MLC Vijayashanti : తెలంగాణ ఉద్యమం చేసింది నేనే – కేసీఆర్కు తెలంగాణ సొంతం కాదు
- తెలంగాణ కోసం నా పోరాటం కొనసాగుతుంది
- బీజేపీ మాట తప్పింది – అందుకే బయటకు వచ్చా
- ఏడు లక్షల కోట్ల అప్పు – కేసీఆర్ సమాధానం చెప్పాలి : విజయశాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Vijayashanti : తెలంగాణ రాజకీయాల్లో విజయశాంతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె బీఆర్ఎస్పై, కేసీఆర్పై, అలాగే బీజేపీ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీని బలవంతంగా విలీనం చేశారని ఆమె ఆరోపించారు. విజయశాంతి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో తాను కేసీఆర్ కంటే ముందే క్రియాశీలంగా పాల్గొన్నానని, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్కు సొంతం కాదని స్పష్టం చేశారు. “నా పార్టీని బలవంతంగా విలీనం చేశారు. తెలంగాణ కోసం నేను పోరాడిన ఫలితం ఇదేనా? నిజాలు మాట్లాడండి,” అని ఆమె వ్యాఖ్యానించారు.
ఒక ఓటుతో రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంటుందన్న వాగ్దానాన్ని బీజేపీ తప్పించుకుందని, ఆ కారణంగా తాను ఆ పార్టీని వీడానని విజయశాంతి స్పష్టం చేశారు. “తెలంగాణను వ్యతిరేకించిన శక్తులను బీజేపీ రాష్ట్రంలోకి రప్పిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,” అని ఆమె హెచ్చరించారు.
Also Read
- Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ తనపై అనవసర విమర్శలు చేస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు. “ఎందుకు అంత కుట్రబుద్ధి? దొరబుద్ధి చూపిస్తున్నారు. బడుగుల బలహీన వర్గాలను చూడకుండా, తెలంగాణను కార్పొరేట్ లబ్ధిదారులకు అంకితం చేశారు,” అంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
తెలంగాణను ఉద్యమకారుడి చేతిలో పెట్టిన ప్రజలు ఇప్పుడు ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎలా నష్టపరిచారో చూస్తున్నారని ఆమె అన్నారు. “ఏం చేశావో చెప్పు. చేసిన తప్పులు ఒప్పుకో. కేసీఆర్ను వదిలిపెట్టకూడదు. లక్షలాది ప్రజల ఆశయాలను మోసం చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసింది ఎవరు?” అంటూ విజయశాంతి ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడటమే తన ధ్యేయమని విజయశాంతి స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాజకీయ పరంగా మరింత దూకుడుగా వ్యవహరించనున్నట్లు ఆమె సంకేతాలు ఇచ్చారు.
YCP: గవర్నర్ను కలిసిన వైసీపీ నేతల బృందం.. పలు అంశాలపై ఫిర్యాదు
తాజావార్తలు
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
-
Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
-
RC17లో రామ్ చరణ్కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!