Minister Harish Rao: కర్ణాటక ఎన్నికలకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఈ ఎన్నికలను చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మంత్రి హరీష్ రావు కర్ణాటక ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాస్ట్రంలో తామంతా వెళ్లి ప్రచారం చేస్తామని అన్నారు. కర్ణాటకలో మంచి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు.…
kishan reddy: విశాఖ స్టీల్ ఫ్లాంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత వారం రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామని సింగరేణి ఆధికారులను ఆఘమేఘాల మీద అక్కడికి పంపించి రాజకీయ డ్రామాకు తెరతీశారన్నారు.
Minister Jagadish Reddy: 25 ఏళ్లుగా నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్న గుజరాత్ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క అవార్డు రాలేదని విమర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి. కోదాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు.
Minister Harish Rao: భారత దేశంలో తెలంగాణ తప్పా ఏ రాష్ట్రం కూడా ముస్లింలకు రంజాన్ పండగ కానుకలను అందించలేదని, గత ప్రభుత్వాలు ముస్లింలకు పండగ కానుకను అందించలేదని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్ధిపేటలోని కొండ భూదేవి గార్డెన్స్ లో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ కానుకలను హరీష్ రావు పంపిణీ చేశారు. రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల పండగలకు సరుకులు అందిస్తున్నారమని ఆయన వెల్లడించారు.
Bhatti Vikramarka: కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మంత్రి హారీష్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిజామాబాద్ ఆస్పత్రిలో జరిగిన సంఘటనను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. హరీష్ రావు వైద్యారోగ్య శాఖ, ఆర్థిక శాఖను వదిలేసి భజన శాఖను తీసుకున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిని అడిగి హరీష్ రావు భజన శాఖను తీసుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిజామాబాద్ ఆసుపత్రిలో పేషెంట్లు స్ట్రేచర్లు లేక కాళ్లు పట్టుకుని గుంజుకుపోవాల్సిన…
హుజూరారాబాద్, మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన వందల కోట్లు ఎక్కడివి? అని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన వాఖ్యలు చేశారు. నా మాటలపై అబిడ్స్ లో లేదా హుజురాబాద్ చర్చ పెట్టుకుందామా అని సవాల్ విసిరారు. నువ్వు వస్తావా? నీ బానిసలు వస్తారా? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కొందరు నాయకులు స్వార్థం కోసం కేసీఆర్ చెయ్యి వదిలి పెట్టారు. ఆ..నాయకులందరు శంకరగిరి మాన్యాలకు పోక తప్పదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో పది స్థానాల్లో ఎట్లా అసెంబ్లీ గేట్లను తాకుతారో మనం చూద్దామని సవాల్ విసిరారు.
Uttam Kumar Reddy: సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డి గ్రామంలో ఎంపీటీసీ ఎర్రం శ్రీనివాస్రెడ్డిని ఎస్ఐ లోకేష్ అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డిపై దాడి చేసిన ఎస్ఐ లోకేష్పై చర్యలు తీసుకోవాలని డీజీపీ, ఎస్పీలను ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు.
ఎంఎన్ జే కాన్సర్ ఆసుపత్రి నూతన బ్లాక్ ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ప్రస్తుతం ఓల్డ్ బ్లాక్ 450 బెడ్స్ ఉండగా, ఈ నూతన బ్లాక్ తో మరో 300 బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి.
Bandi Sanjay: ఈడీ వస్తుందంటే కాలు విరుగుతుంది, సీబీఐ వస్తుందంటే దుబాయి వెళ్తారు, ఇలాంటి నాయకులు బీఆర్ఎస్ లో ఉన్నారంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వరంగల్ లో జరిగిన నిరుద్యోగ మార్చ్ లో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై పలు విమర్శలు గుప్పించారు. ఇదే వరంగల్ గడ్డపై తనను అరెస్ట్ చేశారని, కేసీఆర్ కి బలగం కేవలం కొడుకు, కూతురు, అల్లుడే అని, బీజేపీకి బలగం తెలంగాణ ప్రజలని…