నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఎమ్మెల్యే ఆర్ కె రోజా ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన పైన త్రిసభ్య కమిటీ వేయడం శుభపరిణామం అన్నారు. హోంశాఖ ప్రత్యేక హోదా అంశంగా చెర్చడం సీఎం జగన్మోహన్ రెడ్డి సాధించిన విజయంగా మేము భావిస్తున్నాం అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎన్నోరకాలుగా పోరాటం చేశారు జగన్. ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక హోదా అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రిని…
ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు. మొన్న అర్థరాత్రి టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు అశోక్ బాబును నోటీసు తగిలించి సీఐడీ అధికారులు కిడ్నాప్ చేశారు. విచారణ పూర్తైన ఆరోపణలపై మళ్లీ కేసు నమోదు చేశారు. జగన్ ఉన్మాది ముఖ్యమంత్రి మొదటి ఎఫ్.ఐ.ఆర్.కు సెక్షన్లు ఎందుకు మార్చారు. అశోక్ బాబును అరెస్టు చేసి ఏం విచారణ చేశారు.రాష్ట్రంలో చట్టప్రకారం పాలన జరగాలి.పోలీసులు కూడా చట్టప్రకారమే వ్యవహరించాలి.లేకపోతే ప్రైవేటు కేసులు వేస్తాం.ప్రజలకు…
నకిలీ సర్టిఫికెట్ వ్యవహరంలో టీడీపీ నేత అశోక్బాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలని నాని మీడియాతో మాట్లాడుతూ.. అశోక్ బాబు ఏం తప్పు చేశారని సిగ్గులేకుండా అడుతున్నారని, చంద్రబాబు దొంగల ముఠా నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అశోక్బాబు దొంగ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు పొందాడని, అయినా.. అశోక్బాబుపై కంప్లైంట్ చేసింది తన సహోద్యోగేనని ఆయన అన్నారు. ఇలా వేరొకరి రావాల్సిన పదోన్నతలు నకిలీ సర్టిఫికెట్లతో తను అనుభవించడం తప్పుకాదా…
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యపై నిలదీస్తున్నందుకే.. ప్రభుత్వం కక్ష గట్టి అరెస్ట్ చేయించిందని ఆరోపించారు. అసలు అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని… సర్వీస్ మేటర్స్లో తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. జగన్ చేస్తున్న ప్రతి తప్పుకు త్వరలోనే మూల్యం చెల్లించక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. అటు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు అరెస్టుపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా…
అధికారం కోల్పోయినా అక్కడి నేతల్లో మార్పు రావడంలేదా? ఆధిపత్య పోరుతో పార్టీ ప్రతిష్ట మంటగలుపుతున్నారా? కీలక నేతలే సొంతగూటిలో చీలికలకు కారణమా? పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నా సొంత లాభానికే మొగ్గు చూపుతున్నారా? ఎవరా నాయకులు.. తెరవెనక వేస్తున్న ఎత్తుగడలేంటి? సిక్కోలు జిల్లాలో టీడీపీ కీలకనేతల మధ్య కోల్డ్వార్టీడీపీ కంచుకోట సిక్కోలు జిల్లా. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇక్కడి ప్రజలు పార్టీకి అండగా ఉండి.. మెజార్టీ స్థానాలు కట్టబెడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గాలిలోనూ ఒక…
టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ స్ట్రాటజీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఉద్యోగులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రాయితీల్లో కోత విధించిందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా సజ్జల ఉద్యోగుల్ని బెదిరించారని ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన అనేక రాయితీల్లో ఈ ప్రభుత్వం కోత విధించడం సీఎం పెద్ద మనస్సుకు నిదర్శనమా? అల్ప బుద్ధికి నిదర్శనమా? అని ఆయన ప్రశ్నించారు. కరెంటు కోతలు వెంటనే నివారించాలని, విద్యుత్ ఛార్జీల భారాలు తగ్గించాలని,…
ఏపీలో గురుకుల విద్యాసంస్థలకు దివంగత లోక్సభ స్పీకర్ బాలయోగి పేరును తొలగించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాలకు బాలయోగి పేరును తొలగించడం తీవ్ర అభ్యంతరకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దళితుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన బాలయోగి పేరును వైసీపీ ప్రభుత్వం తొలగించడం దారుణమన్నారు. అంబేద్కర్ పేరునే పెట్టాలని ప్రభుత్వం భావిస్తే.. జగన్, వైఎస్ఆర్ పేరుతో కార్యక్రమాలకు ఆ పేరు తొలగించి అంబేద్కర్ పేరు పెట్టవచ్చని సూచించారు. Read Also: ఆందోళనలు కొనసాగిస్తాం.. స్పష్టం…
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు కొన్ని ప్రాంతాల్లో చిచ్చు పెడుతున్నాయి.. జిల్లా పేరు కోసం కొందరు.. జిల్లా కేంద్రం కోసం మరొకరు.. గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఇంకొద్దరు డిమాండ్ చేస్తున్నారు.. అలాంటి జిల్లాలో ఒకటి అనంతపురం జిల్లాలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న సత్యసాయి జిల్లా.. దీనిపై ర్యాలీ చేసి దీక్షకు దిగిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. హిందూపురం కేంద్రంగానే జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. అన్ని రకాలుగా హిందూపురం అభివృద్ధి చెందింది.. జిల్లా కేంద్రంలో…
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గారపాటి సాంబశివరావు అనారోగ్యంతో మరణించారు. ఆయన వయసు 75 ఏళ్ళు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా వున్న సాంబశివరావు ఇవాళ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడెంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో వున్న ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. సాంబశివరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తెలుగుదేశం సీనియర్ నాయకులు, మాజీ మంత్రి గారపాటి సాంబశివరావుగారి మరణం విచారకరం. ప్రజల్లో…
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం.. అభ్యంతరాలను స్వీకరిస్తోంది.. కొత్త జిల్లా కేంద్రాలు, పేర్లపై పలు విమర్శలు, విజ్ఞప్తులు వస్తున్నాయి.. కొందరి నుంచి ప్రశంసలు కూడా లభిస్తున్నాయి.. అయితే, కొత్త జిల్లాల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ప్రకాశం జిల్లాలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ జిల్లాగా మార్చడం అభినందనీయం అన్నారు.. ఎన్టీఆర్ పేరుని చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విస్మరించారని మండిపడ్డ…