Harish Rao : తెలంగాణలో ప్రాజెక్టుల కూల్చివేత, పాలకపక్షం-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరిపోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడుతూ, “కొంతమంది మూర్ఖులు గాంధీ భవన్లో కూర్చొని కాళేశ్వరం కూలిపోయిందంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఓ మూర్ఖులారా! ఒక్కసారి సిద్ధిపేటకి వచ్చి గలగల పారుతున్న గోదావరి జలాలు చూసి కళ్లు తెరవండి,” అంటూ హరీష్ రావు ఘాటుగా స్పందించారు. హరీష్ రావు…
Jeevan Reddy : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. 2019 కు ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం బరిలో నిలిస్తే రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచారని, ఉద్యోగులు, ఉపాద్యాయులు, నిరుద్యోగులు తరఫున మండలి లో ప్రశ్నించే గొంతుగా అందరి సమస్యలు చర్చకు తీసుకు వచ్చానన్నారు.…
కేంద్రమంత్రి బండి సంజయ్పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్తో పోల్చి భారతదేశం గొప్పతనాన్ని తగ్గించొద్దని హెచ్చరించారు. దేశ గౌరవాన్ని తగ్గిస్తున్న బండి సంజయ్ను బీజేపీ పెద్దలు నియంత్రించాలని కోరారు. పాకిస్తాన్తో పోల్చి దేశాన్ని కించపరచడం తప్ప.. మీరు దేశానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారతీయులంతా నా సోదరులే అన్న మీరు, భారత రాజ్యాంగాన్ని కాపాడతానని చెప్పిన మీరు.. అధికారం కోసం విద్వేష ప్రసంగాలు చేయడం అవసరమా?…
తెలంగాణలో జనాభాకి అనుగుణంగా లెక్కలు లేవని.. 4.30 కోట్లు జనాభా ఉంటే 3.70 కోట్లు మాత్రమే చూపెట్టారని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ సర్వే చేస్తే 52 శాతం బీసీ జనాభా ఉంటే.. కాంగ్రెస్ సర్వేలో 46 శాతం మాత్రమే ఉందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకూ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం 1.08 లక్షల కోట్లు ఇచ్చిందని, నిరూపిస్తాం…
Bandi Sanjay : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగమంతా పచ్చి అబద్దాలు, అర్ధ సత్యాలతో నిండిపోయిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటమి ఖాయమనే భయం ఆయనలో స్పష్టంగా కన్పిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంటెలిజెన్స్ సహా అన్ని సర్వే సంస్థలన్నీ బీజేపీ గెలుపు తథ్యమని తేల్చేశాయని, కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోతుందని నివేదికలివ్వడంతో దిక్కుతోచని ముఖ్యమంత్రి హడావుడిగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి…
Kishan Reddy : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో బీజేపీ తన వ్యూహాన్ని స్పష్టంగా ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “1960 నుండి బీజేపీ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తుంది” అని పేర్కొన్నారు. ఇది పార్టీకి కొత్త పోటీ కాదని, గత అనుభవంతో ఈ ఎన్నికల్లో విజయంపై పూర్తి విశ్వాసం…
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. పట్టభద్రులు గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచించాలని కోరుతూ, బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత పట్టభద్రుల లే కదా. వీరు ఎవ్వరికి ఓటు వేస్తారు?…
ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది చిక్కుకొని ఉంటే.. ప్రభుత్వ హెలికాప్టర్లో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అవడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగితే నానా హంగామా చేశారని, కాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలో మూడు ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగాయన్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని ప్రకృతి వైపరీత్యం అంటున్న ప్రభుత్వం.. కాలేశ్వరం ప్రమాదాన్ని అప్పటి ప్రభుత్వ…
మాజీ సీఎం కేసీఆర్ వీరాభిమాని, దివ్యాంగుడైన చిర్రా సతీశ్ జిరాక్స్ సెంటర్ను ఎమ్మెల్సీ కవిత సోమవారం ప్రారంభించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగుడైన సతీశ్కు ఆర్థికంగా చేయూతనందించిన కవిత.. నేడు ‘కేసీఆర్’ ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్ను ఆరంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్ రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మాజీ ఎంపీ మలోత్ కవిత పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రామానుజపురం గ్రామానికి చెందిన ఉద్యమ…
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అర్థమైందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. అధికార పార్టీ (కాంగ్రెస్) తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను అరువు తెచ్చుకుందని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ (బీఆర్ఎస్)కి బరిలో నిలబడే అభ్యర్థులు కరువయ్యారని సెటైర్లు విసిరారు. బీఆర్ఎస్ హయంలో రాష్ట్రం దివాలా తీస్తే.. కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం…