మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేత చంద్రయ్యపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్య చేశారు. అయితే చంద్రయ్య అంత్యక్రియల్లో టీడీపీ అధినేత పాల్గొని మాట్లాడుతూ.. వైసీపీ హత్యారాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. దీనిపై స్పందంచిన ఎమ్మెల్యే జోగిరమేశ్ హత్యా రాజకీయాలకు పేటెంట్ అంతా చంద్రబాబుదేనని అన్నారు. ఒంటరిగా మమ్మల్ని ఎదుర్కొనే సత్తా లేకే చంద్రబాబు పొత్తుల కోసం ఆరాటపడుతున్నారని, పొత్తుల ద్వారా ప్రజా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. ప్రజలకు అభివృద్ది సంక్షేమ ఫలాలు బ్రహ్మాండంగా అందుతున్నాయని,…
భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఏపీలో సంబరాలు అంబరానంటాయి. వేకువజామునే భోగి మంటలు వేసి కోలాహలంగా కుటుంబ సమేతంగా అందరూ పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ రాజకీయ ప్రముఖులు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా కారంచేడులోని తన సోదరి పురందేశ్వరి నివాసంలో నందమూరి బాలకృష్ణ భోగి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలకు, భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సంపద పెంచే పండుగ సంక్రాంతి అని, పంటలు ఇంటికి…
మాచర్ల టీడీపీ ఇంచార్జీ జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరుడు చంద్రయ్యను నిన్న రాత్రి కొందరు దుండగులు కత్తులతో, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. వెల్దుర్తి మండలం గుండ్లపాడులోని చంద్రయ్య ఇంటి వద్ద ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చంద్రయ్య మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించేందుకు పోలీసులు యత్నించారు. అయితే బ్రహ్మరెడ్డి వచ్చేవరకు చంద్రయ్య మృతదేహాన్ని తరలించవద్దని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. పోలీసులు ఆలస్యంగా వచ్చారంటూ చంద్రయ్య కుటుంబ…
అసలే ఆ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. అలాంటి చోట కలిసి పోరాడాల్సిన టీడీపీలో మూడు ముక్కలాట సాగుతోంది. సమీక్షలు పెట్టి క్లాస్లు తీసుకున్నా.. నేతల తీరు మారడం లేదట. గందరగోళంలో పడిన కేడర్ దిక్కులు చూస్తోందట. ఫ్లెక్సీలు చించేయడంతో టీడీపీలో కలకలంప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో గడిచిన రెండు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు బూదాల అజితారావు. మొదటిసారి ఓడినప్పుడు ఏ విధంగా అయితే కేడర్కు కనిపించకుండా పోయారో.. రెండోసారీ నియోజకవర్గంలో అజితారావు అదే చేశారని…
తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం కోసం చంద్రబాబు తహతహ లాడుతున్నారు… కానీ ఆయన భాష చూస్తే జాలేస్తుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అధికారం ఎందుకు కోల్పోయామన్న ఆలోచన చంద్రబాబుకు లేదు… సొంత నియోజకవర్గంలో ఓటమిపై సమీక్ష జరపకుండా అనవసర వ్యాఖ్యలు చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అని చంద్రబాబు ఇంటింటికి వెళ్లి అడిగి ఉండాల్సింది. రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో చంద్రబాబు పేరు పోయింది. ఆయనకు జవసత్వాలు లేవు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు ఇక జిమ్మిక్కులు ఆపాలి……
పెద్దిరెడ్డికి పదవి, డబ్బు వచ్చిందనే అహంకారంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. చంద్రబాబు 14ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారు. అయ్యప్ప మాల ధరించిన పెద్దిరెడ్డి చంద్రబాబుపై సంస్కారహీనంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదన్నారు. సుదీర్ఘ కాలం సీఎంగా చేసిన చంద్రబాబుపై ఎప్పుడూ భూకబ్జా ఆరోపణలు రాలేదు. ఇప్పుడు వైసీపీ హయాంలో చిత్తూరు జిల్లాలో భూదందాలు, ఇసుక దందాలే. దందాలు చేసి సంపాదించిన డబ్బుతో…
ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ కొంత ప్రచారం జరుగుతోంది.. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నకల మూడ్లోకి వెళ్లిపోయినట్టు సభలు, సమావేశాలు, రాజకీయా నేతల పర్యటనలతో హీట్ పెంచుతున్నారు.. కోవిడ్ మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కాస్త వెనక్కి తగ్గినా.. స్టేట్మెంట్లు, ఆరోపణలు, విమర్శలతో మాత్రం హీట్ పెంచుతూనే ఉన్నారు.. అయితే, ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఇవాళ తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ముందస్తూ…
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తన స్వంత జిల్లా, స్వంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కుప్పంలోని సి. బండ్లపల్లెలో అక్రమ మైనింగ్ ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. కుప్పంలో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోందన్నారు. ఆఖండ సినిమాలో ఇలాంటి మైనింగ్ మాఫియాను చూశానన్నారు. సినిమాకు మించిన రీతిలో ఇక్కడ మైనింగ్ జరుగుతుంది. దీని వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు. మితిమీరుతున్న అక్రమ…
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో గత మూడు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ రోజు శెట్టిపల్లె గ్రామ సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. రామకుప్పం మండలం శివాజీ నగర్లో అంబేద్కర్ విగ్రహ వివాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎంగా ఉండే వ్యక్తి చేపల మార్కెట్ గురించి మాట్లాడుతారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారతి సిమెంట్ రేటు తగ్గించరు.. కానీ సినిమా టికెట్ లు తగ్గిస్తారట అంటూ విమర్శించారు. సీఎం జగన్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించారు. ఐఆర్…
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుప్పం నుంచే పోటీ చేస్తానని, గెలిచి సీఎంను అవుతానని ధీమా వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. మేము బెదిరిపోయే పరిస్థితి లేదు, చంద్రబాబుకి కాలం మూడింది అని ఆయన అన్నారు. చంద్రబాబు కుప్పంలోనే పోటీ చేస్తాను అనడాన్ని ఆహ్వానిస్తున్నామని, చంద్రబాబు పోటీ చేస్తాడు, కుప్పంలో ఓడిపోతాడు. పారిపోకూడదని మేము ఆశిస్తున్నాం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీ ఓటమి కుప్పంలో…