MLC Vijayashanti : తెలంగాణ ఉద్యమం చేసింది నేనే – కేసీఆర్కు తెలంగాణ సొంతం కాదు
- తెలంగాణ కోసం నా పోరాటం కొనసాగుతుంది
- బీజేపీ మాట తప్పింది – అందుకే బయటకు వచ్చా
- ఏడు లక్షల కోట్ల అప్పు – కేసీఆర్ సమాధానం చెప్పాలి : విజయశాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Vijayashanti : తెలంగాణ రాజకీయాల్లో విజయశాంతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె బీఆర్ఎస్పై, కేసీఆర్పై, అలాగే బీజేపీ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీని బలవంతంగా విలీనం చేశారని ఆమె ఆరోపించారు. విజయశాంతి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో తాను కేసీఆర్ కంటే ముందే క్రియాశీలంగా పాల్గొన్నానని, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్కు సొంతం కాదని స్పష్టం చేశారు. “నా పార్టీని బలవంతంగా విలీనం చేశారు. తెలంగాణ కోసం నేను పోరాడిన ఫలితం ఇదేనా? నిజాలు మాట్లాడండి,” అని ఆమె వ్యాఖ్యానించారు.
ఒక ఓటుతో రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంటుందన్న వాగ్దానాన్ని బీజేపీ తప్పించుకుందని, ఆ కారణంగా తాను ఆ పార్టీని వీడానని విజయశాంతి స్పష్టం చేశారు. “తెలంగాణను వ్యతిరేకించిన శక్తులను బీజేపీ రాష్ట్రంలోకి రప్పిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,” అని ఆమె హెచ్చరించారు.
Also Read
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
- CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
- Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్షీట్
- Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ తనపై అనవసర విమర్శలు చేస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు. “ఎందుకు అంత కుట్రబుద్ధి? దొరబుద్ధి చూపిస్తున్నారు. బడుగుల బలహీన వర్గాలను చూడకుండా, తెలంగాణను కార్పొరేట్ లబ్ధిదారులకు అంకితం చేశారు,” అంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
తెలంగాణను ఉద్యమకారుడి చేతిలో పెట్టిన ప్రజలు ఇప్పుడు ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎలా నష్టపరిచారో చూస్తున్నారని ఆమె అన్నారు. “ఏం చేశావో చెప్పు. చేసిన తప్పులు ఒప్పుకో. కేసీఆర్ను వదిలిపెట్టకూడదు. లక్షలాది ప్రజల ఆశయాలను మోసం చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసింది ఎవరు?” అంటూ విజయశాంతి ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడటమే తన ధ్యేయమని విజయశాంతి స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాజకీయ పరంగా మరింత దూకుడుగా వ్యవహరించనున్నట్లు ఆమె సంకేతాలు ఇచ్చారు.
YCP: గవర్నర్ను కలిసిన వైసీపీ నేతల బృందం.. పలు అంశాలపై ఫిర్యాదు
తాజావార్తలు
-
Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
-
Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
-
Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
-
Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్షీట్
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!