున్నారు..? అని ప్రశ్నించిన ఆయన.. లోకేష్ దుబాయ్లో ఉన్నారని మాకు సమాచారం ఉందన్నారు. తమ డబ్బులను విదేశాల్లో దాచిన చరిత్ర చంద్రబాబు కుటుంబానిది అని.. దీనిపై దర్యాప్తు సంస్థలు అసలు నిజాలు బయటపెట్టాలని కోరారు.. తమ వ్యవహారం బయటకి రాకుండా ఉండేందుకే టీడీపీ నేతలు వైసీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ప్రపంచంలో ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వానికి.. వైసీపీకి లింక్ పెడుతూ ప్రతిపక్షం ప్రచారం చేస్తోందని.. హెరాయిన్ విషయంలో రాష్ట్రానికేం సంబంధం లేకున్నా.. అదే పనిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని.. ఇదే సందర్భంలో అదానీ మీద పడ్డారంటూ ఫైర్ అయ్యారు.
రాజమౌళి, బోయపాటిలు వీళ్లతో ఉన్నారో.. లేక తెలుగుదేశం వాళ్లే డైరెక్టర్లుగా మారారో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించిన సజ్జల… అనవసరంగా ఈ వ్యవహారంలో విజయసాయి రెడ్డి, ద్వారంపూడి పేర్లను ప్రస్తావించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్పై ఎంతో కాలంగా ఆరోపణలు చేస్తున్నా.. జనం నమ్మడం లేదు.. అయినా, ఈ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారని.. అలీషా అనే వ్యక్తికి చంద్రబాబు.. ఘంటా శ్రీనివాస్ తోనే పరిచయం ఉందన్నారు.. వెతికితే చాలా పట్టుకోగలం.. వికీలీక్స్.. పారాడైజ్ పేపర్స్.. పనామా పేపర్స్.. ఇప్పుడు పండోరా పేపర్స్ అంటూ విమర్శలు చేసిన ఆయన.. పనామా పేపర్సులో హెరిటేజ్ సంస్థ ఇండిపెండెంట్ డైరెక్టర్ ప్రస్తావన ఉందని కామెంట్ చేశారు.. తెల్గీ స్కామ్, హసన్ అలీ కుంభకోణం, కోలా కృష్ణమోహన్ ఇదీ టీడీపీ చరిత్ర అంటూ ఎద్దేవా చేసిన వైసీపీ నేత… చంద్రబాబు స్వభావమే బూటకం.. జగన్పై వేసినవి తప్పుడు కేసులేనని ప్రజలు నమ్మారు కాబట్టే అధికారంలోకి వచ్చాం అన్నారు. హెరాయిన్ విషయంలో ప్రభుత్వంపై చేస్తోన్న విమర్శలపై న్యాయస్థానాలకు వెళ్తామని హెచ్చరించిన సజ్జల.. చంద్రబాబును ఎక్కడ తడిమినా అనేక కుంభకోణాలు బయటపడతాయన్నారు… ఇంటర్నేషనల్ స్కామర్సుకు కన్సల్టెంటుగా పని చేయగల సిద్దహస్తుడు చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
తాజావార్తలు
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?